పదిమంది మంచి కోసం సాగించిన ఒక పోరాటం కారణంగా నటుడు కృష్ణ కౌశిక్ చంచల్గూడ సెంట్రల్ జైలులో రెండు వారాల పాటు గడిపిన అనూహ్య అనుభవాలను వెల్లడించారు. ఈ కాలం తన జీవితంలో ఊహించని మలుపు అని, ఎన్నో కొత్త పాఠాలను నేర్పిందని ఆయన వివరించారు. కృష్ణ కౌశిక్ బేసిక్గా అగ్రెసివ్ స్వభావం కలవారని, అన్యాయంపై పోరాడటం తన నైజమని తెలిపారు. తన సోదరుడు ఆదిత్య కూడా ఈ పోరాటంలో తనతో ఉన్నా, తనంత చురుగ్గా పాల్గొనలేదని చెప్పారు. జైలుకు వెళ్ళడం తన కెరీర్ను వ్యక్తిగతంగా ప్రభావితం చేస్తుందని తాను అస్సలు ఊహించలేదన్నారు. చంచల్గూడ జైలులోని జనరల్ బ్యారక్లో దాదాపు 80 మంది ఖైదీలతో కలిసి ఉన్నానని, అది ఒక హాస్యభరితమైన ఎపిసోడ్లా అనిపించిందని కౌశిక్ గుర్తుచేసుకున్నారు. ఖైదీలకు స్టీల్ బకెట్, గ్లాస్ ఇచ్చేవారని, వాటికి గొలుసు ఉండేదని తెలిపారు. ఉదయాన్నే కాఫీని ఆ బకెట్లోనే పోసేవారట. ప్లేట్, గ్లాస్ లాంటి వ్యక్తిగత వస్తువులను పక్కన పెడితే వెంటనే వాటిని ఇతరులు దొంగిలించేవారని, కానిస్టేబుల్ను అడిగితే జాగ్రత్తగా ఉండాలి, దొంగలు ఉంటారు అని చెప్పేవారని ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
అక్కడ అత్యంత షాకింగ్ విషయాలలో ఒకటి డోర్లు లేని బాత్రూమ్లు. కేవలం ఒక చిన్న కర్టెన్ మాత్రమే అడ్డుగా ఉండేదని, ఇది గోప్యతకు తీవ్ర ఆటంకం కలిగించిందని ఆయన వివరించారు. భోజనం కూడా ప్లాస్టిక్ బకెట్లలో సాంబార్ లాంటివి వడ్డించేవారని, ఆ రోజు ఆకలి వేసినా భోజనం చేయలేకపోయానని కృష్ణ కౌశిక్ తెలిపారు. ప్రతి బ్యారక్కు ఒక ఖైదీ ఇన్చార్జ్గా ఉండేవాడని, తమ బ్యారక్కు ఇన్చార్జ్గా ఉన్న 20 ఏళ్ల యువకుడి గురించి కౌశిక్ ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నారు. ఆ యువకుడు కన్నడ సినిమాలకు టచ్-అప్ ఆర్టిస్ట్ అని, ఒక హీరోయిన్ను ప్రేమించి, ఆమె తిరస్కరించినందుకు హెయిర్ డ్రెస్సింగ్ కోంబ్తో ఆమెపై, ఆమె తండ్రిపై దాడి చేసి హత్యాయత్నం కేసులో ఇక్కడకు వచ్చాడని తెలిపారు. అతను కౌశిక్ని చూసి “అన్నా, నీ యాక్షన్ సూపర్. నీ నెక్స్ట్ సినిమాలు ఏంటి?” అని అడగటం తనను ఆశ్చర్యపరిచిందని చెప్పారు.
జైలర్ కౌంటింగ్కు వచ్చినప్పుడు, కౌశిక్తో “మీరు పోరాడుతున్న కాజ్ మంచి కాజ్ సార్. అది ఎప్పటికైనా మీకు పే అవుతుంది” అని చెప్పినప్పుడు తనకు ఆనందంతో కన్నీళ్లు వచ్చాయని తెలిపారు. ఈ మాటలు తనకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇచ్చాయని, తాను అనుభవించిన ఈ కష్టం తన కోసం కాకుండా పదిమంది మంచి కోసమేనని గ్రహించానని చెప్పారు. అయితే, తాను కష్టంలో ఉన్నప్పుడు బయట నుండి, ముఖ్యంగా ఖాళీగా ఉన్నవారు కూడా మద్దతు ఇవ్వకపోవడం తనకు నిరాశ కలిగించిందని కృష్ణ కౌశిక్ వ్యక్తం చేశారు. మొత్తం 11 మందితో కలిసి ఈ పోరాటంలో పాల్గొన్నట్లు ఆయన వెల్లడించారు.
ఎక్కువ మంది చదివినవి : Tanikella Bharani: ఆ హీరో చాలా గొప్ప మనిషి.. ఆయన పేరు వినగానే రజినీకాంత్ సిగరెట్ పడేసి నిలబడ్డారు.. తనికెళ్ల భరణి..
నటుడు కౌశిక్..Kaushik New
ఎక్కువ మంది చదివినవి : Sudhakar : నేను కోమాలో ఉన్నప్పుడు ఆసుపత్రికి వచ్చి చూసిన హీరో అతడే.. నటుడు సుధాకర్..
నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అందులో డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో రాబోతున్న సినిమా ఒకటి. వీరిద్దరి కాంబోలో రాబోయే ప్రాజెక్ట్ పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా ఈ సినిమా అనౌన్స్మెంట్ నుంచే హైప్ నెలకొంది. పవర్ ఫుల్ మాస్ కథను బాలయ్య కోసం సిద్దం చేశారట కొరటాల శివ. అయితే ఇప్పుడు ఈ సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ చక్కర్లు కొడుతుంది. అదేంటంటే.. ఈ సినిమాలో కీలకపాత్ర కోసం యంగ్ హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ ను ఎంపిక చేసినట్లు నెట్టింట వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పటివరకు గ్లామర్ రోల్స్ కాకుండా.. హోమ్లీ, పద్దతైన పాత్రలతో ప్రేక్షకులకు దగ్గరైంది ఈ ముద్దుగుమ్మ. అయితే ఇప్పుడు బాలయ్య సినిమాలో మాత్రం ఈ అమ్మడు పూర్తి స్థాయి నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపిస్తారని టాక్ నడుస్తుంది. ఒకవేళ అదే నిజమైతే.. బాలయ్యకు ధీటుగా లేడీ విలన్ గా ఐశ్వర్యను చూడబోతున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ ప్రాజెక్ట్ పై మరింత హైప్ క్రియేట్ అయ్యింది.
ఎక్కువ మంది చదివినవి : Sudhakar : నేను కోమాలో ఉన్నప్పుడు ఆసుపత్రికి వచ్చి చూసిన హీరో అతడే.. నటుడు సుధాకర్..
ఐశ్వర్య రాజేష్.. సౌత్ ఇండస్ట్రీలో సహజమైన నటనతో తనదైన ముద్ర వేసింది. ముఖ్యంగా తమిళంలో వరుస సినిమాలతో స్టార్ డమ్ సంపాదించుకుంది. అచ్చ తెలుగు అమ్మాయి అయినా ఈ అమ్మడు.. ప్రస్తుతం తెలుగు, తమిళంలో వరుస అవకాశాలతో దూసుకుపోతుంది. కంటెంట్ ప్రాధాన్యత ఉన్న చిత్రాలను ఎంచుకుంటూ ప్రేక్షకులను అలరిస్తుంది ఈ ముద్దుగుమ్మ. గతేడాది వెంకటేశ్ సరసన సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఈ మూవీ దాదాపు రూ.300 కోట్లకు పైగా వసూల్లు చేసింది.
ఎక్కువ మంది చదివినవి : Tanikella Bharani: ఆ హీరో చాలా గొప్ప మనిషి.. ఆయన పేరు వినగానే రజినీకాంత్ సిగరెట్ పడేసి నిలబడ్డారు.. తనికెళ్ల భరణి..
తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఈ అమ్మడు.. ప్రస్తుతం అవకాశాల కోసం ఎదురుచూస్తుంది. అటు వెండితెరపై, ఇటు ఓటీటీలో తనదైన నటనతో అలరిస్తుంది. ఇటీవలే ఇసకపట్నం సిరీస్ ద్వారా ఓటీటీ సినీ ప్రియులను అలరించింది. ఇప్పటివరకు కథానాయికగా రాణించిన ఈ అమ్మడు.. విలన్ పాత్రలో బాలయ్యకు ధీటుగా ఎలా నటిస్తుందో చూడాలి.
ఎక్కువ మంది చదివినవి : ఎక్కువ మంది చదివినవి : Kota Srinivasa Rao : ఆ హీరోలగా చేయాలంటే ఇంకో జన్మ ఎత్తాలి.. ఆరోజు అతడి కష్టాన్ని కళ్లరా చూశా.. కోట శ్రీనివాస్ రావు..
ఐశ్వర్య రాజేశ్ పోస్ట్..View this post on Instagram
A post shared by Aishwarya Rajesh (@aishwaryarajessh)
ఎక్కువ మంది చదివినవి : ఎక్కువ మంది చదివినవి : Srikanth: ఆ సినిమా తర్వాత నా గ్రాఫ్ మొత్తం పడిపోయింది.. చాలా దెబ్బ పడింది.. హీరో శ్రీకాంత్..
ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ICAI)లో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న చార్టర్డ్ అకౌంటెంట్లకు భారీ జీతంతో నోటిఫికేషన్ విడుదల చేసింది. ICAI సంస్థలో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ ప్రకటన జారీ చేసింది. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా జూలై 31, 2026లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఈ నియామకాల ద్వారా మొత్తం 50 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
ICAIలో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు తప్పనిసరిగా చార్టర్డ్ అకౌంటెంట్ (CA) ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్ధుల వయస్సు 2026 జూన్ 30 నాటికి 25 సంవత్సరాలు మించరాదు. ఈ అర్హతలు కలిగిన వారు ఆన్లైన్ విధానంలో ముగింపు గడువులోగా దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుంది. దరఖాస్తు ఫీజు కింద ప్రతి ఒక్కరూ రూ.500 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులకు ఆకర్షణీయమైన వేతనం అందించనున్నారు. వార్షిక వేతనం దాదాపు రూ.15.68 లక్షలుగా నిర్ణయించారు. అభ్యర్థుల ఎంపిక కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష (CBT) ద్వారా జరుగుతుంది. పరీక్షలో ప్రతిభ కనబరిచిన వారికి నియామక అవకాశాలు కల్పిస్తారు. దరఖాస్తుల ప్రక్రియ ఇప్పటికే జూలై 18, 2026 నుంచి ప్రారంభమైంది. ఆసక్తి గల అభ్యర్థులు జూలై 31, 2026లోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. రాత పరీక్షను ఆగస్టు 16, 2026న నిర్వహించనున్నారు. చార్టర్డ్ అకౌంటెంట్ అర్హత కలిగిన యువతకు కేంద్ర స్థాయి సంస్థలో మంచి వేతనంతో ఉద్యోగం పొందేందుకు ఇది మంచి అవకాశం.
ICAIలో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ముఖ్యమైన వివరాలు..- పోస్టు పేరు: ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్
- ఖాళీలు: 50
- అర్హత: చార్టర్డ్ అకౌంటెంట్ (CA)
- వయోపరిమితి: 30 జూన్ 2026 నాటికి 25 ఏళ్లు మించరాదు
- వేతనం: ఏడాదికి రూ.15.68 లక్షలు
- దరఖాస్తు ఫీజు: రూ.500
- దరఖాస్తు విధానం: ఆన్లైన్
- చివరి తేదీ: 31 జూలై 2026
- పరీక్ష తేదీ: 16 ఆగస్టు 2026
ICAIలో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
తల్లికి వందనం పథకంపై కూటమి సర్కార్ అదిరిపోయే గుడ్న్యూస్ చెప్పింది. విద్యార్థులు ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న తల్లికి వందనం పథకాన్ని బుధవారం అమలుచేసేందుకు ప్రభుత్వం అన్ని సిద్ధం చేసింది. ఈ మేరకు ప్రభుత్వం అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఎలాంటి పొరపాటు లేకుండా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మొత్తం 64,76,590 మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.13వేల నిధులు జమకానున్నాయి.
అయితే రాష్ట్రంలోని పేద విద్యార్థుల చదువులకు అండగా ఉండేందుకు కూటమి సర్కార్ ఈ తల్లికి వందనం అనే పథకాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోంది. ఈ పథకం రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న అర్హులైన ప్రతి విద్యార్థికి రూ.15వేల ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం అందిస్తుంది. అయితే ఈ మొత్తం రూ.15 నిధులను నేరుగా విద్యార్థి ఖాతాలో కాకుండా.. రూ.13వేలు విద్యార్థుల తల్లి అకౌంట్లో జమ చేయనుండగా.. మిగతా రూ.2వేలు విద్యార్థులు చదువుతున్న స్కూల్ అకౌంట్లో జమ చేయనున్నారు.
అయితే ఈ పథకం అమలుకు ముందు విద్యార్థులకు ప్రభుత్వం కొన్ని సూచనలు చేసింది. అకౌంట్లో డబ్బులు జమ కావాలంటే.. విద్యార్థి తల్లి ఖాతాకు కచ్చితంగా ఆధార్ లింక్ అయి ఉండాలని తెలిపింది. ఎవరైనా ఇంకా అకౌంట్కు ఆధార్ లింక్ లేకపోతే.. వెంటనే అప్డేట్ చేయించుకోవాలని సూచింది. అకౌంట్కు ఆధార్ లింక్ అయి లేకపోతే.. వారికి తల్లికి వందనం డబ్బులు జమ కాకపోవచ్చని తెలిపింది.
జులై 22వ తేదీన 64,76,590 మంది విద్యార్థులకు రూ.15,000 చొప్పున తల్లికి వందనం నిధులను జమ చేయడానికి కూటమి ప్రభుత్వం సర్వం సిద్ధం చేసింది.#TallikiVandanam#IdhiManchiPrabhutvam#ChandrababuNaidu#NaraLokesh#AndhraPradesh pic.twitter.com/NfWWO6AvTE
— Telugu Desam Party (@JaiTDP) July 19, 2026
అలాగే పథకాన్ని అమలు చేస్తున్న వేళ లబ్ధిదారులను ప్రభుత్వం అప్రమత్తం చేసింది. అకౌంట్లో డబ్బులు పడడాన్ని అవకాశాంగా చేసుకొని కొందరు సైబర్ నేరగాళ్లు సొమ్ము కాజేసే అవకాశం ఉందని కర్నూలు ఎస్పీ హెచ్చరించారు. విద్యార్థుల తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సోషల్ మీడియా ద్వారా వచ్చే మోసపూరిత లింకులపై క్లిక్ చేయవద్దని తెలిపారు. తెలియని వ్యక్తులకు ఆధార్ కార్డు, బ్యాంకు అకౌంట్, ఓటీపీ వివరాలు చెప్పవద్దని తెలిపారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
తెలంగాణలో మరో కొత్త ఎయిర్పోర్ట్ రానుంది. అదే వరంగల్ మామునూరు ఎయిర్పోర్ట్. ఈ ఎయిర్పోర్ట్ నిర్మాణంపై ఎప్పటినుంచో చర్చలు సాగుతున్నాయి. రేవంత్ సర్కార్ అధికారంలోకి వచ్చాక దీనిపై మరింత కసరత్తు పెంచింది. కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతూ ఎయిర్పోర్ట్ నిర్మాణం స్టార్ట్ అయ్యేలా ప్రణాళికలు రచిస్తోంది. ఈ క్రమంలో ఎయిర్పోర్ట్ నిర్మాణంపై తాజాగా కీలక అప్డేట్ లభించింది. వరంగల్ మామునూరు ఎయిర్పోర్ట్కు ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అనుమతులు మంజూరు చేసింది. ఈ విషయాన్ని కేంద్ర పౌర విమానయానశాఖ సహాయమంత్రి మురళీధర్ మొహోల్ స్పష్టం చేశారు. ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా రాజ్యసభలో కాంగ్రెస్ ఎంపీలు వేం నరేందర్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్లు అడిగిన ప్రశ్నలకు మురళీథర్ మొహోల్ రాతపూర్వకంగా సమాధానాలు ఇచ్చారు.
అనుమతులు జారీఈ సందర్బంగా వరంగల్ ఎయిర్పోర్టుకు రూ.496.86 కోట్ల అంచనా వ్యయంతో సూత్రప్రాయ అనుమతులు మంజూరు చేసినట్లు మురళీధర్ మొహోల్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ ప్రక్రియ, అవసరమైన చట్టబద్దమైన అనుమతులు, మౌలిక సదుపాయాలు వేగంగా చేపడితే ఎయిర్ పోర్ట్ నిర్మాణం త్వరితగతిన పూర్తవుతుందని చెప్పారు. త్వరలోనే ఎయిర్పోర్ట్కు శంకుస్థాపన పనులు చేపడతామని అన్నారు. అటు ఆదిలాబాద్తో పాటు పెద్దపల్లి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోనూ ఎయిర్పోర్టుల కోసం ప్రతిపాదనలు వచ్చాయని, వీటిని పరిశీలిస్తున్నామన్నారు. ఆదిలాబాద్లో ఉన్న ఎయిర్ఫీల్డ్ను సివిల్, మిలిటరీ అవసరాల కోసం ఉపయోగించుకునే అంశంపై ఏఏఐ అధ్యయనం చేస్తోందన్నారు. ఇక్కడ ఎయిర్పోర్ట్ విస్తరణకు కావాల్సిన అదనపు భూమికి సంబంధించిన వివరాలను రాష్ట్ర ప్రభుత్వానికి ఏఏఐ పంపిందని స్పష్టం చేశారు.
త్వరలోనే శంకుస్థాపనఅటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని రామవరం, చెంచుపల్లి, సుజాత నగర్ గ్రామల పరిధిలో ప్రతిపాదించిన భూమిలో ఎయిర్పోర్ట్ నిర్మాణం సాధ్యపడదని కేంద్రం తెలిపింది. ఈ స్థలానికి సమీపంలో రైల్వే లైన్లు, కొండలు ఉండటం వల్ల ఫ్లైట్ ల్యాండింగ్, టేకాఫ్లకు ప్రమాదకరమని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రభుత్వం వేగంగా భూసేకరణ ప్రక్రియ పూర్తి చేసి వరంగల్ ఎయిర్పోర్ట్ నిర్మాణం పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని కేంద్రం స్పష్టం చేసింది. కాకతియ స్ట్రైల్లో ఎయిర్పోర్డ్ డిజైన్ చేయనున్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 58 విమాన మార్గాలు అందుబాటులోకి వచ్చాయని, వివిధ ప్రాంతాల మధ్య రాకపోకలకు ఇది ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.
పార్వతీ దేవి, గ్రామ దేవతలు అమ్మవారి ఉగ్ర రూపాలను పూజించడానికి ఈ మాసం అత్యంత అనుకూలమైనది. మరి ఈ పవిత్ర మాసంలో పాటించాల్సిన ముఖ్యమైన ఆధ్యాత్మిక నియమాలు, చేయాల్సిన ప్రత్యేక పూజలు మరియు దీని వెనుక ఉన్న అంతరార్థం ఏంటో ఇప్పుడు పూర్తి వివరంగా తెలుసుకుందాం.
ఆషాడ మాసం ఆధ్యాత్మిక ప్రాముఖ్యత
ఆధ్యాత్మిక శాస్త్రం ప్రకారం ఈ మాసంలో భూమిపై ఆధ్యాత్మిక శక్తుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. వర్ష రుతువు ప్రారంభమయ్యే ఈ సమయంలో వాతావరణ మార్పుల వల్ల వ్యాధులు వ్యాపించే అవకాశం ఉన్నందున, పూర్వీకులు ఈ మాసాన్ని దేవతల ఆరాధనకు, శుభ్రతకు అంకితం చేశారు. ఈ నెలలో అమ్మవారికి వేప ఆకులు, పసుపు, కుంకుమలతో ప్రత్యేక పూజలు చేయడం వల్ల ఇల్లు, గ్రామం సమస్త రోగాల నుండి రక్షించబడతాయని భక్తుల విశ్వాసం.
ఆషాడ వెల్లి పవిత్ర పూజలు
ఈ మాసంలో వచ్చే ప్రతి శుక్రవారాన్ని అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ రోజుల్లో మహిళలు తెల్లవారుజామునే లేచి ఇళ్లను శుభ్రం చేసుకుని, ముగ్గులు వేసి అమ్మవారికి పాలు, పాయసం, కూజాల్లో నీరు సమర్పిస్తారు. ముత్తైదువులకు పసుపు, కుంకుమ, గాజులు, తాంబూలం ఇవ్వడం వల్ల దీర్ఘసుమంగళీ ప్రాప్తులతో పాటు కుటుంబంలో సుఖశాంతులు వెల్లివిరుస్తాయని నమ్ముతారు.
అమ్మవారికి ప్రసాదాలు నైవేద్యాలు
ఈ పవిత్ర మాసంలో రాగి జావ లేదా రాగి సంగటిని తయారు చేసి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించి భక్తులకు పంచుతారు. వర్షాకాలంలో శరీరానికి చలువ చేయడానికి, రోగనిరోధక శక్తిని పెంచడానికి ఈ సంప్రదాయ ఆహారాలు ఎంతగానో తోడ్పడతాయి. దీంతో పాటు బియ్యం, బెల్లం, కందిపప్పుతో తయారుచేసే ప్రత్యేక పాయసాన్ని కూడా నైవేద్యంగా అర్పిస్తారు.
ఈ మాసంలో శుభకార్యాల నిషిద్ధం
సాంప్రదాయం ప్రకారం ఈ మాసంలో వివాహాలు, గృహప్రవేశాలు వంటి శుభకార్యాలను నిర్వహించరు. కొత్తగా పెళ్లయిన దంపతులను ఈ నెలలో దూరంగా ఉంచే ఆచారం కూడా ఉంది. ఈ సమయంలో గర్భం దాల్చితే వచ్చే వేసవి కాలంలో ప్రసవం జరిగి తల్లి, బిడ్డల ఆరోగ్యానికి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందనే శాస్త్రీయ కోణం కూడా ఈ సంప్రదాయం వెనుక దాగి ఉంది. అందువల్ల ఈ కాలాన్ని కేవలం దైవ చింతనకు మాత్రమే ఉపయోగిస్తారు.
నదీ స్నానాలు దీపారాధనలు
ఈ మాసంలో పవిత్ర నదులు కొత్త నీటితో నిండుగా ప్రవహిస్తాయి. నదీ తీరాల్లో ప్రత్యేక పూజలు చేయడం, కావేరి లేదా ఇతర పవిత్ర నదుల్లో స్నానాలు ఆచరించడం వల్ల సమస్త పాపాలు తొలగిపోతాయని నమ్ముతారు. సంధ్యా సమయంలో ఇంట్లో మరియు ఆలయాల్లో నెయ్యి లేదా నువ్వుల నూనెతో దీపారాధన చేయడం వల్ల ఇంట్లోని ప్రతికూల శక్తులు తొలగిపోయి లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది.
గమనిక:
ఇది కేవలం సమాచారం మాత్రమే. పైన పేర్కొన్న వివరాలు సాంప్రదాయ హిందూ ధర్మశాస్త్రాలు, ఆధ్యాత్మిక గ్రంథాలు మరియు పండితుల సాధారణ విశ్లేషణల ప్రాతిపదికన అవగాహన కోసం మాత్రమే అందించబడ్డాయి, దీనికి సంస్థ ఎలాంటి బాధ్యత వహించదు. మీ పూజా విధానాలు, వ్రత నియమాల పూర్తి వివరాల కోసం అర్హులైన వేద పండితులు లేదా కుటుంబ పురోహితులను సంప్రదించడం శ్రేయస్కరం.
క్యాన్సర్.. ప్రమాదకర మహమ్మారి.. దీనిని చాలా మంది ఆలస్యంగా తెలుసుకుంటారు. శరీరంలోని కణాలు అసాధారణంగా, అనియంత్రితంగా విభజన చెంది ఇతర భాగాలకు వ్యాప్తి చెందే వ్యాధులను కాన్సర్ అంటారు. దీనిలో పలు రకాలుంటాయి.. అయితే.. క్యాన్సర్ రోగాన్ని నివారించడానికి అనేక ఇంటి చిట్కాలు ప్రయత్నిస్తుంటారు. ప్రతిరోజూ ఒక వెల్లుల్లి రెబ్బ తినడం వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం తగ్గుతుందని అంటారు. ఇది నిజమేనా..? వైద్య నిపుణులు ఏం చెబుతున్నారు.. అనే వివరాలను తెలుసుకుందాం.. ప్రతిరోజూ ఒక వెల్లుల్లి రెబ్బ తినడం వల్ల క్యాన్సర్ను నివారించవచ్చా.. ఇది నిజంగా సాధ్యమేనా? భారతదేశంలో, క్యాన్సర్కు చికిత్స చేయడానికి లేదా నివారించడానికి అనేక గృహ చికిత్సలను ఉపయోగిస్తారు. అయితే, వాటి ప్రభావశీలతను నిర్ధారించడానికి ఇంకా చాలా పరిశోధనలు జరగాల్సి ఉంది. వెల్లుల్లి మనల్ని క్యాన్సర్ నుండి కాపాడుతుందో లేదో తెలియకపోయినా, కొంతమంది అది గ్రహించకుండానే ప్రతిరోజూ తినడం ప్రారంభిస్తారు. వెల్లుల్లిలో అనేక పోషకాలు, యాంటీఆక్సిడెంట్లు ఉన్నప్పటికీ, అది క్యాన్సర్ను నయం చేస్తుందనే నమ్మకం తప్పు..
వెల్లుల్లి మనల్ని అనేక వ్యాధులు, ఆరోగ్య సమస్యల నుండి కాపాడగలదు. అయితే, ఇది క్యాన్సర్పై పూర్తిగా ప్రభావవంతంగా పనిచేస్తుందని చెప్పలేము. ఇందులో ఎంత నిజం ఉందో.. నిపుణులు ఏం చెప్పారో చూద్దాం..
డాక్టర్ మనీష్ సాహ్ని (కైలాష్ దీపక్ హాస్పిటల్ కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్) ప్రకారం.. వెల్లుల్లిలో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇందులో విటమిన్ బి, సి తో సహా అనేక పోషకాలు ఉంటాయి. అదనంగా, ఇందులో అల్లిసిన్, SLL/సిస్టీన్ వంటి సల్ఫర్ సమ్మేళనాలు ఉంటాయి. వీటికి యాంటీఆక్సిడెంట్, యాంటీమైక్రోబయల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. ఈ గుణాలు మన శరీరానికి, మొత్తం ఆరోగ్యానికి ప్రయోజనకరంగా పరిగణిస్తారు.
ఇక, వెల్లుల్లి క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుందా అనే ప్రశ్నకు సంబంధించి, వెల్లుల్లి క్యాన్సర్ను నయం చేయగలదనే భావన ఒక అపోహ అని అర్థం చేసుకోవడం ముఖ్యం.. వెల్లుల్లి క్యాన్సర్ను నయం చేయగలదని గానీ, లేదా అది స్వయంగా క్యాన్సర్ నిరోధక చికిత్సగా పనిచేస్తుందని.. గానీ ఏ మానవ అధ్యయనం కూడా ఇంతవరకు నిరూపించలేదు.
వారానికి సుమారు 5 నుండి 10 గ్రాములు లేదా అంతకంటే ఎక్కువ పరిమాణంలో వెల్లుల్లిని తీసుకుంటే, కడుపు క్యాన్సర్, కొన్ని పెద్దప్రేగు క్యాన్సర్ల ప్రమాదం కొద్దిగా తగ్గుతుందని కొన్ని అధ్యయనాలు చూపించాయని నిపుణులు తెలిపారు.
వెల్లుల్లి వల్ల కలిగే ఇతర ప్రయోజనాలువెల్లుల్లిలో అల్లిసిన్, ఫ్లేవనాయిడ్లు, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. అల్లిసిన్ బ్యాక్టీరియా, వైరస్లు, ఫంగస్లకు వ్యతిరేకంగా పనిచేయడం ద్వారా మన రోగనిరోధక శక్తికి మేలు చేస్తుంది. అందువల్ల, వెల్లుల్లిని తినడం వల్ల జలుబు, ఫ్లూ రాకుండా నివారించవచ్చని నమ్ముతారు.
వెల్లుల్లి రక్తపోటును నియంత్రించడంలో కూడా సహాయపడుతుంది. ఈ తెల్లని పదార్థం మన శరీరంలో నైట్రిక్ ఆక్సైడ్ ఉత్పత్తిని పెంచి, రక్తనాళాలను సడలించేలా చేస్తుంది. ఇది రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది.
అనేక అధ్యయనాల ప్రకారం.. ఇది చెడు కొలెస్ట్రాల్ను కొంత మేరకు తగ్గించగలదు. అంతేకాకుండా, ఇది ఆక్సీకరణ ఒత్తిడిని కూడా తగ్గించగలదు. ఇందులో అనేక యాంటీఆక్సిడెంట్లు ఉన్నందున, ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుండి రక్షించడంలో కూడా ఇది ప్రభావవంతంగా ఉండవచ్చు.
గమనిక:
క్యాన్సర్ నివారణకు సమతుల్య ఆహారం, క్రమం తప్పని వ్యాయామం, పొగాకు-మద్యం అలవాట్లకు దూరంగా ఉండటం, అవసరమైన స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవడం వంటి చర్యలే అత్యంత ప్రభావవంతమైనవి. ఇప్పటికే క్యాన్సర్ ఉన్నవారు లేదా చికిత్స పొందుతున్నవారు వైద్యుల సలహా లేకుండా ఇంటి చిట్కాలపై మాత్రమే ఆధారపడకూడదు. వెల్లుల్లిని అధిక మోతాదులో తీసుకోవడం కొందరిలో కడుపు మంట లేదా రక్తం పలుచబడే మందులతో పరస్పర ప్రభావం కలిగించే అవకాశం కూడా ఉంటుంది.
హైదరాబాద్, జూలై 21: భారతీయ తపాలా శాఖ సికింద్రాబాద్ డివిజన్ పరిధిలో తపాలా జీవిత బీమా (PLI), గ్రామీణ తపాలా జీవిత బీమా (RPLI) పాలసీల సేకరణ కోసం కమిషన్ ఆధారంగా ఏజెంట్లను నియమించనున్నట్లు ప్రకటించింది. 10వ తరగతి ఉత్తీర్ణత సాధించి 18 సంవత్సరాలు నిండిన నిరుద్యోగ యువతకు ఇది మంచి ఉపాధి అవకాశంగా నిలవనుంది. తపాలా శాఖ విడుదల చేసిన ప్రకటన ప్రకారం, మాజీ జీవిత బీమా సలహాదారులు, వివిధ బీమా కంపెనీల మాజీ ఏజెంట్లు, మాజీ సైనిక ఉద్యోగులు, అంగన్వాడీ కార్యకర్తలు, పదవీ విరమణ పొందిన ఉద్యోగులు కూడా ఈ నియామకాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. హైదరాబాద్ నగరం, వికారాబాద్ ప్రాంతాల్లో నివసించే అర్హులైన అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అధికారులు సూచించారు.
ఆసక్తి గల అభ్యర్థులు తమ దరఖాస్తులను సికింద్రాబాద్ డివిజనల్ ఆఫీస్, గాంధీనగర్ – 500080 చిరునామాకు ఆగస్టు 7, 2026 లోపు సమర్పించాలి. దరఖాస్తుల పరిశీలన అనంతరం ఎంపికైన అభ్యర్థులు ఆగస్టు 14, 2026 ఉదయం 10 గంటలకు నిర్వహించే ఇంటర్వ్యూకు సంబంధిత సర్టిఫికెట్లతో హాజరుకావాల్సి ఉంటుంది. సికింద్రాబాద్ తపాలా సీనియర్ సూపరింటెండెంట్ ఎం. అన్నయ్య తెలిపిన వివరాల ప్రకారం, ఎంపికైన ఏజెంట్లు రూ. 5,000 విలువైన NSC లేదా KVP రూపంలో డిపాజిట్ చెల్లించాల్సి ఉంటుంది.
ఈ నియామకాలపై మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు తమ సమీప తపాలా కార్యాలయం లేదా సికింద్రాబాద్ డివిజనల్ ఆఫీస్, గాంధీనగర్ను సంప్రదించవచ్చని అధికారులు తెలిపారు. ఉద్యోగావకాశాల కోసం ఎదురు చూస్తున్న యువతకు ఇది మంచి అవకాశంగా భావిస్తున్నారు.
సిక్కీంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. టన్నెల్లో చిక్కుకొని ఏడుగురు కార్మికులు మృతి చెందినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నట్టు తెలుస్తోంది.
ఇప్పుడే అందిన వార్త ఇది! మేము ఈ వార్తను అప్డేట్ చేస్తున్నాము. మీకు తొలుత ఈ వార్తను అందించే ప్రయత్నం చేస్తాం. ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం ఈ పేజీని రిఫ్రెష్ చేయండి. ఈ వార్తకు సంబంధించిన మిగతా కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
సాధారణ సైకిల్ లాగా పెడల్స్ కానీ, ఎలక్ట్రిక్ మోటార్ కానీ ఇందులో ఉండవు. పిల్లలు తమ కాళ్లతో ముందుకు నడిపిస్తూ బ్యాలెన్స్ నేర్చుకునేలా దీనిని ప్రత్యేకంగా డిజైన్ చేశారు. తేలికపాటి మెగ్నీషియం ఫ్రేమ్ మరియు అడ్జస్టబుల్ సీట్తో వస్తున్న ఈ బైక్, చిన్నారులకు సైకిల్ తొక్కడం నేర్చుకోవడానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. 225 డాలర్ల ధరతో వస్తున్న ఈ బైక్ విశేషాలను తెలుసుకుందాం!
చిన్నారుల కోసం..టెస్లా ఈ బ్యాలెన్స్ బైక్ను ప్రధానంగా 2 నుంచి 5 ఏళ్ల వయస్సు గల పిల్లల కోసం రూపొందించింది. సాధారణ సైకిళ్లలో లాగా పెడల్స్ ఉండవు, కాబట్టి పిల్లలు తమ కాళ్లను నేలపై ఉంచి, నెమ్మదిగా ముందుకు సాగుతూ బ్యాలెన్స్ ఎలా చేయాలో సులభంగా నేర్చుకుంటారు. సైకిల్ నేర్చుకోవడానికి ముందు పిల్లలకు ఇది ఒక అద్భుతమైన శిక్షణా సాధనంగా పనిచేస్తుంది, దీనివల్ల వారిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.
తేలికపాటి ఫ్రేమ్ఈ బైక్ తయారీలో టెస్లా ‘మెగ్నీషియం ఫ్రేమ్’ను ఉపయోగించింది, దీనివల్ల బరువు చాలా తక్కువగా ఉంటుంది. తద్వారా పిల్లలు దీనిని సులభంగా నియంత్రించవచ్చు. ఈ బైక్లో ఐదు స్థాయిల్లో సర్దుబాటు చేసుకునే సౌకర్యం ఉన్న సీటు ఉంది. పిల్లల ఎత్తుకు అనుగుణంగా సీటును పెంచుకోవచ్చు, కాబట్టి ఒకే బైక్ను ఎక్కువ కాలం పాటు వాడుకునే అవకాశం ఉంటుంది.
మార్కెట్ రెస్పాన్స్ఈ బ్యాలెన్స్ బైక్ ధరను 225 అమెరికన్ డాలర్లుగా నిర్ణయించారు (భారత కరెన్సీలో సుమారు రూ. 19,000 నుండి రూ. 20,000 వరకు). ఆగస్టు నెలాఖరు నుండి షిప్పింగ్ ప్రారంభం కానుంది. ఈ ప్రొడక్ట్ లాంచ్ అయిన కొద్ది గంటల్లోనే స్టాక్ మొత్తం ఖాళీ అవ్వడం, టెస్లా బ్రాండ్కు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆదరణను ప్రతిబింబిస్తోంది. సోషల్ మీడియాలో కూడా తల్లిదండ్రుల నుండి ఈ బైక్కు అనూహ్యమైన స్పందన వస్తోంది.
టెస్లా కేవలం కార్ల తయారీ సంస్థ మాత్రమే కాదు, పిల్లల కోసం కూడా వినూత్నమైన ఉత్పత్తులను అందించే బ్రాండ్ అని మరోసారి నిరూపితమైంది. సైకిల్ తొక్కడం నేర్చుకునే చిన్నారులకు ఇది ఒక అద్భుతమైన ప్రారంభం. ఒకవేళ మీరు మీ పిల్లలకు ఒక స్టైలిష్ మరియు ఉపయోగకరమైన గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే, టెస్లా బ్యాలెన్స్ బైక్ తప్పక పరిగణనలోకి తీసుకోవాల్సిన ఆప్షన్. అయితే, ప్రస్తుతం స్టాక్ పూర్తి కావడంతో తదుపరి సేల్స్ కోసం ఎదురుచూడక తప్పదు.
లండన్ వేదికగా ఇంగ్లాండ్తో జరిగిన నిర్ణయాత్మక మూడో వన్డేలో భారత బౌలింగ్ విభాగం ఘోరంగా విఫలమై సిరీస్ను సమర్పించుకుంది. స్టార్ ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా లేకపోవడంతో టీమ్ ఇండియా బౌలింగ్ లైనప్ పూర్తిగా పసికూనను తలపించిందని, ఈ తరహా ఎంపికలతో వచ్చే వన్డే వరల్డ్ కప్ గెలవడం కష్టమేనని దిగ్గజ ఆటగాడు సునీల్ గవాస్కర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
లార్డ్స్ మ్యాచ్లో తేలిపోయిన భారత్: భారీగా పరుగులు సమర్పించుకున్న బౌలర్లు..ఇంగ్లాండ్తో జరిగిన మూడో వన్డేలో భారత బౌలింగ్ విభాగం ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది. గాయం కారణంగా కీలక బౌలర్ జస్ప్రీత్ బుమ్రా జట్టుకు దూరం కావడంతో టీమ్ ఇండియా బౌలింగ్ తీవ్ర బలహీనంగా మారింది. ఇంగ్లాండ్ బ్యాటర్లు విరుచుకుపడటంతో నిర్ణీత ఓవర్లలో ప్రత్యర్థి జట్టు ఏకంగా 387 పరుగుల భారీ స్కోరు సాధించింది.
ఇది కూడా చదవండి: రోహిత్ శర్మ లేకుండానే స్వ్కాడ్.. 2027 వన్డే ప్రపంచకప్లో బరిలోకి దిగే భారత జట్టు ఇదే..?
బుమ్రా స్థానంలో వచ్చిన ఫాస్ట్ బౌలర్లు మ్యాచ్పై ఎలాంటి పట్టు సాధించలేకపోయారు. ముఖ్యంగా అర్ష్దీప్ సింగ్ 10 ఓవర్లలో 72 పరుగులు ఇవ్వగా, ప్రిన్స్ యాదవ్ అనుభవలేమి స్పష్టంగా కనిపించింది. మరొకవైపు గుర్నూర్ బ్రార్ తన స్పెల్లో ఏకంగా 97 పరుగులు సమర్పించుకొని దారుణంగా నిరాశపరిచాడు. ఆరో బౌలర్ ఆప్షన్ లేకపోవడం, కేవలం ఐదుగురు స్పెషలిస్ట్ బౌలర్లతో బరిలోకి దిగడం జట్టు మేనేజ్మెంట్ చేసిన అతిపెద్ద పొరపాటని విశ్లేషకులు భావిస్తున్నారు.
సునీల్ గవాస్కర్ ఘాటు వ్యాఖ్యలు: కుల్దీప్ను పక్కన పెట్టడం చారిత్రక తప్పు..!టీమ్ ఇండియా బౌలింగ్ తీరుపై భారత మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జట్టు ఎంపిక తీరును ప్రశ్నిస్తూ మేనేజ్మెంట్పై విమర్శలు గుప్పించారు. “బుమ్రా ఒక్కడు లేకపోతే మన బౌలింగ్ లైనప్ పరిస్థితి ఇంత దారుణంగా తయారవుతుందా? నలుగురు పేసర్లతో బరిలోకి దిగడం మేనేజ్మెంట్ చేసిన పెద్ద తప్పు. ప్రధాన స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ను తుది జట్టు నుంచి పక్కన పెట్టడం ఏమాత్రం వివేకం అనిపించుకోదు. గుర్నూర్ బ్రార్ స్థానంలో కుల్దీప్ను ఆడించి ఉంటే ఇంగ్లాండ్ కనీసం 20 నుంచి 30 పరుగులు తక్కువ చేసేది. అది మ్యాచ్ ఫలితాన్ని మార్చేసి ఉండేది” అని గవాస్కర్ స్పష్టం చేశారు.
ఇది కూడా చదవండి: ఓపెనర్లుగా అభిషేక్, వైభవ్.. మిడిల్లో మరో డేంజరస్ ప్లేయర్.. టీమిండియా ప్లేయింగ్ 11 ఇదే..!
రోహిత్ శర్మ శతకం వృథా: మిడిల్ ఆర్డర్ వైఫల్యం..388 పరుగుల కొండంత లక్ష్యంతో బరిలోకి దిగిన టీమ్ ఇండియా చివరి వరకు గట్టిగా పోరాడింది. కెప్టెం రోహిత్ శర్మ 138 పరుగులతో అద్భుతమైన సెంచరీ సాధించగా, శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ అర్ధశతకాలతో మెరిశారు. అయితే, మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు కీలక సమయంలో చేతులెత్తేయడంతో భారత్ 27 పరుగుల తేడాతో ఓటమి పాలైంది.
ఈ పరాజయంతో పర్యటనలో టీ20, వన్డే సిరీస్లలో భారత్ ఏ ఒక్క సిరీస్ కూడా గెలవలేక ఉత్త చేతులతో నిరాశగా వెనుతిరిగింది. వచ్చే ఏడాది సౌత్ ఆఫ్రికా, జింబాబ్వే వేదికలుగా జరిగే వన్డే ప్రపంచ కప్కు ముందు భారత బౌలింగ్ బలహీనతలు ఇలా బయటపడటం ఆందోళన కలిగిస్తోంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలకు ఘనమైన వీడ్కోలు ఇవ్వాలని భావిస్తున్న టీమ్ ఇండియా, ఇప్పటికైనా మేనేజ్మెంట్ లోపాలను సవరించుకోకపోతే వరల్డ్ కప్ కల కలగానే మిగిలిపోయే ప్రమాదం ఉంది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
కొత్త బ్రెజ్జాలో అత్యంత ఆసక్తికరమైన మార్పు 1.0 లీటర్ బూస్టర్జెట్ టర్బో ఇంజిన్. దీనితో పాటు ఎక్స్టీరియర్, ఇంటీరియర్ పరంగా కూడా మారుతి ఎన్నో అప్డేట్స్ చేసింది. వెంటిలేటెడ్ సీట్లు, భారీ టచ్స్క్రీన్ వంటి ఆధునిక ఫీచర్లతో రానున్న ఈ కారు, ధర, పనితీరు మధ్య అద్భుతమైన బ్యాలెన్స్ను అందిస్తోంది. మారుతి బ్రెజ్జా ఫేస్లిఫ్ట్ యొక్క ప్రత్యేకతలు ఏంటో తెలుసుకుందాం!
కొత్త టర్బో ఇంజిన్ పవర్కొత్త బ్రెజ్జాలో అత్యంత కీలకమైన మార్పు 1.0 లీటర్ బూస్టర్జెట్ టర్బో పెట్రోల్ ఇంజిన్. ఇది గరిష్టంగా 109 bhp పవర్ మరియు 170 Nm టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. ఇది ప్రస్తుత 1.5 లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ ఇంజిన్తో పాటు అందుబాటులోకి రానుంది. యూజర్లు తమ అవసరాలకు తగ్గట్టుగా టర్బో లేదా సాధారణ ఇంజిన్ ఆప్షన్లను ఎంచుకోవచ్చు. మాన్యువల్, ఆటోమేటిక్ గేర్బాక్స్ ఆప్షన్లు కూడా అందుబాటులో ఉండటం అదనపు ఆకర్షణ.
ఆకర్షణీయమైన లుక్ఎక్స్టీరియర్ డిజైన్లో భాగంగా కొత్త అల్లాయ్ వీల్స్ మరియు LED ఫాగ్ ల్యాంప్స్ను జోడించారు. క్యాబిన్ లోపల కూడా కొన్ని కీలక అప్డేట్లు ఉన్నాయి.
- వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు: సౌకర్యవంతమైన ప్రయాణానికి ఇది దోహదపడుతుంది.
- 10.1 అంగుళాల ఇన్ఫోటైన్మెంట్: పెద్ద స్క్రీన్ ద్వారా స్మార్ట్ కనెక్టివిటీని పొందవచ్చు.
- యాంబియంట్ లైటింగ్: 64 రంగుల లైటింగ్తో ఇంటీరియర్ ఎంతో విలాసవంతంగా ఉంటుంది.
సబ్-4 మీటర్ SUV సెగ్మెంట్లో ప్రస్తుతం టాటా నెక్సాన్, మహీంద్రా XUV 3XO, కియా సోనెట్ వంటి మోడళ్లతో పోటీ తీవ్రంగా ఉంది. ఈ నేపథ్యంలో, బ్రెజ్జాను మరింత శక్తివంతంగా, ఆధునికంగా మార్చడం ద్వారా మారుతి తన మార్కెట్ వాటాను పెంచుకోవాలని చూస్తోంది. ఫీచర్లు, పనితీరు పరంగా టాప్ వేరియంట్లలో మారుతి తీసుకువస్తున్న ఈ మార్పులు కస్టమర్లను ఆకట్టుకోవడం ఖాయం.
కొత్త బ్రెజ్జా ఫేస్లిఫ్ట్ తన అప్డేటెడ్ ఇంజిన్, ఆధునిక ఫీచర్లతో కాంపాక్ట్ SUV ప్రేమికులకు మరోసారి బెస్ట్ ఆప్షన్గా నిలవనుంది. జూలై 24న లాంచ్ తర్వాత ధర, వేరియంట్ వివరాలు పూర్తిస్థాయిలో వెల్లడి కానున్నాయి. మీరు త్వరలో ఒక కొత్త SUVని కొనుగోలు చేయాలనుకుంటే, మారుతి బ్రెజ్జాను మీ జాబితాలో తప్పక ఉంచుకోండి.
టాలీవుడ్ డ్యాన్స్ పరిశ్రమలో నెలకొన్న వివాదం రోజురోజుకు తీవ్రమవుతోంది. ఈ వివాదం ఇప్పుడు ఫిలిం ఫెడరేషన్ వర్సెస్ జానీ మాస్టర్గా రూపాంతరం చెందింది. ఫెడరేషన్ సంచలన నిర్ణయం తీసుకుంటూ టాప్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్పై సహాయ నిరాకరణ విధిస్తున్నట్లు ప్రకటించింది. దేశవ్యాప్తంగా జానీ మాస్టర్ ఏ సినిమాకు పనిచేసినా మిగతా 23 క్రాఫ్ట్స్ ఆయనతో సహకరించవని ఫెడరేషన్ స్పష్టం చేసింది. ఫెడరేషన్ నియమ నిబంధనలను ఉల్లంఘించడంతో పాటు యూనియన్ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారన్న ఆరోపణలతో ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఫెడరేషన్ నాయకత్వం జానీ మాస్టర్తో చర్చలకు ప్రయత్నించినప్పటికీ, ఆయన “నాకు ఫెడరేషన్ అవసరం లేదు, నాకు నేనే శాసనం” అనే విధంగా వ్యవహరించారని, అందుకే 72 మంది కౌన్సిల్ సభ్యులు ఈ నిర్ణయం తీసుకున్నారని పేర్కొంది. ఈ వివాదానికి మూలాలు కొరియోగ్రాఫర్లు జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ వర్గాల మధ్య కొంతకాలంగా నడుస్తున్న ఆధిపత్య పోరాటంలో ఉన్నాయి. ప్రస్తుత డ్యాన్సర్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు సుమలత, కొరియోగ్రాఫర్ల వేతనాల్లో కోత విధించి “రెమ్యూనరేషన్ స్కామ్”కు పాల్పడుతున్నారనే ఆరోపణలతో అసోసియేషన్ జనరల్ సెక్రటరీ, ట్రెజరర్లను సస్పెండ్ చేశారు. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ శేఖర్ మాస్టర్ వర్గానికి చెందిన మరో ఎనిమిది మంది ఈసీ సభ్యులు తమ పదవులకు రాజీనామా చేశారు. దీంతో అసోసియేషన్లో 10 ఖాళీలు ఏర్పడగా, వాటి భర్తీకి ఉప ఎన్నికలు నిర్వహించాలని సుమలత పట్టుబడుతున్నారు. అయితే, అసోసియేషన్ను పూర్తిగా రద్దు చేసి పూర్తి స్థాయి ఎన్నికలకు వెళ్లాలని శేఖర్ మాస్టర్ వర్గం డిమాండ్ చేస్తోంది.
మరిన్ని వీడియోల కోసం :
ఇండస్ట్రీలో అక్కినేని హీరోల టైం మొదలైందా..?
విజయ్ ‘జన నాయగన్’ ఓపెనింగ్స్ పై ఆసక్తి
టాలీవుడ్లో యాక్షన్ లవ్ స్టోరీల ట్రెండ్
తెలంగాణ పల్లె కథల వైపు టాలీవుడ్ చూపు
న్యూఢిల్లీ, జూలై 21: రీ-నీట్ (Re-NEET) 2026 ఫలితాలపై మరోసారి వివాదం చెలరేగింది. అధికారిక స్కోర్కార్డుల్లో ప్రకటించిన మార్కులు, విద్యార్థులు లెక్కించిన మార్కులకు మధ్య భారీ వ్యత్యాసాలు ఉన్నాయని పలువురు అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. అలాంటి ఘటనల్లో ఒకటి 19 ఏళ్ల నీట్ అభ్యర్థి ప్రతిభా త్రివేది కేసు. ఆమె లెక్కల ప్రకారం 720లో 638 మార్కులు రావాల్సి ఉండగా, అధికారిక ఫలితాల్లో కేవలం 38 మార్కులు మాత్రమే వచ్చినట్లు వెల్లడించింది.
638 మార్కులు రావాల్సి ఉండగా 38 మార్కులుజూలై 13న నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) విడుదల చేసిన తుది ఆన్సర్ కీ ఆధారంగా తన OMR షీట్ను పరిశీలించానని ప్రతిభా త్రివేది తెలిపింది. సెట్-80 ప్రశ్నాపత్రం ప్రకారం తనకు 638 మార్కులు వస్తాయని లెక్కించుకున్నానని, అయితే జూలై 16న విడుదలైన ఫలితాల్లో కేవలం 38 మార్కులు మాత్రమే చూపించారని ఆరోపించింది. ఈ ఏడాది తొలిసారి నీట్ పరీక్ష రాసిన ప్రతిభా మొత్తం 180 ప్రశ్నల్లో 162 ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చానని, వాటిలో కేవలం రెండు మాత్రమే తప్పుగా ఉన్నాయని పేర్కొంది. అదనంగా రెండు ప్రశ్నలను NTA తొలగించడంతో వాటికి సంబంధించి గ్రేస్ మార్కులు కూడా రావాల్సి ఉందని వివరించింది.
OMR షీట్ పునఃపరిశీలన కోరిన విద్యార్థినిఫలితాల్లో వచ్చిన వ్యత్యాసంపై ప్రతిభా ఇప్పటికే NTAతో పాటు కేంద్ర విద్యాశాఖ మంత్రి దృష్టికి కూడా ఫిర్యాదు చేసినట్లు తెలిపింది. తన OMR షీట్ను మళ్లీ పరిశీలించి, క్రాస్ వెరిఫికేషన్ నిర్వహించాలని కోరినా ఇప్పటివరకు ఎలాంటి స్పందన రాలేదని వెల్లడించింది. అంతేకాకుండా దేశవ్యాప్తంగా దాదాపు 600 మంది విద్యార్థులు ఇలాంటి సమస్యలను ఎదుర్కొంటున్నారని ఆమె ఆరోపించింది. ప్రశ్నాపత్రం లీక్ వివాదం, రీ-ఎగ్జామ్ నిర్వహణ, ఇప్పుడు ఫలితాల్లో తలెత్తిన ఈ సమస్యల వల్ల విద్యార్థులు తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. మరోవైపు ఈ ఫిర్యాదులపై కేంద్ర విద్యాశాఖ దృష్టి సారించినట్లు సమాచారం. అయితే NTA వర్గాల ప్రకారం ఇప్పటివరకు వచ్చిన ఫిర్యాదుల్లో నిజమైన మార్కుల వ్యత్యాసం ఉన్న కేసు ఏదీ నిర్ధారణ కాలేదని చెబుతున్నారు.
కొంతమంది ఫిర్యాదుదారులు సమర్పించిన OMR షీట్లు కృత్రిమ మేధస్సు (AI) సాయంతో మార్పులు చేసినవిగా కనిపిస్తున్నాయని అధికారులు పేర్కొన్నారు. జూలై 18న NTA విడుదల చేసిన ప్రకటనలో సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న అనేక OMR షీట్లు నకిలీవని, AI ద్వారా రూపొందించినవని తెలిపింది. పరీక్షా పత్రాలను ఫోర్జరీ చేసిన వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. అయితే ఈ ఆరోపణలను విద్యార్థులు ఖండిస్తున్నారు. తమ ఫిర్యాదులు ఫలితాలు ప్రకటించిన వెంటనే చేశామని, ఎలాంటి మార్పులు చేసే అవకాశం లేదని ప్రతిభా త్రివేది స్పష్టం చేసింది. పారదర్శకంగా, నిర్దిష్ట గడువులోపు OMR షీట్లను పునఃపరిశీలించాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు.
రాజకీయ రంగు పులుముకున్న వివాదంరీ-నీట్ ఫలితాల వివాదం మళ్లీ రాజకీయ చర్చకు కూడా దారితీసింది. ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ NTA తీరుపై తీవ్ర విమర్శలు చేశారు. నకిలీ లేదా AI రూపొందించిన OMR షీట్లు ప్రచారం చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని విద్యార్థులను హెచ్చరించడం సరైంది కాదని అన్నారు. ‘పిల్లలను బెదిరించకండి. వారు ఎంతో కష్టపడి చదివారు. ఇప్పటికే మొత్తం నీట్ ప్రక్రియను మీరు దెబ్బతీశారు’ అంటూ కేజ్రీవాల్ సోషల్ మీడియాలో వ్యాఖ్యానించారు. విద్యార్థుల సమస్యలను సానుభూతితో పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు. రీ-నీట్ ఫలితాల్లోనూ తీవ్రమైన అవకతవకలు వెలుగులోకి వస్తున్నాయని ఆయన ఆరోపించారు. ఈ పిల్లలు ఇప్పుడు ఎక్కడికి వెళ్లాలి? అని కేజ్రీవాల్ ప్రశ్నించారు. అయితే కేంద్ర విద్యాశాఖ మాత్రం ఫిర్యాదులన్నింటినీ పరిశీలిస్తున్నామని, ఇప్పటివరకు మార్కుల వ్యత్యాసానికి సంబంధించిన ప్రామాణిక ఆధారాలు లభించలేదని స్పష్టం చేసింది. మరోవైపు విద్యార్థులు తమ ఫిర్యాదులకు త్వరితగతిన, పారదర్శకంగా పరిష్కారం చూపాలని డిమాండ్ చేస్తూనే ఉన్నారు.
ఫిల్మ్ ఫెడరేషన్, డ్యాన్సర్స్ అసోసియేషన్ మధ్య నెలకొన్న వివాదంపై డ్యాన్సర్స్ అసోసియేషన్ ప్రతినిధి సుమలత స్పందించారు. ఫిల్మ్ ఫెడరేషన్ తమ అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోవడం పట్ల ఆమె అభ్యంతరం వ్యక్తం చేశారు. ఫెడరేషన్కు జోక్యం చేసుకునే హక్కు ఉన్నప్పటికీ, ప్రతి విషయంలో వారి నిర్ణయమే అంతిమం కాకూడదని సుమలత అన్నారు. డ్యాన్సర్స్ అసోసియేషన్ ఇప్పటికే మూడు జనరల్ బాడీ సమావేశాలు నిర్వహించిందని, మెజారిటీ సభ్యుల నిర్ణయాలను గౌరవించాలని ఆమె నొక్కి చెప్పారు. ఫిల్మ్ ఫెడరేషన్ ప్రకటించిన “సహాయ నిరాకరణ”ను ఆమె సవాల్ చేశారు. తమ బైలా ప్రకారం ఎన్నికలు నిర్వహించడానికి రెండు మార్గాలు ఉన్నాయని – ఒకటి ఫెడరేషన్ ద్వారా, మరొకటి కార్మిక శాఖ ద్వారా – సుమలత వివరించారు. ఫెడరేషన్ సహకరించకపోతే, కార్మిక శాఖ అధికారుల సహకారంతో బై ఎలక్షన్లు నిర్వహిస్తామని ఆమె స్పష్టం చేశారు.
భారతీయ సంస్కృతిలో బంగారానికి కేవలం ఆభరణంగానే కాకుండా ఆర్థిక భద్రత, ఐశ్వర్యానికి ప్రతీకగా విశేష స్థానం ఉంది. అయితే గత కొన్నేళ్లుగా పసిడి ధరలు పెరుగుతున్న తీరు సామాన్యుడి బడ్జెట్కు ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్ సరళిని గమనిస్తున్న ఆర్థిక నిపుణులు ఒక సంచలన విషయాన్ని వెల్లడించారు. ప్రస్తుత పరిస్థితులు ఇలాగే కొనసాగితే, రాబోయే కొద్ది ఏళ్లలోనే బంగారం ధరలు రెట్టింపు కానున్నాయని, 2030 నాటికి 10 గ్రాముల బంగారం ధర రూ. 3 లక్షల మార్కును అంటే గ్రాముకు రూ. 30,000 తాకవచ్చని అంచనా వేస్తున్నారు.
గ్లోబల్ బ్యాంకులు, నిపుణుల అంచనాలు:ప్రపంచ ప్రసిద్ధ ఆర్థిక సేవల సంస్థ జేపీ మోర్గాన్ పసిడి ధరల్లో భారీ వృద్ధిని అంచనా వేసింది. అలాగే, బ్యాంక్ ఆఫ్ అమెరికా కూడా భవిష్యత్తులో బంగారం ధరలు రికార్డు స్థాయికి చేరుకుంటాయని పేర్కొంది. వీటన్నింటికంటే మిన్నగా, రిచ్ డాడ్ పూర్ డాడ్ ప్రసిద్ధ రచయిత రాబర్ట్ కియోసాకి ఒక అడుగు ముందుకు వేసి, 2035 నాటికి 10 గ్రాముల బంగారం ధర ఏకంగా రూ. 10 లక్షలకు చేరినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని సంచలన అంచనా వేశారు.
ధరలు ఇంతలా పెరగడానికి ప్రధాన కారణాలు:పరిమితమైన సరఫరా: భూమి అంతర్భాగంలో కొత్త బంగారు నిల్వలు లభించే అవకాశాలు తగ్గిపోతుండటం, మైనింగ్ ఖర్చులు విపరీతంగా పెరగడం వల్ల సరఫరా పరిమితంగా మారింది.
కేంద్ర బ్యాంకుల కొనుగోళ్లు: అమెరికా డాలర్పై ఆధారపడటాన్ని తగ్గించుకోవడానికి చైనా, రష్యా, భారత్ వంటి దేశాల సెంట్రల్ బ్యాంకులు పెద్ద ఎత్తున బంగారాన్ని కొనుగోలు చేసి నిల్వ చేసుకుంటున్నాయి. డిమాండ్ పెరిగి, సరఫరా తగ్గడంతో ధరలు ఆకాశాన్నంటుతున్నాయి.
ఆర్థిక, భౌగోళిక అస్థిరత: ప్రపంచవ్యాప్తంగా సాగుతున్న యుద్ధ వాతావరణం, ద్రవ్యోల్బణం కారణంగా కరెన్సీల విలువ పడిపోతుండటంతో ఇన్వెస్టర్లు సురక్షితమైన పెట్టుబడిగా భావించే బంగారం వైపు మొగ్గు చూపుతున్నారు.
ఇన్వెస్టర్లకు నిపుణుల సలహా:భవిష్యత్తులో బంగారం ఖచ్చితమైన ధర ఎంత ఉంటుందో ఎవరూ గ్యారెంటీ ఇవ్వలేనప్పటికీ, ద్రవ్యోల్బణాన్ని తట్టుకుని నిలబడే ఏకైక నమ్మకమైన ఆస్తి బంగారమేనని చరిత్ర నిరూపించింది. ఈ దశాబ్దం ముగిసేసరికి బంగారం సామాన్య కుటుంబాల అందుబాటు పక్కన బెడితే, మధ్యతరగతికి కూడా దూరమయ్యే ప్రమాదం ఉంది. అందుకే, పిల్లల పెళ్లిళ్లు లేదా భవిష్యత్తు అవసరాల కోసం ప్లాన్ చేసుకునే వారు ఇప్పటి నుండే డిజిటల్ గోల్డ్ లేదా సావరిన్ గోల్డ్ బాండ్ల రూపంలో కొద్దికొద్దిగా పెట్టుబడి పెట్టడం సురక్షితమైన వ్యూహమని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.
మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..విజయ్ నటించిన చివరి చిత్రం ‘జననాయగన్’ కోసం అభిమానులు ఎంతో ఆత్రుతగా వేచి చూస్తున్నారు. బెంగళూరు వంటి నగరాల్లో టికెట్ ధరలు ఆకాశాన్ని తాకుతుండగా, తమిళనాడులో మాత్రం ప్రభుత్వం నియంత్రణ విధించింది. ‘A’ సర్టిఫికేట్ వివాదం, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న రూమర్ల నేపథ్యంలో, ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభావాన్ని చూపుతుందో తెలుసుకుందాం.
సినిమా విడుదల & టికెట్ ధరలు..జూలై 23న విడుదల కానున్న ఈ సినిమా కోసం అడ్వాన్స్ బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభమయ్యాయి. బెంగళూరు వంటి నగరాల్లో మొదటి షో టికెట్ ధరలు రూ. 800 నుండి రూ. 1,600 వరకు ఉండగా, కొన్ని ప్రీమియం థియేటర్లలో (నెక్సస్ శాంతినికేతన్ మాల్) రెక్లైనర్ టికెట్లు రూ. 2,500 వరకు అమ్ముడవుతున్నాయి. విజయ్ చివరి సినిమా కావడంతో అభిమానులు ధరతో సంబంధం లేకుండా టికెట్లను కొనుగోలు చేస్తున్నారు. అయితే, తమిళనాడులో థియేటర్ యజమానులు ప్రభుత్వ నిర్ణీత ధరల కంటే ఒక్క రూపాయి కూడా ఎక్కువ వసూలు చేయకూడదని కఠినమైన ఆదేశాలు జారీ అయ్యాయి.
రాజకీయాలు & సినిమా..విజయ్ ప్రస్తుతం తమిళనాడు ముఖ్యమంత్రిగా తన రాజకీయ బాధ్యతలపై దృష్టి సారించారు. నటనకు పూర్తిగా స్వస్తి పలికిన ఆయనకు ‘జననాయగన్’ చివరి సినిమా. ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన తర్వాత విడుదలవుతున్న మొదటి సినిమా కావడంతో, దీనిపై రాజకీయంగా కూడా ఆసక్తి నెలకొంది. అందుకే థియేటర్లలో టికెట్ల ధరల విషయంలో ఎటువంటి వివాదాలు తలెత్తకుండా చిత్ర బృందం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటోంది.
‘A’ సర్టిఫికేషన్..ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు ‘A’ (అడల్ట్) సర్టిఫికేట్ జారీ చేసింది. దీనివల్ల 18 ఏళ్ల లోపు వారు సినిమా చూసేందుకు అవకాశం లేదు. ఇది కుటుంబంతో సినిమాకు వెళ్లే అభిమానులకు కొంత నిరాశ కలిగించే అంశం. హెచ్. వినోద్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో పూజా హెగ్డే, బాబీ డియోల్, మమితా బైజు తదితరులు కీలక పాత్రల్లో నటించారు. మంత్రి శ్రీనాథ్ ఇందులో విజయ్ ముస్లిం స్నేహితుడిగా నటిస్తున్నట్లు సమాచారం.
రూమర్లు..ఈ సినిమా విడుదలయ్యే ముందు పలు అవాస్తవ వీడియోలు వైరల్ అయ్యాయి. ముఖ్యంగా విజయ్ ఢిల్లీకి వెళ్లి ‘కాక్రోచ్ జనతా పార్టీ’ నిరసనలకు మద్దతు తెలిపినట్లు వచ్చిన వీడియోలను ఢిల్లీ పోలీసులు ఖండించారు, అవి ఢిల్లీలో చిత్రీకరించినవి కాదని స్పష్టం చేశారు. ఏప్రిల్ 2026లో సినిమా ఆన్లైన్లో లీక్ అవ్వడం, కోర్టులు, సెన్సార్ బోర్డుతో వివాదాల వంటి అనేక సవాళ్లను దాటుకుని ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది.
72వ జాతీయ చలనచిత్ర అవార్డులలో తెలుగు చిత్రాల హవా స్పష్టంగా కనిపించింది. దేశవ్యాప్తంగా దాదాపు 400 సినిమాలు స్క్రీనింగ్కు రాగా, టాలీవుడ్ ఏకంగా 8 అవార్డులను కైవసం చేసుకొని సరికొత్త రికార్డు సృష్టించింది. తెలుగు జ్యూరీ మెంబర్గా వి.ఎన్. ఆదిత్య వ్యవహరించిన ఈ పోటీలలో, మొత్తం 43 కేటగిరీలకు గానూ తెలుగు సినిమాలు తమ సత్తా చాటాయి. ప్రముఖ చిత్రం కల్కి 2898 ఏడీ ఉత్తమ పాపులర్ చిత్రంగా అవార్డును అందుకుంది. ఈ సినిమాకు ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించారు. కమిటీ కుర్రాళ్ళు ఉత్తమ తెలుగు ప్రాంతీయ చిత్రంగా ఎంపికైంది. ఉత్తమ స్క్రీన్ ప్లే అండ్ బెస్ట్ డైలాగ్ రైటర్ అవార్డు లక్కీ భాస్కర్ సినిమాకు గాను వెంకీ అట్లూరికి దక్కగా, పుష్ప 2: ది రూల్ సినిమాకు గాను సుకుమార్ బండ్రెడ్డి ఉత్తమ స్క్రీన్ ప్లే రైటర్ అవార్డును గెలుచుకున్నారు. 35 చిన్న కథ కాదు ఉత్తమ బాలల చిత్రంగా, కల్కి 2898 ఏడీ ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్ విభాగంలోనూ అవార్డులు సాధించాయి. పుష్ప చిత్రానికి దీపాలి నూర్, శీతల్ శర్మ ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్లుగా, కమిటీ కుర్రాళ్ళు చిత్రానికి పి. రవికుమార్ ఉత్తమ మేకప్ ఆర్టిస్ట్గా పురస్కారాలు అందుకున్నారు.
రూ. 3,500 లోపు ప్రీమియం మెటాలిక్ బాడీ, బెస్ట్ డిస్ప్లే కలిగిన వాచ్ కోసం వెతికే వారికి, రియల్మీ వాచ్ S2 ఒక పర్ఫెక్ట్ ఎంపిక. ఆకర్షణీయమైన క్లాసిక్ లుక్, ఏఐ వాచ్ ఫేసెస్ క్రియేషన్, కాలింగ్ ఫీచర్లతో వస్తున్న ఈ వాచ్ ఎలా పనిచేస్తుందో చూద్దాం. బడ్జెట్ ధరలో లభిస్తున్న ఈ ‘వాల్యూ ఫర్ మనీ’ గ్యాడ్జెట్ యొక్క పూర్తి విశేషాలను తెలుసుకుందాం!
క్లాసీ డిజైన్, డిస్ప్లేరియల్మీ వాచ్ S2 మొదటి చూపులోనే తన క్లాసిక్ అనలాగ్ వాచ్ లుక్తో ఆకట్టుకుంటుంది. ఇందులో ఉన్న 1.43 అంగుళాల AMOLED డిస్ప్లే చాలా స్పష్టంగా, బ్రైట్గా ఉంటుంది. ఎండలో కూడా స్క్రీన్ క్లియర్గా కనిపిస్తుంది. ‘ఆల్వేస్-ఆన్ డిస్ప్లే’ ఫీచర్ ఉండటం వల్ల మీ వాచ్ ఎప్పుడూ ఆన్లో ఉండి, మరింత స్టైలిష్గా కనిపిస్తుంది. మెటాలిక్ బాడీ, కంఫర్టబుల్ స్ట్రాప్స్ దీనికి ప్రీమియం ఫినిషింగ్ను ఇస్తాయి.
స్మార్ట్ కంట్రోల్రియల్మీ ఈ వాచ్లో సరికొత్త ‘సూపర్ ఏఐ ఇంజన్’ను ప్రవేశపెట్టింది. దీనివల్ల మీరు వాయిస్ ద్వారా వాచ్ను కంట్రోల్ చేయవచ్చు. అత్యంత ఆకర్షణీయమైన ఫీచర్ ఏంటంటే, మీ డ్రెస్సింగ్ స్టైల్ లేదా మూడ్కు తగ్గట్టుగా ఏఐ ద్వారా వందలాది వాచ్ ఫేసెస్ను క్షణాల్లో క్రియేట్ చేసుకోవచ్చు. టెక్ లవర్స్కు ఇది ఒక క్రేజీ ఫీచర్.
మెగా బ్యాటరీ లైఫ్సాధారణంగా AMOLED వాచ్లు 3-4 రోజులే వస్తాయి, కానీ రియల్మీ వాచ్ S2 తన ఆప్టిమైజ్డ్ చిప్సెట్, పవర్ఫుల్ మేనేజ్మెంట్తో ఏకంగా 20 రోజుల బ్యాటరీ లైఫ్ను అందిస్తుంది. బ్లూటూత్ కాలింగ్ను ఎక్కువగా వాడినా, కనీసం వారం రోజులకు పైగా బ్యాకప్ లభిస్తుంది. కాబట్టి పదే పదే ఛార్జింగ్ పెట్టే టెన్షన్ ఇక ఉండదు.
కాలింగ్, హెల్త్ ఫీచర్లుఇన్-బిల్ట్ మైక్, స్పీకర్ ఉండటం వల్ల నేరుగా వాచ్ నుంచే కాల్స్ మాట్లాడవచ్చు. ఆరోగ్య పర్యవేక్షణ కోసం 24/7 హార్ట్ రేట్ మానిటర్, SpO2 సెన్సార్, స్లీప్ ట్రాకింగ్, స్ట్రెస్ మానిటరింగ్ వంటి ఫీచర్లు ఇందులో పక్కాగా పనిచేస్తాయి. ఫిట్నెస్ ప్రియుల కోసం 110 కంటే ఎక్కువ స్పోర్ట్స్ మోడ్స్ అందుబాటులో ఉన్నాయి.
రూ. 3,299 ధరలో లభిస్తున్న రియల్మీ వాచ్ S2, ప్రీమియం ఫీచర్లు, లాంగ్ బ్యాటరీ లైఫ్ కోరుకునే వారికి ఒక బెస్ట్ ఛాయిస్. మీరు తక్కువ బడ్జెట్లో ప్రీమియం బ్రాండ్ వాల్యూ మరియు అదిరిపోయే లుక్ కావాలనుకుంటే, రియల్మీ వాచ్ S2 ని కళ్ళు మూసుకుని ఎంచుకోవచ్చు! ఆన్లైన్ స్టోర్లలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఈ వాచ్ను వెంటనే చెక్ చేయండి
అక్కినేని అఖిల్ హీరోగా, విక్రమ్ కె. కుమార్ దర్శకత్వంలో 2017లో వచ్చిన ఫీల్ గుడ్ లవ్ స్టోరీ చిత్రం ‘హలో’. మంచి హైప్ మీద విడుదలైన ఈ సినిమా థియేటర్లలో అంతగా ఆకట్టుకోలేకపోయింది. కానీ ఇందులోని సాంగ్స్ మాత్రం ఇప్పటికీ యూట్యూ్బ్, సోషల్ మీడియాలో మారుమోగుతున్నాయి. ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో కథానాయకుడు, కథానాయికల చిన్ననాటి సన్నివేశాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా చిన్ననాటి సీను, జున్నుల మధ్య సాగే అమాయకమైన స్నేహం, ప్రేమకథ అందరి హృదయాలను తాకింది. ఇప్పటికీ ఈ సినిమాలోని చైల్డ్ హుడ్ సన్నివేశాలు నెట్టింట షేర్ చేస్తుంటారు. అయితే ఈ చిత్రంలో చిన్ననాటి ‘జున్ను’ (ప్రియ) పాత్రలో కనిపించి, తన ముద్దు ముద్దు ఎక్స్ప్రెషన్స్తో మెప్పించిన ఆ చిన్నారి గుర్తుందా? ఆ చైల్డ్ ఆర్టిస్ట్ అసలు పేరు మైరా దాండేకర్ (Myrah Dandekar).
ఎక్కువ మంది చదివినవి : Sudhakar : నేను కోమాలో ఉన్నప్పుడు ఆసుపత్రికి వచ్చి చూసిన హీరో అతడే.. నటుడు సుధాకర్..
మహారాష్ట్రకు చెందిన మైరా దాండేకర్, ‘హలో’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. మొదటి సినిమాతోనే అమాయకమైన నటనతో అందరి హృదయాలు దొచుకుంది. ఆ తర్వాత హిందీ చిత్రసీమలోనూ బాలనటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. రాణి ముఖర్జీ నటించిన ‘హిచ్కీ’, జాన్ అబ్రహాం ‘సత్యమేవ జయతే’, అజయ్ దేవగణ్ ‘తానాజీ’ వంటి పలు బాలీవుడ్ చిత్రాల్లోనూ కీలక పాత్రల్లో నటించింది. కేవలం సినిమాల్లోనే కాకుండా ఇప్పటివరకు 50కి పైగా టీవీ ప్రకటనలు, మోడలింగ్ ప్రాజెక్ట్లలో నటించి మంచి పాపులారిటీ సంపాదించుకుంది.
ఎక్కువ మంది చదివినవి : Tanikella Bharani: ఆ హీరో చాలా గొప్ప మనిషి.. ఆయన పేరు వినగానే రజినీకాంత్ సిగరెట్ పడేసి నిలబడ్డారు.. తనికెళ్ల భరణి..
అయితే, ‘హలో’ సినిమా వచ్చి ఏళ్లు గడుస్తుండటంతో ఆ బుజ్జి జున్ను ఇప్పుడు బాగా పెద్దదైపోయింది. ప్రస్తుతం మైరా టీనేజ్ ఏజ్లోకి అడుగుపెట్టి, అత్యంత స్టైలిష్గా, గ్లామరస్గా మారిపోయింది. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే మైరా, ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫొటో షూట్ పిక్స్, రీల్స్ను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. తాజాగా ఆమెకు సంబంధించిన లేటేస్ట్ డ్యాన్స్ వీడియోస్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. అప్పట్లో చిన్నారిగా చూసిన జున్ను… ఇప్పుడు ఇంత క్యూట్గా, గ్లామరస్గా తయారైందా అని నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
ఎక్కువ మంది చదివినవి : ఎక్కువ మంది చదివినవి : Srikanth: ఆ సినిమా తర్వాత నా గ్రాఫ్ మొత్తం పడిపోయింది.. చాలా దెబ్బ పడింది.. హీరో శ్రీకాంత్..
జున్ను లేటేస్ట్..View this post on Instagram
A post shared by Myrah Dandekar (@myrahdandekarofficial)
ఎక్కువ మంది చదివినవి : ఎక్కువ మంది చదివినవి : Kota Srinivasa Rao : ఆ హీరోలగా చేయాలంటే ఇంకో జన్మ ఎత్తాలి.. ఆరోజు అతడి కష్టాన్ని కళ్లరా చూశా.. కోట శ్రీనివాస్ రావు..
బంగారం ధరల్లో ఊహించని మార్పులు చోటుచేసుకుంటున్నాయి.. ఇటీవల తగ్గుతూ వచ్చిన ధరలు.. మళ్లీ పెరుగుతున్నాయి.. ఇరాన్-అమెరికా యుద్ధం అంతర్జాతీయంగా జరుగుతున్న పరిణామాలు, డాలర్, రూపాయి విలువ మారకం ప్రభావంతో బంగారం, వెండి ధరలు పెరుగుతున్నాయని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. తాజాగా బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి.. సోమవారం ఒక్కరోజే పది గ్రాముల స్వచ్ఛమైన బంగారంపై రూ.180 మేర ధర పెరిగింది. పలు వెబ్సైట్లలో నమోదైన ధరల ఆధారంగా మంగళవారం (జులై 21) ఉదయం 6 గంటల వరకు దేశీయంగా బంగారం, వెండి ధరలు ఈ కింది విధంగా ఉన్నాయి.
24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాముల ధరపై రూ.10 మేర పెరిగి.. రూ.1,43,470 గా ఉంది.
22 క్యారెట్ల పసిడి రేటు 10 గ్రాములపై రూ.10 మేర పెరిగి రూ.1,31,510 గా ఉంది.
వెండి కిలో ధరపై రూ.100 మేర పెరిగి.. రూ.2,35,100 గా కొనసాగుతోంది.
అయితే.. ప్రాంతాల వారీగా బంగారం, వెండి ధరల్లో వ్యాత్యాసం ఉంటుంది.
ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు..హైదరాబాద్లో 24 క్యారెట్ల బంగారం10 గ్రాముల ధర రూ.1,43,470, 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,31,510 గా ఉంది. వెండి కిలో ధర రూ.2,34,900 ఉంది.
విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.1,43,470, 22 క్యారెట్ల గోల్డ్ 10గ్రాముల ధర రూ.1,31,510 ఉంది. వెండి కిలో ధర రూ.2,34,900 ఉంది.
ఢిల్లీలో 24 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాముల ధర రూ.1,43,620, 22 క్యారెట్ల ధర రూ.1,31,660 గా ఉంది. వెండి కిలో ధర రూ.2,35,100 ఉంది.
ముంబైలో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,43,470, 22 క్యారెట్ల ధర రూ.1,31,510 గా ఉంది. వెండి కిలో ధర రూ.2,35,100 లుగా ఉంది.
చెన్నైలో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.143,470, 22 క్యారెట్ల ధర రూ.1,31,510 ఉంది. వెండి కిలో ధర రూ.2,34,900 ఉంది.
బెంగళూరులో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,43,470, 22 క్యారెట్ల ధర రూ.1,31,510 ఉంది. వెండి కిలో ధర రూ.2,35,100 లుగా ఉంది.
కాగా.. బంగారం, వెండి ధరలు అన్ని నగరాల్లో ఒకే విధంగా ఉండవు.. స్థానిక డిమాండ్, సరఫరా, అలాగే రాష్ట్ర పన్నులు, తదితర అంశాల ప్రకారం ఎప్పటికప్పుడు మారుతుంటాయి.. అందుకే అన్ని ప్రధాన నగరాల్లో కూడా ధరల్లో వ్యత్యాసాలు ఉంటాయి. ఒకవేళ మీకు బంగారం, వెండి ధరల లేటెస్ట్ అప్డేట్ గురించి తెలుసుకోవాలంటే ఈ మొబైల్ నెంబర్కు 8955664433కు మిస్డ్ కాల్ ఇవ్వవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ప్రిన్స్ తన సోషల్ మీడియా వేదికగా ప్రపోజల్ వీడియోను పంచుకుని, తాను పెళ్లి చేసుకోబోతున్న విషయాన్ని అభిమానులకు తెలియజేశారు. ఒక స్నేహితుడి పెళ్లిలో మొదలైన వీరి పరిచయం, ప్రేమగా మారి ఇప్పుడు పెళ్లి పీటల వరకు వచ్చింది. న్యూజిలాండ్లో స్థిరపడిన సాయి మాచిరాజుతో ప్రిన్స్ పెళ్లి జరగనుంది.
హీరో నుంచి సహాయ నటుడిగా..వైజాగ్ కు చెందిన ప్రిన్స్ ‘బస్ స్టాప్’ వంటి సినిమాలతో హీరోగా పరిచయమయ్యారు. ఆ తర్వాత పాత్రల ప్రాధాన్యతను బట్టి ‘నేను శైలజ’, ‘డీజే టిల్లు’ వంటి చిత్రాల్లో సహాయ నటుడిగా అలరించారు. ఈ ఏడాది విడుదలైన ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ మూవీలో కనిపించిన ఆయన, బిగ్బాస్ తొలి సీజన్లో పాల్గొని తనదైన ముద్ర వేశారు. కెరీర్పరంగా బిజీగా ఉన్నప్పటికీ, ఇప్పుడు తన వ్యక్తిగత జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించబోతున్నారు.
ప్రేమకథ మొదలైంది ఇలా..గతేడాది సెప్టెంబరులో ఒక స్నేహితుడి పెళ్లి వేడుకలో ప్రిన్స్ మరియు సాయి మాచిరాజు మొదటిసారి కలుసుకున్నారు. ఆ పరిచయం కాస్తా స్నేహంగా మారింది. ఇద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకున్న తర్వాతే వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. వీరికి కామన్ ఫ్రెండ్ అయిన నటుడు ప్రియదర్శి సమక్షంలోనే ప్రిన్స్ తన ప్రేమను వ్యక్తపరిచారు. ఈ ప్రపోజల్ వీడియోను ప్రిన్స్ ఇటీవల సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా, అది నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటోంది.
న్యూజిలాండ్లో పెళ్లి వేడుకప్రిన్స్ను చేసుకోబోయే సాయి మాచిరాజు కుటుంబం ప్రస్తుతం న్యూజిలాండ్లో ఉంటోంది. ఆమె కూడా అక్కడే ఉద్యోగం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో, వచ్చే నెల 24వ తేదీన వీరి వివాహం న్యూజిలాండ్లో జరగనున్నట్లు సమాచారం. అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ పెళ్లి వేడుక జరగబోతోంది.
వెండితెరపై ఎన్నో పాత్రలతో అలరించిన ప్రిన్స్, నిజజీవితంలో తన జీవిత భాగస్వామిని కలుసుకోవడం పట్ల అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కొత్త జీవితంలోకి అడుగుపెడుతున్న ఈ జంటకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువలా అందుతున్నాయి. పెళ్లి వేడుకల కోసం ప్రిన్స్ న్యూజిలాండ్ బయలుదేరబోతున్నారు. న్యూజిలాండ్ వేదికగా జరగనున్న ఈ పెళ్లి వేడుక ఎలా ఉండబోతోందో అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రిన్స్, సాయి మాచిరాజుల వివాహ బంధం ఎంతో అన్యోన్యంగా ఉండాలని కోరుకుందాం.
హైదరాబాద్, జూలై 21: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడేందుకు అనుకూల వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయని భారత వాతావరణ శాఖ (IMD) వెల్లడించింది. ఈ నెల 23, 24 తేదీల్లో ఉత్తర ఒడిశా–పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాలకు ఆనుకుని మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో రాబోయే రోజుల్లో తెలంగాణతో పాటు దేశంలోని పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం పశ్చిమ మధ్య బంగాళాఖాతం, ఉత్తర కోస్తాంధ్ర పరిసర ప్రాంతాలపై కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వాతావరణంలో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. దీంతో పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
తెలంగాణలో మంగళవారం ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, పెద్దపల్లి, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, వరంగల్, హనుమకొండ, కామారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశముందని అధికారులు పేర్కొన్నారు. అదేవిధంగా సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, రాజన్న సిరిసిల్ల తదితర జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు. వర్షాల సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఉరుములు, మెరుపుల సమయంలో బహిరంగ ప్రదేశాల్లో నిలవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
ఇక రాష్ట్రంలో గత 24 గంటల్లో పలుచోట్ల భారీ వర్షాలు నమోదయ్యాయి. కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ (యు)లో అత్యధికంగా 10.1 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. నల్గొండ జిల్లా కట్టంగూరులో 8.2 సెంటీమీటర్లు, నిజామాబాద్ గ్రామీణ మండలం మల్కాపూర్లో 8.1 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ వర్షాలతో చెరువులు, వాగులు నీటితో కళకళలాడుతుండగా, రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. రాబోయే రెండు మూడు రోజుల పాటు వర్షాల ప్రభావం కొనసాగనున్న నేపథ్యంలో ప్రజలు, రైతులు వాతావరణ శాఖ సూచనలను పాటించాలని అధికారులు సూచించారు.
హువావే మార్కెట్లోకి తెస్తున్న ఈ కొత్త ఫోన్ డిజైన్ పరంగా భారీ మార్పులను కలిగి ఉండనుంది. గతంలో బయటకు మడిచే (ఔట్వర్డ్-ఫోల్డింగ్) డిజైన్ ఉంటే, ఇప్పుడు లోపలికి మడిచే (ఇన్వర్డ్-ఫోల్డింగ్) సరికొత్త మెకానిజంతో ఇది రాబోతోంది. భారీ 6,000mAh బ్యాటరీ, కిరిన్ 9050 ప్రో చిప్సెట్తో అక్టోబరులో లాంచ్ కానున్న ఈ ఫోన్ యొక్క ప్రత్యేకతలు ఏంటో తెలుసుకుందాం!
సరికొత్త విప్లవంహువావే మేట్ ఎక్స్టీ 2లో వాడిన మడత పెట్టే విధానం అత్యంత ఆసక్తికరంగా మారింది. కొత్త పేటెంట్ వివరాల ప్రకారం, ఇది శాంసంగ్ జెడ్ ట్రై-ఫోల్డ్ తరహాలో లోపలికి మడిచే (ఇన్వర్డ్-ఫోల్డింగ్) డిజైన్ను కలిగి ఉండనుంది. దీనిలో ముందుగా ఎడమ వైపు ప్యానెల్, ఆ తర్వాత కుడి వైపు ప్యానెల్ లోపలికి మడతపడేలా ఒక వినూత్న మెకానిజంను ఉపయోగించారు. ఇది డిస్ప్లేకు మరింత రక్షణ కల్పించడమే కాకుండా, చూడటానికి ఎంతో స్టైలిష్గా ఉంటుంది.
ప్రత్యేకమైన కవర్ డిస్ప్లేపాత మోడల్తో పోలిస్తే ఇందులో మరో ముఖ్యమైన అప్గ్రేడ్ కవర్ డిస్ప్లే. పెద్ద ఫోల్డబుల్ స్క్రీన్ లోపల ఉన్నప్పటికీ, బయట వైపు ప్రత్యేకమైన కవర్ డిస్ప్లేను అందించడం వల్ల, ఫోన్ పూర్తిగా మడిచి ఉన్నప్పుడు కూడా సాధారణ స్మార్ట్ఫోన్లా వాడుకోవచ్చు. ఫోన్ వెనుక భాగంలో అమర్చిన సరికొత్త సర్క్యులర్ (గుండ్రటి) కెమెరా మాడ్యూల్ దీనికి మరింత ప్రీమియం లుక్ను ఇస్తుంది.
శక్తివంతమైన ఫీచర్లుఅక్టోబరులో లాంచ్ కానున్న ఈ ఫోన్, పెర్ఫార్మెన్స్ పరంగా అద్భుతంగా ఉండనుంది.
- చిప్సెట్: శక్తివంతమైన కిరిన్ 9050 ప్రో ప్రాసెసర్తో ఇది రానుంది.
- బ్యాటరీ: పాత మోడల్ కంటే మెరుగైన 6,000mAh భారీ బ్యాటరీని అందించడం వల్ల, ఎక్కువ సమయం పాటు ఛార్జింగ్ అవసరం ఉండదు.
- డిజైన్: కొత్త లుక్ మరియు అత్యుత్తమ నిర్మాణంతో ఇది రానుంది.
హువావే మేట్ ఎక్స్టీ 2 ఫోన్ స్మార్ట్ఫోన్ ప్రపంచాన్ని కొత్త దిశలో నడిపించేందుకు సిద్ధమవుతోంది. పాత మోడల్ సుమారు రూ. 2.35 లక్షల భారీ ధరతో లాంచ్ అవ్వగా, కొత్త ఫోన్ అంతకంటే మెరుగైన ఫీచర్లతో వస్తుందని టెక్ ప్రియులు భావిస్తున్నారు. అక్టోబరు నెలలో ఈ ఫోన్ లాంచ్ కోసం టెక్ ప్రపంచం ఎంతో ఆసక్తిగా వేచి చూస్తోంది. మీరు అత్యంత ఆధునికమైన, వినూత్నమైన డిజైన్ కలిగిన స్మార్ట్ఫోన్ కోసం ఎదురుచూస్తుంటే, మేట్ ఎక్స్టీ 2 కచ్చితంగా మీ కలల ఫోన్ కానుంది!
ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో స్టార్స్ గ వెలుగొందుతోన్న చాలామంది ఒకప్పుడు ఎన్నో ఇబ్బందులు పడిన వారే. పొట్ట కూటి కోసం రెక్కలు ముక్కలు చేసుకున్న వారే. కుటుంబాన్ని పోషించడం కోసం చిన్నా చితకా పనులు చేసిన వారు కూడా ఉన్నారు. ఇక ఈ టాలీవుడ్ నటునిది అయితే మరీ దారుణమైన పరిస్థితి. ఇప్పడంటే ఈ నటుని పేరు మీద కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి. కానీ ఒకప్పుడు ఆయన ముంబైలోని ఒక చిన్న గదిలో జీవితం గిపాడు. ఉద్యోగం లేకపోవడంతో ఇంట్లోనే ప్లేట్లు, గిన్నెలు కడిగారు. భార్య కు వచ్చే జీతంలోనే తన అవసరాలు కూడా తీర్చుకునేవాడు. అయితే ఎన్ని కష్టాలొచ్చినా నటన పట్ల ఆసక్తిని వదులుకోలేదు. అదే అతనిని ఇప్పుడు పెద్ద స్టార్ ను చేసింది. కోట్లాది రూపాయల ఆస్తులకు యజమానిగా మార్చేసింది. ప్రస్తుతం ఇండియాలోనే ది బెస్ట్ యాక్టర్లలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్న ఆ నటుడు మరెవరో కాదు మీర్జాపూర్ ఫేమ్ పంకజ్ త్రిపాఠి.
పలు హిందీ సినిమాలో పాటు తెలుగులో ‘దూసుకెళ్తా’ అనే సినిమాలోనూ నటించాడు పంకజ్ త్రిపాఠి. ప్రస్తుతం బాలీవుడ్లో నటునిగా బిజీ బిజీగా ఉంటోన్న పంకజ్ చేతిలో పెద్ద సినిమాలు, వెబ్ సిరీస్లు ఉన్నాయి. అయితే ఒకప్పుడు ఆయన ముంబైలోని ఒక చిన్న గదిలో ఉన్నారు. సినిమా అవకాశాల కోసం ముంబై అంతటా తిరిగాడు. ఆ సమయంలో ఇంటి ఖర్చులన్నీ ఆయన భార్య మృదుల త్రిపాఠి జీతంతోనే గడిచేవి. ముంబైకి వచ్చిన తర్వాత చాలా సంవత్సరాల పాటు పంకజ్ త్రిపాఠికి సినిమాల్లో పెద్ద అవకాశాలు రాలేదు. నిరంతరం ఆడిషన్ల కోసం తిరుగుతూ, తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్నప్పటికీ, అతను తన నటనా కలను వదులుకోలేదు. మృదుల ఒక పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తుండగా, ఆమె జీతం ఇంటి ఖర్చులకు సరిపోయేది. మరోవైపు, పంకజ్ వంట, గిన్నెలు కడగడం, శుభ్రపరచడం వంటి ఇతర ఇంటి పనులను చూసుకునేవాడు. కుటుంబంలో ఒకరికొకరు సహకరించుకోవడం వల్లే తాము కష్టకాలాలను అధిగమించగలిగామని వారిద్దరూ అనేక ఇంటర్వ్యూలలో చెబుతారు.
ఒక ఇంటర్వ్యూలో పంకజ్ త్రిపాఠి మాట్లాడుతూ, 2004 నుంచి 2010 మధ్య తన ఆదాయం చాలా తక్కువగా ఉండేదని చెప్పారు. చేతిలో ఉద్యోగం లేకపోవడం వల్ల ఆయన తరచుగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. ఆ సమయంలో, ఆయన భార్య సంపాదన కుటుంబానికి ప్రధాన వనరుగా ఉండేది. ఇంట్లో బాధ్యతలు పంచుకోవడంలో ఎలాంటి సమస్యలు రాలేదని, పైగా ఒకరికొకరు తోడుగా ఉంటూనే కుటుంబం ముందుకు సాగుతుందని కూడా ఆయన స్పష్టంగా పేర్కొన్నారు.
పంకజ్ త్రిపాఠి ప్రస్తుతం ముంబైలో విలాసవంతమైన ఇంట్లో నివసిస్తున్నప్పటికీ, ఆయన తన ఇంట్లో మంచం, మట్టి పాత్రల వంటి పల్లెటూరి వస్తువులను వాడుతారు. అలాగే బీహార్లోని తన పూర్వీకుల ఇంటిని జాగ్రత్తగా చూసుకుంటున్నారు. మీడియా నివేదికల ప్రకారం, పంకజ్ త్రిపాఠి నికర ఆస్తి విలువ సుమారు రూ. 40 కోట్లు. ఆయన ఒక సినిమాకు రూ. 3 నుంచి 4 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటారు.
పంకజ్ త్రిపాఠి ఫొటోస్..View this post on Instagram
A post shared by Pankaj Tripathi (@pankajtripathi)
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మీరు రూ. 20 వేల లోపు నమ్మకమైన బ్రాండ్ నుండి మంచి డిస్ప్లే, కెమెరా కలిగిన ఫోన్ కోసం చూస్తున్నారా? అయితే గెలాక్సీ M36 5G మీకు సరైన ఎంపిక. OIS సపోర్ట్ ఉన్న 50MP కెమెరా, పవర్ఫుల్ ఎక్సీనోస్ ప్రాసెసర్, 5000mAh బ్యాటరీతో వస్తున్న ఈ ఫోన్ పనితీరు ఎలా ఉంది? మిడ్-రేంజ్ విభాగంలో ఇది ఎందుకు ‘మోస్ట్ వాల్యూ ఫర్ మనీ’ ఫోన్ అనిపించుకుంటుందో తెలుసుకుందాం!
డిస్ప్లే మ్యాజిక్ఈ ఫోన్ యొక్క ప్రధాన ఆకర్షణ 6.7 అంగుళాల ఫుల్ హెచ్డీ+ సూపర్ అమోలెడ్ డిస్ప్లే. 120Hz రిఫ్రెష్ రేట్ ఉండటం వల్ల గేమింగ్, సోషల్ మీడియా స్క్రోలింగ్ అత్యంత స్మూత్గా ఉంటాయి. హై-బ్రైట్నెస్ మోడ్ ఉండటం వల్ల ఎండలో కూడా స్క్రీన్ స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే, గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ ఈ డిస్ప్లేకు అదనపు బలాన్ని చేకూరుస్తుంది.
ఫోటోగ్రఫీ ప్రేమికులకు పండగఫోటోగ్రఫీ, రీల్స్ చేసేవారికి ఈ ఫోన్ ఒక అద్భుతమైన ఎంపిక.
- 50MP ప్రైమరీ కెమెరా (OIS): ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉండటం వల్ల వీడియోలు, ఫోటోలు షేక్ అవ్వకుండా స్పష్టంగా వస్తాయి.
- నైట్గ్రఫీ: శామ్సంగ్ ప్రత్యేకమైన ఈ ఫీచర్ చీకటిలో కూడా అద్భుతమైన ఫోటోలను తీయడానికి సహాయపడుతుంది.
- 4K వీడియో: ఈ బడ్జెట్లో ఫ్రంట్, బ్యాక్ రెండు వైపులా 4K రికార్డింగ్ సపోర్ట్ ఉండటం ఈ ఫోన్ ప్రత్యేకత.
5nm ఎక్సీనోస్ 1380 (Exynos 1380) ప్రొసెసర్ రోజువారీ పనులకు, గేమింగ్కు చాలా బాగా సెట్ అవుతుంది. వేపర్ కూలింగ్ టెక్నాలజీ ఉండటం వల్ల ఫోన్ ఎక్కువసేపు వాడినా వేడెక్కదు. 5000mAh బ్యాటరీ హెవీ యూసేజ్ లో కూడా రోజంతా మన్నుతుంది. 7.7mm మందం మాత్రమే ఉన్న ఈ ఫోన్, చేతిలో పట్టుకున్నప్పుడు చాలా ప్రీమియం ఫీలింగ్ను అందిస్తుంది.
రూ. 19,341 ధరలో శామ్సంగ్ వంటి విశ్వసనీయ బ్రాండ్ నుండి ఇంత మంచి ఫీచర్లు రావడం నిజంగా గొప్ప విషయం. సూపర్ అమోలెడ్ డిస్ప్లే, OIS కెమెరా, లాంగ్-లాస్టింగ్ సాఫ్ట్వేర్ సపోర్ట్తో గెలాక్సీ M36 5G ఈ ధరలో బెస్ట్ ఎంపిక. మీరు బడ్జెట్ ధరలో ఒక పవర్ఫుల్ 5G ఫోన్ కొనాలనుకుంటే, ఈ శామ్సంగ్ స్మార్ట్ఫోన్ను కళ్ళు మూసుకుని ఎంచుకోవచ్చు
కేవలం రూ. 1,299 ధరకే లభిస్తున్న ఈ వాచ్లో బిగ్ డిస్ప్లే నుంచి అడ్వాన్స్డ్ హెల్త్ ట్రాకింగ్ వరకు అన్నీ ఉన్నాయి. ఆకర్షణీయమైన డిజైన్, వారం రోజుల బ్యాటరీ లైఫ్, 100కు పైగా స్పోర్ట్స్ మోడ్స్ ఉన్న ఈ వాచ్, బడ్జెట్ ప్రియులకు ఒక పర్ఫెక్ట్ ఎంపిక. మరి ఈ స్మార్ట్వాచ్ యొక్క పూర్తి స్పెసిఫికేషన్లు, పనితీరు, ఇతర ప్రత్యేకతల గురించి తెలుసుకుందాం!
అదిరిపోయే విజువల్స్ఈ వాచ్లోని అతిపెద్ద హైలైట్ 1.83 ఇంచుల హెచ్డీ (HD) డిస్ప్లే. స్క్రీన్ పెద్దదిగా ఉండటం వల్ల నోటిఫికేషన్లు చదవడం, మెసేజ్లు చూడటం, కాల్స్ లిఫ్ట్ చేయడం చాలా సులభంగా ఉంటుంది. 100కు పైగా క్లౌడ్ ఆధారిత వాచ్ ఫేసెస్ ఉండటం వల్ల మీ డ్రెస్సింగ్ స్టైల్కి తగ్గట్టుగా రోజుకో కొత్త లుక్ను ఎంచుకోవచ్చు.
ఇన్-బిల్ట్ బ్లూటూత్ కాలింగ్పేరుకు తగ్గట్టుగానే ఇది అద్భుతమైన బ్లూటూత్ కాలింగ్ సదుపాయాన్ని అందిస్తుంది. ఇందులో ఇన్-బిల్ట్ మైక్, స్పీకర్ ఉండటం వల్ల నేరుగా వాచ్ నుండే కాల్స్ మాట్లాడవచ్చు, డయల్ చేయవచ్చు. బైక్ నడుపుతున్నప్పుడు లేదా ఆఫీస్ పనిలో బిజీగా ఉన్నప్పుడు ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
ఫిట్నెస్ ట్రాకింగ్రూ. 1,299 బడ్జెట్లో ఇంతకంటే మెరుగైన హెల్త్ సూట్ దొరకడం కష్టం.
- హెల్త్ మానిటర్స్: SpO2 బ్లడ్ ఆక్సిజన్ లెవెల్స్, 24/7 హార్ట్ రేట్ మానిటరింగ్తో ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించవచ్చు.
- స్లీప్ ట్రాకర్: మీరు గాఢ నిద్రలో ఎంతసేపు ఉన్నారో ఇది లెక్కగడుతుంది.
- 100+ స్పోర్ట్స్ మోడ్స్: రన్నింగ్, వాకింగ్, సైక్లింగ్ వంటి అనేక మోడ్స్తో మీరు బర్న్ చేసిన క్యాలరీలను కచ్చితంగా ట్రాక్ చేయవచ్చు.
ఈ వాచ్ IP67 రేటింగ్తో వస్తుంది, కాబట్టి వర్షంలో తడిసినా, చెమట పట్టినా ఎటువంటి ఇబ్బంది ఉండదు. బ్యాటరీ విషయానికి వస్తే, సాధారణ వాడకంలో 6 నుండి 7 రోజుల వరకు వస్తుంది. బ్లూటూత్ కాలింగ్ ఎక్కువగా వాడితే సుమారు 2 రోజుల వరకు బ్యాకప్ లభిస్తుంది.
ఇతర ఫీచర్లుఇందులో ఇన్-బిల్ట్ వాయిస్ అసిస్టెంట్ సపోర్ట్, మ్యూజిక్ కంట్రోల్, కెమెరా కంట్రోల్, టైమ్ పాస్ కోసం చిన్న చిన్న గేమ్స్ కూడా ఉన్నాయి. సిలికాన్ స్ట్రాప్స్ చాలా సాఫ్ట్గా ఉండి, చేతికి చాలా కంఫర్టబుల్గా ఫిట్ అవుతాయి. ఫైర్-బోల్ట్ నింజా కాల్ ప్రో ప్లస్ అనేది బడ్జెట్ ధరలో లభించే ఒక పూర్తి ప్యాకేజీ స్మార్ట్వాచ్. స్టూడెంట్స్, బడ్జెట్ లవర్స్ ఎవరైనా సరే, కళ్ళు మూసుకుని ఎంచుకోదగ్గ బెస్ట్ ఆప్షన్ ఇది. మీరు తక్కువ ధరకు అన్ని ఫీచర్లు ఉన్న వాచ్ కోసం చూస్తుంటే, దీనికి మించిన ఛాయిస్ మార్కెట్లో లేదు.
ట్రైన్ జర్నీలో ప్రయాణికులకు టికెట్లను చెక్ చేస్తూ, వారికి సీట్లను కేటాయించడంలో సాయపడే బాధ్యత TTE (ట్రైన్ టికెట్ ఎగ్జామినర్) పై ఉంటుంది. అయితే, కొన్నిసార్లు ప్రయాణికులతో TTEలు దురుసుగా ప్రవర్తించడం, లంచం (రైలు సీటు కోసం అదనపు డబ్బులు) అడగడం లేదా ఇబ్బందులకు గురిచేయడం వంటి ఘటనలు జరుగుతుంటాయి. ఒకవేళ మీ ప్రయాణంలో కూడా ఇలాంటి పరిస్థితి ఎదురైతే, ఆందోళన చెందకుండా రైల్వే నిబంధనల ప్రకారం TTEపై ఎలా ఫిర్యాదు చేయాలో తెలుసుకుందాం.
1. రైలు ప్రయాణంలో TTE మీతో దురుసుగా ప్రవర్తిస్తే ఎలా ఫిర్యాదు చేయాలి?
- ముందుగా ప్రాథమిక వివరాలను సేకరించండి
- ఫిర్యాదు చేయడానికి ముందు కొన్ని ముఖ్యమైన వివరాలను దగ్గర ఉంచుకోవడం అవసరం.
- సదరు TTE పేరు, బ్యాడ్జ్ (ఐడీ) నంబర్ నోట్ చేసుకోండి (వారి యూనిఫామ్పై ఇది ఉంటుంది).
- ఘటన జరిగిన సమయం రైలు నంబర్, మీరు ప్రయాణిస్తున్న కోచ్, బెర్త్ నంబర్.
- వీలైతే ఆ సమయంలో జరిగిన ఘటనను మీ మొబైల్లో వీడియో లేదా ఆడియో రికార్డ్ చేయడం వల్ల మీ ఫిర్యాదుకు బలమైన ఆధారం దొరుకుతుంది.
ప్రతి రైలులోనూ తప్పనిసరిగా ఒక గార్డు ఉంటారు. వారి వద్ద ఫిర్యాదుల రిజిస్టర్ (Complaint Register) ఉంటుంది. మీరు నేరుగా గార్డును కలిసి జరిగిన విషయాన్ని రాతపూర్వకంగా ఆ రిజిస్టర్లో నమోదు చేయవచ్చు.
3. హెల్ప్లైన్ నంబర్ 139 కి కాల్ చేయండిభారతీయ రైల్వేకు సంబంధించిన అన్ని సేవల కోసం హెల్ప్లైన్ నంబర్ 139 అందుబాటులో ఉంది. మీరు ప్రయాణంలో ఉన్నప్పుడే 139 కి కాల్ చేసి ‘సిబ్బంది ప్రవర్తన’ లేదా ‘అవినీతి’ విభాగాన్ని ఎంచుకుని TTEపై లైవ్లోనే ఫిర్యాదు చేయవచ్చు.
4. ‘రైల్ మదద్’ (RailMadad) యాప్ లేదా వెబ్సైట్- ఆన్లైన్ ద్వారా ఫిర్యాదు చేయడానికి ఇది అత్యంత వేగవంతమైన మార్గం:
- మీరు RailMadad యాప్ లేదా అధికారిక వెబ్సైట్ (railmadad.indianrailways.gov.in) ఓపెన్ చేయాలి.
- మీ మొబైల్ నంబర్ ఇచ్చి OTP ద్వారా లాగిన్ అవ్వండి.
- ‘Train Complaint’ విభాగంలోకి వెళ్లి, ‘Staff Behaviour’ లేదా ‘Corruption/Bribery’ ఆప్షన్ను ఎంచుకోండి.
- మీ PNR నంబర్, ఘటన వివరాలు, మీ వద్ద ఉన్న ఫోటో/వీడియో ఆధారాలను అప్లోడ్ చేసి ఫిర్యాదును సబ్మిట్ చేయవచ్చు. దీని ద్వారా మీ ఫిర్యాదుపై తక్షణమే చర్యలు తీసుకుంటారు.
రైలులో ఏదైనా తోపులాట జరిగినా, గోడవ జరిగినా రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF) లేదా గవర్నమెంట్ రైల్వే పోలీస్ (GRP) జవాన్లకు కూడా మీరు ఈ విషయాన్ని తెలియజేయవచ్చు. ఒకవేళ రైలులో వారు అందుబాటులో లేకపోతే, తర్వాతి రైల్వే స్టేషన్ రాగానే అక్కడి స్టేషన్ మాస్టర్ లేదా రైల్వే పోలీస్ స్టేషన్లో రాతపూర్వక ఫిర్యాదు ఇవ్వవచ్చు.
ఇది కూడా చదవండి: EPFO: పెళ్లి కోసం పీఎఫ్ నుంచి ఎంత విత్డ్రా చేసుకోవచ్చు..? ఇప్పుడు మరింత సులభం!
ముఖ్య గమనిక: మీ వద్ద చెల్లుబాటు అయ్యే (Valid) టికెట్ ఉన్నప్పుడు, మిమ్మల్ని సీటు నుండి బలవంతంగా దించేసే హక్కు ఏ TTEకీ లేదు. రైల్వే శాఖ నిబంధనల ప్రకారం ప్రయాణికులతో దురుసుగా ప్రవర్తించే లేదా లంచాలు డిమాండ్ చేసే సిబ్బందిపై సస్పెన్షన్ లేదా కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. అందుకే ప్రయాణంలో మీ హక్కులను తెలుసుకుని ధైర్యంగా ఉండండి.
రైల్వే ప్రయాణంలో ప్రయాణికుల ఫిర్యాదుల నమోదుకు సంబంధించిన వివరణాత్మక విధానాన్ని, వివిధ హెల్ప్లైన్ నంబర్లను ఈ వీడియో స్పష్టంగా వివరిస్తుంది. ఇది ప్రయాణంలో మీకు సహాయకరంగా ఉంటుంది.
ఇది కూడా చదవండి: Indian Railways: రైలులో ఎన్ని కేజీల లగేజీ తీసుకెళ్లవచ్చో తెలుసా? లిమిట్ మించితే భారీ ఛార్జీలు!
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Gold Rust: మానవ చరిత్రలో బంగారానికి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ధర ఎంత పెరిగినా షాపులన్ని మహిళలతో కిటకిటలాడుతుంటాయి. మన భారతీయ సాంప్రదాయంలో పసిడికి ప్రత్యేక స్థానముంది. మహిళలకు అత్యంతగా ఇష్టపడేది బంగారం. అయితే బంగారం ఎన్నేళ్లు అయినా చెక్కు చెదరకుండా ఉంటుంది. వేల సంవత్సరాల క్రితం భూమిలో దాచిన బంగారు నాణాలు, ఆభరణాలు ఈరోజు తవ్వి తీసినా నిన్న మొన్న చేసిన వాటిలాగే తళతళలాడుతూ ఉంటాయి. ఇనుము లాంటి లోహాలు కొద్దిరోజులు తేమ తగిలితేనే తుప్పు పట్టి పాడైపోతాయి. కానీ బంగారం మాత్రం వేల ఏళ్లయినా అలాగే ఉంటుంది. అసలు బంగారం ఎందుకు తుప్పు పట్టదు? దాని మెరుపు ఎప్పటికీ ఎందుకు తగ్గదు? దీని వెనుక ఉన్న ఆసక్తికరమైన సైన్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.
1. రసాయనిక నిష్క్రియాత్మకత: రసాయన శాస్త్రం (Chemistry) ప్రకారం, బంగారం ఒక "నోబెల్ మెటల్" (Noble Metal). అంటే ఇది చాలా జడత్వ స్వభావాన్ని కలిగి ఉంటుంది. వేరే ఇతర మూలకాలతో లేదా రసాయనాలతో ఇది అంత త్వరగా ప్రతిచర్య (react) జరపదు. ఆవర్తన పట్టిక (Periodic Table) లో బంగారం సంకేతం Au (Aurum). దీని అణు సంఖ్య 79. దీని ఎలక్ట్రాన్ అమరిక చాలా స్థిరంగా ఉంటుంది. అందువల్ల ఇది తన ఎలక్ట్రాన్లను అంత సులభంగా కోల్పోదు.
2. ఆక్సిజన్తో చర్య జరపకపోవడం: ఇనుము తుప్పు పట్టడానికి ప్రధాన కారణం ఆక్సిడేషన్ (Oxidation). ఇనుము గాలిలోని ఆక్సిజన్, తేమతో చర్య జరిపి 'ఐరన్ ఆక్సైడ్' (తుప్పు) గా మారుతుంది. కానీ బంగారం విషయానికి వస్తే గాలిలోని ఆక్సిజన్ లేదా నీటి అణువులు దీనిపై ఎలాంటి ప్రభావం చూపలేవు. బంగారం ఆక్సిజన్తో అస్సలు ప్రతిచర్య జరపదు. అందుకే దీనికి ఆక్సైడ్ పొర ఏర్పడదు. ఫలితంగా ఇది ఎప్పటికీ తుప్పు పట్టదు.
3. ఆమ్లాల (Acids) ను సైతం తట్టుకుంటుంది: సాధారణ ఆమ్లాలు (Acids) కూడా బంగారాన్ని ఏమీ చేయలేవు. హైడ్రోక్లోరిక్ యాసిడ్ లేదా నైట్రిక్ యాసిడ్ విడివిడిగా బంగారంతో చర్య జరపలేవు. కేవలం నైట్రిక్ యాసిడ్, హైడ్రోక్లోరిక్ యాసిడ్ల మిశ్రమమైన "ఆక్వా రీజియా" అనే ద్రావణం మాత్రమే బంగారాన్ని కరిగించగలదు. అందుకే బంగారాన్ని స్వచ్ఛమైన లోహంగా భావిస్తారు.
ఒక ముఖ్యమైన విషయం: మనం వాడే కొన్ని బంగారు ఆభరణాలు కాలక్రమేణా కాస్త రంగు మారడం లేదా మెరుపు తగ్గడం గమనించే ఉంటారు. దానికి కారణం స్వచ్ఛమైన బంగారం కాదు. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం చాలా మెత్తగా ఉంటుంది. అందుకే నగలు చేయడానికి అందులో రాగి, వెండి లేదా జింక్ వంటి ఇతర లోహాలను కలుపుతారు (ఉదాహరణకు 22 క్యారెట్ లేదా 18 క్యారెట్ బంగారం). అలా కలిపిన ఇతర లోహాలు గాలిలోని సల్ఫర్ లేదా ఆక్సిజన్తో చర్య జరపడం వల్ల నగలు కాస్త మసకబారినట్లు అనిపిస్తాయి తప్ప, అసలైన బంగారానికి ఏమీ కాదు.
ప్రకృతిలో లభించే అత్యంత స్థిరమైన, అందమైన లోహాలలో బంగారం ఒకటి. దాని విలక్షణమైన పసుపు రంగు మెరుపు, ఎప్పటికీ పాడవని గుణమే దానికి అంతర్జాతీయ మార్కెట్లో అంతటి విలువను, డిమాండ్ను తెచ్చిపెట్టాయి. సైన్స్ పరంగా చూస్తే, బంగారం ఎప్పటికీ తుప్పు పట్టకపోవడమే దానికి లభించిన అతిపెద్ద వరం.
దిన ఫలాలు (జూలై 21, 2026): మేష రాశి వారు ఆర్థికంగా ఇతరులను ఆదుకునే స్థితిలో ఉంటారు. ఇంటా బయటా గౌరవ మర్యాదలకు లోటుండదు. వృషభ రాశి వారు అధికారులతో సామరస్యంగా వ్యవహరించడం మంచిది. వ్యాపారంలో కొద్దిపాటి లాభాలకు అవకాశం ఉంది. మిథున రాశి వారికి ఆర్థిక విషయాలకు సమయం బాగా అనుకూలంగా ఉంది. ఎంత సద్వినియోగం చేసుకుంటే అంత మంచిది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి మంగళవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం పెరుగుతుంది. వ్యాపారాలు నిలకడగా పురోగమిస్తాయి. ఆర్థికంగా ఇతరులను ఆదుకునే స్థితిలో ఉంటారు. ఇంటా బయటా గౌరవ మర్యాదలకు లోటుండదు. పలుకుబడి విస్తరిస్తుంది. బంధుమిత్రులతో విభేదాలు, వివాదాలు చాల వరకు పరిష్కారం అవుతాయి. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఆహార, విహారాల్లో జాగ్రత్తలు పాటించడం మంచిది. విద్యార్థులు చదువులు, పోటీ పరీక్షల్లో మంచి ఫలితాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు సాఫీగా సాగుతాయి.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)వృత్తి, ఉద్యోగాల్లో ఒత్తిడి, శ్రమ ఉన్నప్పటికీ, సకాలంలో బాధ్యతలు పూర్తి చేస్తారు. అధికారులతో సామరస్యంగా వ్యవహరించడం మంచిది. వ్యాపారంలో కొద్దిపాటి లాభాలకు అవకాశం ఉంది. తలపెట్టిన వ్యవహారాల్లో ఆలస్యం జరిగే అవకాశం ఉంది. ప్రయాణాల్లో వాహన ఇబ్బందులుంటాయి. ఆదాయ ప్రయత్నాలు సఫలం అవుతాయి. నిరుద్యోగులు తమ ప్రయత్నాల మీద శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది. ప్రేమ వ్యవహారాల్లో సఖ్యత పెరుగుతుంది.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)ఆర్థిక విషయాలకు సమయం బాగా అనుకూలంగా ఉంది. ఎంత సద్వినియోగం చేసుకుంటే అంత మంచిది. వృత్తి, ఉద్యోగాల్లో హోదా, జీతభత్యాలు పెరుగుతాయి. ఆర్థికంగా పురోగతి సాధించడానికి అవకాశం ఉంది. అనారోగ్యం నుంచి ఉపశమనం లభిస్తుంది. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. వ్యాపారాలు అనుకూలంగా సాగుతాయి. పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. అనవ సర పరిచయాలకు దూరంగా ఉండడం మంచిది. ప్రేమ వ్యవహారాల్లో బాగా దూసుకుపోతారు.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)వృత్తి, ఉద్యోగాల్లో సహచరుల బాధ్యతల్ని కూడా పంచుకోవడం జరుగుతుంది. అధికారుల నుంచి గుర్తింపు లభిస్తుంది. అదనపు ఆదాయ ప్రయత్నాలు సానుకూల ఫలితాలనిస్తాయి. ఆర్థిక లావా దేవీలకు దూరంగా ఉండడం మంచిది. కొందరు బంధుమిత్రులకు ఆర్థికంగా సహాయం చేస్తారు. సొంత పనుల మీద శ్రద్ధ పెట్టడం మంచిది. ప్రయాణాలు, ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది. ప్రేమ వ్యవహారాలు ఉత్సాహం కలిగిస్తాయి.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)వృత్తి, ఉద్యోగాల్లో బాధ్యతల్ని సమర్థవంతంగా పూర్తి చేస్తారు. ఇంటా బయటా పరిస్థితులు అను కూలంగా ఉంటాయి. కుటుంబంలో శుభకార్యానికి ప్లాన్ చేస్తారు. వ్యాపారాల్లో నూతన ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. కొందరు మిత్రుల సహాయంతో నిరుద్యోగులు ఉద్యోగం సంపాదించుకుంటారు. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది. జీవిత భాగస్వామితో విభేదాలు పరిష్కారం అవుతాయి. వ్యక్తిగత జీవితంలో ప్రశాంతత ఏర్పడుతుంది. ప్రేమ వ్యవహారాల్లో జాగ్రత్తలు అవసరం.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)కొందరు మిత్రుల నుంచి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండడం మంచిది. వృత్తి, వ్యాపారాలు సాఫీగా, సానుకూలంగా సాగుతాయి. అదనపు ఆదాయ ప్రయత్నాల మీద శ్రద్ధ పెంచడం మంచిది. ప్రయాణాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక పరిస్థితి చాలావరకు మెరుగ్గా ఉంటుంది. కుటుంబ ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగ జీవితం అనుకూలంగా సాగిపో తుంది. స్వల్ప అనారోగ్య సూచనలున్నాయి. ప్రేమ వ్యవహారాలు కొద్దిగా ఇబ్బంది పెడతాయి.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)కుటుంబంలో శుభ పరిణామాలు చోటుచేసుకుంటాయి. ఎదురు చూస్తున్న శుభవార్తలువింటారు. ప్రముఖుల నుంచి ఆదరణ పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం పెరుగుతుంది. గృహ, వాహనాల కొనుగోలు మీద దృష్టి సారిస్తారు. వ్యాపా రాల్లో అంచనాలకు మించి లాభాలు గడిస్తారు. ఆకస్మిక ధనలాభానికి అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాల రీత్యా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)ఉద్యోగంలో అదనపు బాధ్యతల్ని కూడా సమర్థవంతంగా నిర్వహిస్తారు. ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు. బంధుమిత్రులతో సాన్నిహిత్యం మరింతగా పెరుగుతుంది. ముఖ్యమైన వ్యవహా రాలు విజయవంతంగా పూర్తవుతాయి. వృత్తి, వ్యాపారాల విస్తరణ గురించి ఆలోచనలు సాగిస్తారు. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకపోవడం, ఇతరులతో వాదనలకు దిగకపోవడం మంచిది. కొత్త ప్రయత్నాలు తప్పకుండా సఫలమవుతాయి. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగిపోతాయి.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)వృత్తి, వ్యాపార వ్యవహారాల్లో కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగంలో పదోన్నతులకు అవ కాశం ఉంది. ఆర్థికపరంగా అనుకూలత పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో సరదాగా గడుపు తారు. దాంపత్యంలో అన్యోన్యత పెరుగుతుంది. పెండింగ్ పనులు సంతృప్తికరంగా పూర్తవుతాయి. ధనపరంగా వాగ్దానాలు చేయడం గానీ, హామీలు ఉండడం కానీ చేయవద్దు. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది. ముఖ్యమైన సమాచారం అందుతుంది. ప్రేమ వ్యవహారాలు అనుకూలిస్తాయి.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)ఉద్యోగంలో పని భారం, పని ఒత్తిడి కాస్తంత ఎక్కువగా ఉంటాయి. వృత్తి, వ్యాపారాల్లో శ్రమాధిక్యత ఉంటుంది. కొద్ది శ్రమతో ముఖ్యమైన వ్యవహారాలను పూర్తి చేస్తారు. ఆస్తి వివాదానికి సంబంధించి సోదరులతో ఆచితూచి వ్యవహరించడం మంచిది. కుటుంబానికి సంబంధించి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగ, వివాహ ప్రయత్నాలు బాగా అనుకూలంగా పురోగమిస్తాయి. నిరుద్యోగులు శుభవార్త వినే అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాలు సంతృప్తికరంగా సాగిపోతాయి.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)వృత్తి, ఉద్యోగాలలో పనిభారం పెరిగినప్పటికీ, ఆశించిన ప్రతిఫలం చేతికి అందుతుంది. వ్యాపారాలు నిలకడగా పురోగమిస్తాయి. ఆకస్మిక ప్రయాణాలకు అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో వాదో పవాదాలకు దిగవద్దు. చేపట్టిన పనులు పూర్తవుతాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో జాప్యం ఉంటుంది. ఆదాయ ప్రయత్నాలు కొద్దిగా సఫలం అవుతాయి. తోబుట్టువులు, బంధువులతో ఆస్తి వివాదానికి సంబంధించి ఆశించిన శుభవార్త వింటారు. ప్రేమ వ్యవహారాలు ఇబ్బంది పెడతాయి.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)ఉద్యోగంలో స్థిరత్వం ఏర్పడుతుంది. వృత్తి, వ్యాపారాలు సంతృప్తికరంగా పురోగతి చెందుతాయి. చాలా కాలంగా వేధిస్తున్న వ్యక్తిగత సమస్య ఒకటి అనుకోకుండా పరిష్కారం అవుతుంది. చిన్న నాటి మిత్రులతో విందులు, వినోదాల్లో పాల్గొంటారు. ప్రముఖులతో పరిచయాలు పెంపొందుతాయి. నిరుద్యోగులకు దూర ప్రాంతంలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ముఖ్యమైన వ్యవహా రాలు, పనులు సునాయాసంగా పూర్తవుతాయి. ప్రేమ వ్యవహారాలు సంతృప్తికరంగా ఉండకపోవచ్చు.
Tatkal Ticket Booking: భారతీయ రైల్వే, ఐఆర్సిటిసి (IRCTC) కొత్త వెబ్సైట్ బీటా వెర్షన్ను ప్రారంభించింది. ఈ వెబ్సైట్ను పునఃరూపకల్పన చేశారు. ఐఆర్సిటిసి కొత్త వెబ్సైట్లో అనేక మార్పులు చేశారు. ముఖ్యంగా తక్షణ టికెట్ బుకింగ్ విషయంలో మార్పులు చేశారు. క్యాప్చా (CAPTCHA) వాడకాన్ని తగ్గించారు. వెబ్సైట్ వేగాన్ని పెంచారు. సీట్ల సంఖ్య (సీట్ల లభ్యత) మరింత వేగంగా ప్రదర్శించబడుతుంది. దీని ఫలితంగా తక్షణ టికెట్ బుకింగ్ సమయాన్ని ఆదా చేస్తుందని భారతీయ రైల్వే భావిస్తోంది.
తత్కాల్ బుకింగ్ ఎప్పుడు ప్రారంభమవుతుంది?- తత్కాల్ టిక్కెట్లను ప్రయాణానికి ఒక రోజు ముందు బుక్ చేసుకోవచ్చు. అయితే టిక్కెట్ బుకింగ్లో కొన్ని మార్పులు చేసినప్పటికీ, బుకింగ్ సమయాన్ని మాత్రం యథాతథంగా ఉంచారు.
- ఉదయం 10 గంటలకు: ఏసీ క్లాస్ (1A, 2A, 3A, ఎగ్జిక్యూటివ్ చైర్ కార్) బుకింగ్లు ప్రారంభమవుతాయి. ఉదయం 11 గంటలకు: స్లీపర్, సెకండ్ సీటింగ్తో సహా నాన్-ఏసీ క్లాస్ బుకింగ్లు ప్రారంభమవుతాయి.
- ఆన్లైన్, రైల్ కౌంటర్లు రెండింటికీ బుకింగ్ సమయం ఒకే విధంగా ఉంటుంది. అయితే, ఒక రోజు ముందుగా టిక్కెట్ బుక్ చేసుకోవడం అంటే, రైలు తన ప్రయాణాన్ని ప్రారంభించే స్టేషన్ నుండి బయలుదేరే రోజును పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుందని గమనించడం ముఖ్యం. ఒకవేళ మీరు మధ్యలో ఏదైనా స్టేషన్ నుండి రైలు ఎక్కితే, బుకింగ్ రోజు భిన్నంగా ఉండవచ్చు.
బుకింగ్ ప్రారంభం కావడానికి కనీసం 10 నిమిషాల ముందు IRCTC బీటా వెబ్సైట్లోని మీ ఖాతాకు లాగిన్ అవ్వండి.
రైళ్ల కోసం వెతకండిమీరు మీ ప్రయాణాన్ని ప్రారంభించే బోర్డింగ్ స్టేషన్, గమ్యస్థానం, ప్రయాణ తేదీని నమోదు చేసి, కోటా ఆప్షన్ నుండి తత్కాల్ను ఎంచుకోండి. ఆ తర్వాత సెర్చ్ ట్రైన్పై క్లిక్ చేయండి.
సీట్ల సంఖ్యను తనిఖీ చేయండి:కొత్త వెబ్సైట్ ద్వారా మీరు వివిధ తరగతుల సీట్లను ఒకేసారి చూడవచ్చు. దీనివల్ల ప్రతి తరగతిని విడివిడిగా చూడవలసిన అవసరం ఉండదు.
రైలును ఎంచుకోండి:మీకు నచ్చిన రైలు, తరగతిని ఎంచుకుని, ‘అందుబాటును తనిఖీ చేయండి’ (Check Availability) పై క్లిక్ చేయండి. సీట్లు అందుబాటులో ఉంటే ‘బుక్ చేయండి’ (Book) ఎంపికకు వెళ్లండి.
ప్రయాణికుల సమాచారాన్ని త్వరగా పూరించండి:మీ పేరు, వయస్సు, లింగం, గుర్తింపు సమాచారాన్ని ముందుగానే మీ సేవ్ చేసిన ప్యాసింజర్ ప్రొఫైల్లో సేవ్ చేసుకుంటే, బుకింగ్లు మరింత వేగంగా చేసుకోవచ్చు. దీంతో టికెట్స్ కన్ఫర్మ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
OTP ధృవీకరణ, చెల్లింపు:జూలై 2025 నుండి ఆన్లైన్లో తత్కాల్ టిక్కెట్లను బుక్ చేసుకోవడానికి ఆధార్ ఆధారిత OTP ధృవీకరణ తప్పనిసరి. అందువల్ల ముందుగానే IRCTC ఖాతాతో ఆధార్ను లింక్ చేసి, ధృవీకరించుకోవడం ముఖ్యం. OTP ధృవీకరించిన తర్వాత వెంటనే చెల్లింపు చేయండి.
ఇంకేమి మారింది?- తత్కాల్ టిక్కెట్లపై ఎలాంటి రాయితీలు లభించవు.
- మీకు టికెట్ కన్ఫర్మ్ అయిన తర్వాత తత్కాల్ టిక్కెట్ను రద్దు చేస్తే, సాధారణంగా మీకు వాపసు లభించదు.
- అయితే, ఒకవేళ రైలు రద్దయినా లేదా టిక్కెట్ వెయిటింగ్ లిస్ట్లో ఉన్నా, నిబంధనల ప్రకారం వాపసు పొందవచ్చు.
- అదనంగా సాధారణ ప్రయాణికుల సౌలభ్యం కోసం, బుకింగ్ ప్రారంభమైన తర్వాత మొదటి 30 నిమిషాల వరకు అధీకృత ఏజెంట్లు ఇన్స్టంట్ టిక్కెట్లను బుక్ చేయడానికి అనుమతి ఉండదు.
- ఏసీ తత్కాల్: ఉదయం 10 గంటల నుండి రాత్రి 10:30 గంటల వరకు ఏజెంట్ల ద్వారా బుకింగ్లు నిషేధించారు.
- నాన్-ఏసీ తత్కాల్: ఉదయం 11 గంటల నుండి రాత్రి 11:30 గంటల వరకు అవే నియమాలు వర్తిస్తాయి.
- కొత్త వెబ్సైట్ వేగంగా లోడ్ అవ్వడం, తక్కువ క్యాప్చాలు, సరళమైన ఇంటర్ఫేస్ వంటివి ఇన్స్టంట్ బుకింగ్ సమయంలో ప్రయాణికులు విజయవంతంగా టిక్కెట్లు పొందే అవకాశాలను బాగా పెంచుతాయని రైల్వే అధికారులు ఆశిస్తున్నారు.
ఇది కూడా చదవండి: PIB Fact Check: నెలవారీ కేబుల్, డీటీహెచ్ ఛార్జీలు 6 రెట్లు పెరగనున్నాయా?
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
సీనియర్ హీరోయిన్ రోజా గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఒకప్పుడు దక్షిణాదిలోనే స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగారీ అందాల తార. తెలుగుతో పాటు తమిళం, మలయాళం భాషలలో పలువురు స్టార్ హీరోలతో కలిసి ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించారీ ముద్దుగుమ్మ.
కేవలం సినిమాల్లోనే కాదు బుల్లితెరపైనా సత్తా చాటారు రోజా. ప్రముఖ టీవీ కామెడీ షో జబర్దస్త్ షోకు ఎన్నో ఏళ్లుగా న్యాయ నిర్ణేతగా వ్యవహరించారు. అంతేకాదు రాజకీయాల్లోనూ తనదైన మార్క్ చూపించారు రోజా.
అయితే గత ప్రభుత్వంలో ఏపీ మంత్రిగా కీలక బాధ్యతలు నిర్వర్తించిన రోజా జబర్దస్త్ తో పాటు అన్ని రకాల టీవీ షోలకు గుడ్ బై చెప్పారు. అయితే ఇప్పుడు మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చారామె. ప్రస్తుతం ఆమె ఓ ప్రముఖ ఛానెల్ లో ప్రసారమవుతోన్న డ్రామా జూనియర్స్ సీజన్ 9 షోకు న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తున్నారు.
ఇక సోషల్ మీడియాలోనూ రోజా ఫుల్ యాక్టివ్ గా ఉంటున్నారు. తాజాగా ఆమె ఓ టీవీ షోకు హాఫ్ శారీలో ముస్తాబై వచ్చారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. వీటిని చూసిన నెటిజన్లు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.
కాగా రోజా సెల్వమణి రీ ఎంట్రీ ఇచ్చిన తమిళ చిత్రం ‘అన్బే డయానా’. ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తో రన్ అవుతోంది. రోజా పాత్రకు కూడా మంచి పేరు వచ్చింది. దీంతో ఈ సీనియర్ హీరోయిన్ కు మరిన్ని సినిమా అవకాశాలు వచ్చే అవకాశం ఉంది.
మరి మీరు ఎప్పుడైనా ఆలోచించారా? అసలు అన్ని కప్పులు ఉండగా, మీ చేయి ఒక కప్పు మీదకే ఎందుకు వెళ్తుందో.. కాగా, ఇప్పుడు మనం దీని గురించి సైకాలజీ ఏం చెబుతుందో వివరంగా తెలుసుకుందాం.ప్రతి రోజూ ఒకే కప్పులో టీ లేదా కాఫీ తాగడం, అనేది భావోద్వేగాలు,అనుబంధాలు, జ్ఞాపకాలకు సంబంధించినది అని చెబుతున్నారు, మానసిక నిపుణులు.
ఇది వారిది అని వారి భావన, అది తమ సొంతం అనే భావన కలగడం వలన వారు పదే పదే ఒకే కప్పును ఉపయోగిస్తారని 1980లో ఆర్థికవేత్త రిచర్డ్ థాలర్ అన్వేషించి తెలియజేయడం జరిగింది. దీనిని జర్నల్ ఆఫ్ పొలిటికల్ ఎకానమీ అనే పుస్తకంలో ప్రచురించారు. ముఖ్యంగా చాలా మంది కొత్త కొత్త కప్పులు ఉన్నా, పట్టుకునేవి లేకపోయినా, పాడైపోయినా పాతదే ఎక్కువగా ఉపయోగిస్తారంట.
మనం రోజూ వాడే కప్పులు లేదా వస్తువులు అన్నీ కూడా వ్యక్తిగత అనుభవాలతో ముడిపడి ఉంటుందంట. ముఖ్యంగా ఉదయం పూట కాఫీ తాగే కప్పు, వారికి బయటకు వెళ్లే సమయంలో ప్రశాంతతను ఇస్తుందంట. అంతే కాకుడా, అది కుటుంబ సభ్యులతో గడిపిన క్షణాలను, అనుబంధాలను గుర్తి చేస్తుందంట. అందుకే ఎక్కువగా ఒక కప్పునే ఉపయోగిస్తారంట.
మీరు కొనుగోలు చేసినదే కావచ్చు లేదా ఎవరు అయినా బహుమతిగా ఇచ్చినది అయినా కావచ్చు, అది మీకు చాలా ప్రత్యేకంగా నిలుస్తుంది. అందుకే చాలా మంది తమ ఫేవరెట్ దానికే ఎక్కువ ప్రాముఖ్యతను ఇస్తారు. ఇంకా చాలా మంది అవి పాడవుతే భరించలేరంట. మగ్గు అనేది కేవలం గ్లాస్ మాత్రమే కాదు, అది ఒక జ్ఞాపకం అంటున్నారు నిపుణులు.
కొన్ని సార్లు ఎక్కువగా వాడినది, వదిలేసి, కొత్తది వాడటానికి మనసు ఒప్పదంట. అంతే కాకుండా , టెన్షన్, చిరాకు వంటి సమస్యలు ఎదురు అవుతాయంట. అందుకే పదే పదే తమకు ఇష్టమైన మగ్గును ఉపయోగించడానికి ఎక్కువ ఆసక్తి చూపుతారంట.
నేషనల్ క్రష్ రష్మిక మందన్నా క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మొన్నటివరకు టాలీవుడ్ కే పరితమితమైన ఈ ముద్దుగుమ్మ పాపులారిటీ ఇప్పుడు పాన్ ఇండియా వైడ్ గా పాకింది. ప్రస్తుతం తెలుగు, తమిళంతో పాటు హిందీ భాషల్లోనూ వరుసగా సినిమాలు చేస్తోంది రష్మిక. అలాగే స్టార్ హీరోల సినిమాల్లోనూ హీరోయిన్ ఛాన్స్ అవకాశాలు దక్కించుకుంటోంది. సినిమాల సంగతి పక్కన పెడితే.. కొన్ని రోజుల క్రితమే
టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ తో కలిసి పెళ్లిపీటలెక్కిందీ ముద్దుగుమ్మ. ఫిబ్రవరి 26న రాజస్థాన్ ఉదయ్ పూర్ ప్యాలెస్ వేదికగా ఏడడుగులు నడిచారీ లవ్ బర్డ్స్. పెళ్లి తర్వాత కొద్దిగా గ్యాప్ తీసుకున్న వీరు ఇప్పుడు మళ్లీ ప్రొఫెషనల్ లైఫ్ లో బిజీ అయ్యారు. ఇదిలా ఉంటే తన అందం, అభినయంతో నేషనల్ క్రష్ గా ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది రష్మిక. ఇదేక క్రమంలో ఎంతో మంది స్టార్ హీరోలు, హీరోయిన్లు ఆమెకు మంచి స్నేహితులుగా మారారు. కాగా టాలీవుడ్ కు చెందిన ఒక స్టార్ హీరోను రష్మిక మందన్న తనకు సొంత బ్రదర్లా భావిస్తుందట. అతను మరెవరో కాదు న్యాచురల్ స్టార్ నాని.
నాని- రష్మికలు ‘దేవదాస్’ సినిమాలో హీరో, హీరోయిన్లుగా నటించారు. 2018లో రిలీజైన ఈ సినిమా పెద్దగా ఆడలేదు. కానీ అప్పటినుంచే వీరి మధ్య మంచి అనుబంధం ఏర్పడిందట. ముఖ్యంగా హీరో నానిని రష్మిక ఒక మంచి స్నేహితుడిగా మాత్రమే కాకుండా సొం బ్రదర్లా భావిస్తుందట. ఇక విజయ్ దేవరకొండకు కూడా నాని మంచి స్నేహితుడు. విజయ్ కెరీర్ బిగినింగ్ లో నాని హీరోగా నటించిన ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాలో విజయ్ ఓ కీ రోల్ పోషించాడు. ఈ సినిమా తర్వాతే రౌడీ బాయ్ క్రేజ్ క్రమంగా పెరిగిపోయింది.
ఇక సినిమాల విషయానికి వస్తే.. పెళ్లి తర్వాత రష్మిక నటించిన మొదటి సినిమా కాక్ టెయిల్ 2. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఓ మోస్తరుగా ఆడింది. దీని తర్వాత రణబాలి సినిమాలో నటిస్తోంది రష్మిక. రాహుల్ సాంకృత్యాన్ తెరకెక్కిస్తోన్న ఈ సినిమాలో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్నాడు. గతంలో విజయ్- రాహుల్ కాంబినేషన్ లో వచ్చిన టాక్సీవాలా సూపర్ హిట్ గా నిలిచింది. ఇప్పుడు ఇదే కాంబినేషన్ లో వస్తోన్న రణబాలిపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పటికే చాలా భాగం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.
Rashmika Mandanna, Nani
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మన భారతీయ వంటకాల్లో పచ్చిమిరపకాయల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రతిరోజూ వంటగదిలో ఉపయోగించే అత్యంత ముఖ్యమైన పదార్థాలలో ఇది ఒకటి. అయితే మార్కెట్ నుండి పచ్చిమిరపకాయలను కొని ఫ్రిజ్లో ఉంచినప్పటికీ, అవి కొన్ని రోజుల్లోనే మెత్తబడిపోవడం, రంగు మారి నల్లబడటం లేదా కుళ్లిపోవడం వంటివి జరుగుతుంటాయి. ఈ సమస్య కారణంగా చాలామంది వారం తిరక్కుండానే మళ్లీ మళ్లీ మిరపకాయలు కొనవలసి వస్తుంది. కానీ వంటగదిలో కొన్ని సులభమైన పద్ధతులను పాటిస్తే, పచ్చిమిరపకాయలు అస్సలు పాడవకుండా ఎక్కువ కాలం పాటు తాజాగా ఉంచుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.
తెచ్చిన వెంటనే కడగవద్దు.. తేమ లేకుండా చూడండి..చాలామంది మార్కెట్ నుండి పచ్చిమిరపకాయలు తెచ్చిన వెంటనే కడిగి ఫ్రిజ్లో పెడుతుంటారు. కానీ అలా అస్సలు చేయకూడదు. వాటిపై మిగిలి ఉండే తడి లేదా తేమ మిరపకాయలు కుళ్లిపోయే ప్రక్రియను వేగవంతం చేస్తుంది. అందువల్ల వాటిని కూరల్లో వాడే సమయంలో మాత్రమే కడగడం మంచిది. ఒకవేళ కడిగినా.. అవి పూర్తిగా తడి ఆరిన తర్వాతే నిల్వ చేయాలి.
కాడలు తీసివేయడం అత్యంత ముఖ్యంపచ్చిమిరపకాయలు ఎక్కువ కాలం నిల్వ ఉండాలంటే వాటి కాడలను వేరు చేయడం అతి ముఖ్యమైన స్టెప్. ఎందుకంటే మిరపకాయ కాడ భాగం తేమను ఎక్కువగా పీల్చుకుంటుంది. దీనివల్ల మిరపకాయలు పైనుంచే కుళ్లిపోవడం స్టార్ట్ అవుతాయి. అందువల్ల నిల్వ చేసే ముందు కాడలను జాగ్రత్తగా తీసివేసి పక్కన పెట్టాలి.
ఎయిర్ టైట్ బాక్స్కాడలు తీసేసిన పచ్చిమిరపకాయలను నేరుగా డబ్బాలో వేయకుండా.. ఒక టిష్యూ పేపర్లో లేదా కిచెన్ టవల్లో చుట్టాలి. ఆ తర్వాత ఫ్రిజ్లోని కూరగాయల అరలో గాలి చొరబడని డబ్బాలో లేదా జిప్ లాక్ బ్యాగ్లో పెట్టి నిల్వ చేయాలి. టిష్యూ పేపర్ లోపల ఉండే అదనపు తేమను పీల్చుకుని, మిరపకాయలు త్వరగా పాడవకుండా నివారిస్తుంది. ఒకవేళ కొన్ని రోజులకు ఆ టిష్యూ తడిసినట్లు అనిపిస్తే, దానిని మార్చి కొత్త టిష్యూ పెట్టాలి.
సాధారణ ప్లాస్టిక్ కవర్లు వద్దు..మిరపకాయలను గాలి అస్సలు ఆడని సాధారణ ప్లాస్టిక్ కవర్లలో ఉంచకూడదు. దీనివల్ల కవర్ లోపల నీటి బిందువులు ఏర్పడి, అవి త్వరగా కుళ్లిపోయే అవకాశం పెరుగుతుంది. వీలైతే చిన్న చిన్న ఎయిర్ వెంట్స్ ఉన్న ప్లాస్టిక్ పాత్రను లేదా కొద్దిగా తెరిచి ఉన్న నిల్వ పెట్టెను ఉపయోగించడం సురక్షితం.
పచ్చిమిరపకాయలను ఇలా జాగ్రత్తగా నిల్వ చేస్తే, అవి సుమారు రెండు నుండి మూడు వారాల పాటు వాటి సహజమైన రుచి, రంగు, తాజాదనాన్ని కోల్పోకుండా ఉంటాయి. దీనివల్ల డబ్బులు ఆదా అవ్వడమే కాకుండా వంటగదిలో ఆహార వ్యర్థాలు తగ్గడానికి కూడా సహాయపడుతుంది.
ఈ రోజుల్లో ఆన్లైన్ షాపింగ్ చాలా మంది జీవితంలో ఒక ముఖ్యమైన భాగం అయింది, కానీ ఆన్లైన్లో వస్తువులను డెలివరీ చేసే ప్రతి ఒక్కరూ మంచివారేనా అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఇటీవల ఒక పార్సిల్ను డెలివరీ చేసిన ఒక డెలివరీ ఏజెంట్ చర్యలు సోషల్ మీడియాలో సంచలనం సృష్టించాయి. ఇంటి భద్రతపై తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తాయి. వైరల్ అవుతున్న ఈ సీసీటీవీ ఫుటేజ్ చూస్తే మీరు కూడా షాక్ అవుతారు..అసలేం జరిగిందంటే..
వైరల్ అవుతున్న సిసిటివి ఫుటేజ్ ప్రకారం.. ఒక ప్రముఖ ఆన్లైన్ ప్లాట్ఫారమ్కు చెందిన డెలివరీ ఏజెంట్ కస్టమర్ ఇంటికి ఆర్డర్ తీసుకువచ్చాడు. ఇంటి లోపల ఉన్న వ్యక్తి తలుపు తీసి పార్సిల్ అందుకున్నారు. ఆ తర్వాత కస్టమర్ సాధారణంగానే తలుపు మూసివేయడానికి ప్రయత్నించారు. కానీ, అక్కడే అసలు ఊహించని ట్విస్ట్ ఎదురైంది.
ఆ డెలివరీ ఏజెంట్ పార్సిల్ ఇచ్చేసి వెళ్ళిపోకుండా, కస్టమర్ తలుపు వేస్తున్న సమయంలో అత్యంత వేగంగా తన కాలును తలుపుకు అడ్డం పెట్టాడు. తలుపు పూర్తిగా లాక్ కాకుండా ఆపి, లోపలికి చొరబడటానికి ప్రయత్నించాడు. అయితే, లోపల ఉన్న కస్టమర్ అప్రమత్తంగా ఉండి గట్టిగా తలుపు తోసి లాక్ చేయడంతో తృటిలో ప్రమాదం తప్పింది. ఆ తర్వాత ఏమీ తెలియనట్లు ఆ డెలివరీ బాయ్ అక్కడి నుండి చల్లగా జారుకున్నాడు.
ఈ షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన కొద్దిసేపటికే లక్షలాది వ్యూస్ సాధించి వైరల్గా మారింది. ఈ దృశ్యాలు చూసిన నెటిజన్లు తీవ్ర ఆగ్రహం మరియు భయభ్రాంతులకు లోనవుతున్నారు. ముఖ్యంగా ఇళ్లలో ఒంటరిగా ఉండే మహిళలు, వృద్ధుల భద్రతపై పెద్ద ఎత్తున ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. డెలివరీ కంపెనీలు తమ ఏజెంట్లను నియమించుకునేటప్పుడు సరైన బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేయడం లేదా అని నెటిజన్లు సదరు సంస్థలను ప్రశ్నిస్తున్నారు.
వీడియో ఇక్కడ చూడండి..A delivery guy thought the girl is alone at the home, somehow he tried to get inside.. but the mother was there and she confronted the guy.. Hat’s off
Never ever trust anyone for the sake of delivery proof or something, because you don’t know their intention.. pic.twitter.com/PIZCStMZC1
— Aaj Ka Lafda (@aajka_Lafda) July 18, 2026
తీసుకోవాల్సిన జాగ్రత్తలు:ఈ తరహా ఘటనల నేపథ్యంలో నిపుణులు కొన్ని ముఖ్యమైన భద్రతా సూచనలు చేస్తున్నారు:
ఆన్లైన్ ఆర్డర్లు తీసుకునేటప్పుడు వీలైనంత వరకు తలుపులు పూర్తిగా తెరవకుండా, కొద్దిగా తీసి పార్సిల్ అందుకోవడం మంచిది.
అపార్ట్మెంట్లు లేదా ఇళ్లలో డెలివరీలను నేరుగా గుమ్మం వద్ద కాకుండా, గేటు దగ్గరో లేదా సెక్యూరిటీ గార్డ్ వద్దో ఉంచమని కోరడం సురక్షితం.
ప్రతి ఒక్కరూ తమ ఇంటి ప్రధాన ద్వారం వద్ద సిసిటివి కెమెరా లేదా స్మార్ట్ బెల్స్ ఏర్పాటు చేసుకోవడం వల్ల ఇలాంటి అపరిచిత వ్యక్తుల కదలికలను కనిపెట్టవచ్చు.
ఈ వైరల్ ఘటన ఆన్లైన్ సేవల వెనుక ఉన్న చీకటి కోణాన్ని మరోసారి బయటపెట్టింది. టెక్నాలజీ మన జీవితాన్ని సులభతరం చేసినప్పటికీ, అపరిచితులతో వ్యవహరించేటప్పుడు మన వ్యక్తిగత భద్రత పట్ల అప్రమత్తంగా ఉండటం అత్యంత అవసరం.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..
Railways Luggage Rules: మీరు మీ రైలు ప్రయాణంలో అదనపు సామాను తీసుకువెళ్లాలని ప్లాన్ చేస్తుంటే, రైల్వే నిబంధనలను తప్పకుండా తెలుసుకోండి. రైల్వే అనుమతించిన బరువు పరిమితిని మించిన సామానును బుక్ చేసుకోకుండా ప్రయాణిస్తే, అదనపు ఛార్జీలతో పాటు, సామాను రేటుకు ఆరు రెట్ల వరకు జరిమానా విధించబడవచ్చు. అందువల్ల, మీ అదనపు సామానును లగేజీ కార్యాలయంలో ముందుగానే బుక్ చేసుకోవడం మంచిది.
సామాను నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని భారతీయ రైల్వే ప్రయాణికులకు సూచించింది. నార్త్ వెస్టర్న్ రైల్వేలోని జోధ్పూర్ డివిజన్ డివిజనల్ రైల్వే మేనేజర్ అనురాగ్ త్రిపాఠి ప్రకారం, ప్రతి తరగతి ప్రయాణానికి ఉచిత సామాను పరిమితిని నిర్దేశించారు. బుకింగ్ చేసుకోకుండా ఈ పరిమితికి మించి సామాను తీసుకువెళుతున్నట్లు ప్రయాణికుడు గమనిస్తే అదనపు బరువుకు సామాను రేటుకు ఆరు రెట్ల వరకు రుసుము వసూలు చేస్తారు.
35 కిలోల వరకు సామాను ఉచితం.
ఇది కూడా చదవండి: PIB Fact Check: నెలవారీ కేబుల్, డీటీహెచ్ ఛార్జీలు 6 రెట్లు పెరగనున్నాయా? కేంద్రం ప్రకటించిందా?
అంతేకాకుండా, వ్యాపార లేదా వాణిజ్య వస్తువులు, పెద్ద ట్రంకులు, సంచులు, కార్టన్లను ప్యాసింజర్ బెర్త్లపై తీసుకువెళ్లడం ఖచ్చితంగా నిషేధించినట్లు రైల్వే తెలిపింది. అటువంటి సామానును బ్రేక్ వ్యాన్లో బుక్ చేసుకోవడం తప్పనిసరి. త్రిపాఠి ప్రకారం, ఏసీ ఫస్ట్ క్లాస్లో 70 కిలోల వరకు, ఏసీ సెకండ్ టైర్/ఫస్ట్ క్లాస్లో 50 కిలోల వరకు, ఏసీ థర్డ్ టైర్/ఏసీ చైర్ కార్లో 40 కిలోల వరకు, స్లీపర్ క్లాస్లో 40 కిలోల వరకు, సెకండ్ క్లాస్లో 35 కిలోల వరకు సామానును ఉచితంగా తీసుకువెళ్లవచ్చు.
రైల్వేల ప్రకారం.. అదనపు సామాను నిర్దేశించిన పరిమితిలోపు ఉంటే దానికి సామాను రేటుకు 1.5 రెట్లు ఛార్జీ విధిస్తారు. గరిష్ట పరిమితిని మించిన సామానును ప్రయాణీకుల కంపార్ట్మెంట్లో అనుమతించరు. అటువంటి సామానును ప్రయాణం ప్రారంభమయ్యే ముందు స్టేషన్ లగేజ్ ఆఫీసులో బుక్ చేసి , బ్రేక్ వ్యాన్ ద్వారా పంపించాలి.
ఇది కూడా చదవండి: EPFO: పెళ్లి కోసం పీఎఫ్ నుంచి ఎంత విత్డ్రా చేసుకోవచ్చు..? ఇప్పుడు మరింత సులభం!
ఈ నియమం MST (మంత్లీ సీజన్ టికెట్) హోల్డర్లకు కూడా సమానంగా వర్తిస్తుంది. MST కలిగి ఉండటం వల్ల లగేజీకి ఎలాంటి అదనపు భత్యం లభించదు. సీనియర్ డీసీఎం హితేష్ యాదవ్ ప్రకారం, పెద్ద ట్రంకులు, పెట్టెలు, సూట్కేసులు, వాణిజ్య వస్తువులు, సంచులు, కార్టన్ల వంటి అతిపెద్ద లగేజీని ప్యాసింజర్ కోచ్లలో తీసుకువెళ్లడం నిషేధించారు. దీనివల్ల బస్సు ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు ఇతర ప్రయాణికులకు ఇబ్బందులు కలగడమే కాకుండా భద్రతపై కూడా ప్రభావం పడుతుంది.
ఇది కూడా చదవండి: Papaya Leaves: బొప్పాయి ఆకులతో క్యాన్సర్కు చికిత్స చేయడం సాధ్యమేనా? చర్చకు దారితీసిన అధ్యయనం!
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మన వంటకాల్లో కొత్తిమీరకు ప్రత్యేక స్థానం ఉంది. కూరలకు అద్భుతమైన సువాసన, రుచిని అందించడమే కాకుండా.. కొత్తిమీరలో ఎన్నో ఔషధ గుణాలు, విటమిన్లు దాగున్నాయి. అందుకే చాలామంది ప్రతి వంటకంలోనూ దీనిని విరివిగా వాడుతుంటారు. అయితే అమృతం లాంటి కొత్తిమీర అందరికీ ఆరోగ్యకరం కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొన్ని రకాల అనారోగ్య సమస్యలతో బాధపడేవారు కొత్తిమీరను అతిగా తీసుకున్నా లేదా పొరపాటున తిన్నా వారి సమస్యలు మరింత తీవ్రమయ్యే ప్రమాదం ఉంది. ఆరోగ్య నిపుణుల ప్రకారం.. ఏయే ఆరోగ్య సమస్యలు ఉన్నవారు కొత్తిమీరకు దూరంగా ఉండాలో తెలుసుకోవడం చాలా ముఖ్యం.
తక్కువ రక్తపోటులో బీపీ సమస్యతో బాధపడేవారు కొత్తిమీరను అతిగా తీసుకోకూడదు. కొత్తిమీరలో ఉండే కొన్ని సహజ గుణాలు రక్తపోటును తగ్గించడంలో సహాయపడతాయి. అధిక రక్తపోటు ఉన్నవారికి ఇది మేలు చేసినప్పటికీ.. ఇప్పటికే లో-బీపీ ఉన్నవారు దీనిని ఎక్కువగా తింటే వారి బ్లడ్ ప్రెజర్ మరింత పడిపోయి, నీరసం మరియు కళ్లు తిరగడం వంటి సమస్యలు తలెత్తుతాయి.
కాలేయ సమస్యలు ఉన్నవారుకొత్తిమీరను పరిమితంగా తీసుకుంటే లివర్కు మంచిదే కానీ, అతిగా తీసుకుంటే మాత్రం కాలేయంపై ప్రతికూల ప్రభావం పడుతుంది. కొత్తిమీరలోని కొన్ని నూనె పదార్థాలు లివర్ పనితీరును ప్రభావితం చేస్తాయి. ఇప్పటికే కాలేయ సంబంధిత వ్యాధులతో బాధపడేవారు వైద్యుల సలహా మేరకే దీనిని వాడటం సురక్షితం.
శ్వాసకోశ ఇబ్బందులు, అలర్జీలు ఉన్నవారుకొంతమందికి కొన్ని రకాల ఆకులు లేదా సుగంధ ద్రవ్యాల వల్ల అలర్జీలు వస్తుంటాయి. కొత్తిమీరను అతిగా తీసుకోవడం వల్ల శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, గొంతులో చికాకు లేదా చర్మంపై దద్దుర్లు వంటి అలర్జీ లక్షణాలు కనిపించవచ్చు. ముఖ్యంగా ఆస్తమా లేదా శ్వాసకోశ సమస్యలు ఉన్నవారు దీనిని పరిమితంగానే ఉంచాలి.
గర్భిణీ స్త్రీలుగర్భధారణ సమయంలో మహిళలు తీసుకునే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కొత్తిమీరను కూరల్లో గార్నిషింగ్ కోసం వాడే కొద్దిపాటి పరిమాణం సురక్షితమే అయినప్పటికీ.. ప్రెగ్నెన్సీ సమయంలో కొత్తిమీర జ్యూస్ తాగడం లేదా అధిక మొత్తంలో తీసుకోవడం మంచిది కాదు. ఇది శరీరంలోని కొన్ని హార్మోన్ల సమతుల్యతపై ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
గ్యాస్ – కడుపు ఉబ్బరం సమస్యజీర్ణక్రియకు కొత్తిమీర మేలు చేసినప్పటికీ, దీనిని అధిక మోతాదులో తీసుకున్నప్పుడు కొందరిలో కడుపు ఉబ్బరం, గ్యాస్ లేదా విరేచనాలు వంటి జీర్ణకోశ ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఏదైనా సరే పరిమితికి మించితే ముప్పే అని పెద్దలు ఊరికే అనలేదు. కొత్తిమీర వల్ల అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న మాట వాస్తవమే అయినప్పటికీ, ఈ సమస్యలు ఉన్నవారు లేదా ఏదైనా దీర్ఘకాలిక చికిత్స పొందుతున్నవారు దీనిని అతిగా తీసుకోకుండా తగిన జాగ్రత్తలు పాటించడం ఎంతో ముఖ్యం.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని రాశుల వారికి రెండు సార్లు వివాహం జరిగే ఛాన్స్ ఉంటుందంట. ముఖ్యంగా జాతకంలో ఏడవ ఇల్లు, దాని అధిపతి అయిన శుక్రుడు రాహువు,గురుడు, శని, కేతువు గ్రహాలు వైవాహిక జీవితం పై ప్రభావం చూపుతుంది. అయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, మిథునం, తుల , ధనస్సు రాశి వారికి రెండు సార్లు వివాహం జరుగుతుంది అని చెబుతున్నారు పండితురు.
తుల రాశి : తుల రాశి వారికి శుక్రగ్రహం అధిపతి. ఈ రాశి వారికి ప్రేమ చాలా ఎక్కువ, అలాగే, వీరు అందానికి కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ముఖ్యంగా తన భాగస్వామి నుంచి ప్రేమను, అందాన్ని కూడా ఎక్కువగా ఆశిస్తారు. అయితే వారి అంచనాలు నెరవేరనప్పుడు వీరు మానసిక ఒత్తిడికి లోనై, మొదటి వివాహం తర్వాత మీ అంచనాలకు తగ్గట్టు రెండో వివాహం చేసుకుంటారు.
ధనస్సు రాశి : ధనస్సు రాశి వారికి రెండు సార్లు వివాహం జరిగే ఛాన్స్ ఉంది. ముఖ్యంగా ఈ రాశి వారు వివాహం తర్వాత మానసిక ఒత్తిడికి గురి అవ్వడం, అనేక ఇబ్బందులు ఎదుర్కునే ఛాన్స్ ఉంటుందంట. అలాగే వీరు చాలా సవాళ్లను ఎదుర్కుంటారు. దీని కారణంగా ఈ రాశి వారు రెండు సార్లు వివాహం చేసుకునే ఛాన్స్ ఉంటుందంట.
మిథున రాశి : మిథున రాశి వారికి తెలివితేటలు చాలా ఎక్కువగా ఉంటాయి. వీరు ఎప్పుడూ చాలా ఆనందంగా ఉంటారు. అంతే కాకుండా సంబంధాలపై కూడా ఎక్కువ అంచనాలు పెట్టుకుంటారు కొన్ని సార్లు వీరి అంచనాలు నిజంకాకపోవడం,భాగస్వామి వారి అంచనాలకు సరితూగక పోవోడంతో వీరు మరో వివాహం చేసుకుంటారంట.
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు
హిందూ పంచాంగం ప్రకారం ఆషాఢ మాస శుక్ల పక్షంలో వచ్చే ఏకాదశిని తొలి ఏకాదశి లేదా దేవశయని ఏకాదశి అని పిలుస్తారు. ఏడాది పొడవునా వచ్చే 24 ఏకాదశులలో దీనికి ఎంతో ప్రత్యేకత ఉంది. పురాణాల ప్రకారం, ఈ రోజు నుంచే మహావిష్ణువు క్షీరసాగరంలో శేషతల్పంపై నాలుగు నెలల పాటు యోగనిద్రలోకి వెళ్తాడు. అందుకే దీనిని దేవశయని ఏకాదశి అంటారు. ఈ రోజు నుండి పవిత్రమైన చాతుర్మాస్య వ్రతం కూడా ప్రారంభమవుతుంది. ఈ పర్వదినాన లక్ష్మీనారాయణులను భక్తిశ్రద్ధలతో ఆరాధించడం వల్ల అద్భుతమైన ఫలితాలు ఉంటాయని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది.
తొలి ఏకాదశి నాటి ముఖ్యమైన నియమాలు:ఈ రోజున రోజంతా ఉపవాసం ఉండి, రాత్రి జాగరణ చేసి, విష్ణు సహస్రనామ పారాయణం చేయడం వల్ల జన్మజన్మల పాపాలు తొలగిపోతాయని నమ్ముతారు. ఈ రోజున ఉల్లి, వెల్లుల్లి, అన్నానికి దూరంగా ఉండాలి. మరుసటి రోజు ద్వాదశి ఉదయాన్నే విష్ణు పూజ చేసి ఉపవాస దీక్షను విరమించాలి.
శ్రీమహావిష్ణువు అనుగ్రహం కోసం 12 రాశుల వారి పరిహారాలు:జ్యోతిష్య నిపుణుల ప్రకారం, తొలి ఏకాదశి నాడు మీ మీ రాశుల ప్రకారం క్రింది పరిహారాలు పాటించడం వల్ల లక్ష్మీదేవి, విష్ణుమూర్తి ఆశీస్సులు లభిస్తాయి:
మేషం, వృశ్చిక రాశులు (కుజ వలయం): విష్ణుమూర్తికి ఎర్రటి చందనం లేదా ఎర్రటి పువ్వులు సమర్పించాలి. బెల్లం దానం చేయడం వల్ల శుభం కలుగుతుంది.
వృషభం, తులా రాశులు (శుక్ర వలయం): స్వామివారికి తెల్లటి చందనం, పాయసం లేదా తెల్లటి పూలు సమర్పించాలి. వీలైతే నెయ్యి దానం చేయాలి.
మిథునం, కన్యా రాశులు (బుధ వలయం): తులసి దళాలతో విష్ణుమూర్తిని అర్చించాలి. ఆకుపచ్చని పండ్లు దానం చేయడం మంచిది.
కర్కాటక రాశి (చంద్ర వలయం): స్వామివారికి పాలు లేదా పాలతో చేసిన స్వీట్లు నైవేద్యంగా పెట్టాలి. ముత్యం లేదా వెండి వస్తువులను పూజలో ఉంచవచ్చు.
సింహ రాశి (సూర్య వలయం): కుంకుమపువ్వు కలిపిన పాలు లేదా పసుపు రంగు మిఠాయిలను నైవేద్యంగా సమర్పించాలి. గోధుమలు దానం చేయడం శ్రేయస్కరం.
ధనుస్సు, మీన రాశులు (గురు వలయం): పసుపు రంగు పువ్వులు, అరటిపండ్లు, పసుపు వస్త్రాలను విష్ణుమూర్తికి సమర్పించాలి. శనగపప్పు దానం చేయడం వల్ల గురుబలం పెరుగుతుంది.
మకరం, కుంభ రాశులు (శని వలయం): విష్ణుమూర్తితో పాటు నల్లటి నువ్వులను దానం చేయడం లేదా నీలిరంగు పుష్పాలతో పూజించడం వల్ల శని దోషాలు తొలగిపోతాయి.
తొలి ఏకాదశి నాడు భక్తితో లక్ష్మీనారాయణులను స్మరిస్తూ, మీ రాశి ప్రకారం చిన్న చిన్న పరిహారాలు లేదా దానధర్మాలు చేయడం వల్ల ఇంట్లో ఉన్న ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి, సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయి.
(Disclaimer: ఈ కథనంలో పేర్కొన్న అప్పుల నుంచి విముక్తి, శనగలను నైవేద్యంగా సమర్పించే ఆచారం వంటి వివరాలు స్థానిక పురాణాలు, ఆలయ సంప్రదాయాలు, భక్తుల విశ్వాసాల ఆధారంగా ఇవ్వబడ్డాయి. వీటికి శాస్త్రీయ లేదా చారిత్రక ఆధారాలు నిర్ధారించబడలేదు. ఈ కథనం సమాచార ప్రయోజనం కోసం మాత్రమే ప్రచురించబడింది.)
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం క్లిక్ చేయండి..
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ హీరోగా ఓ వెలుగు వెలిగాడు సుమన్. ముఖ్యంగా యాక్షన్ సినిమాలకు ఆయన కేరాఫ్ అడ్రస్ గా ఉండే వారు. తన కరాటే ఫైట్స్, యాక్షన్ సీన్స్ కు ఎంతో మంది అభిమానులు ఉన్నారు. తెలుగుతో పాటు తమిళం, హిందీ, కన్నడం.. ఇలా మొత్తం 10 భాషల్లో సుమారు 700 సినిమాలు చేశారు సుమన్. అయితే స్టార్ హీరోగా ఎదగాల్సిన సుమన్ ఒక కేసు కారణంగా ఇబ్బందుల్లో పడ్డారు. కొన్ని రోజుల పాటు జైలు శిక్ష కూడా అనుభవించారు. దీంతో రేసులో వెనకపడిపోయాడు సుమన్. ఆ తర్వాత కూడా సినిమాలు చేసినా క్రేజ్ మాత్రం పెద్దగా రాలేదు. కాగా ఇప్పటికీ సినిమాలు చేస్తున్నారు సుమన్. సహాయక నటుడిగా మెప్పిస్తున్నారు. అలాగే అప్పుడప్పుడు విలన్ గానూ ఆకట్టుకుంటున్నారీ సీనియర్ యాక్టర్. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరయ్యారు సుమన్. తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ కు సంబంధించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఇదే క్రమంలో తెలుగు హీరోల డ్యాన్సింగ్ స్కిల్స్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
‘నార్త్ లో ఎవరున్నారో తెలియదు కానీ.. దక్షిణాది హీరోల విషయానికి వస్తే.. ది బెస్ట్ డ్యాన్సర్ మెగాస్టార్ చిరంజీవినే. ఎందుకంటే.. మీరు గమనిస్తే.. నేల కింద చూడకుండా డ్యాన్స్ చేసే ఏకైక వ్యకి చిరంజీవి గారు. మిగతా హీరోలెవరైనా ఆఖరికి కమల్ హాసన్ కూడా నేల చూసే డ్యాన్స్ చేస్తారు. బట్.. నా దృష్టిలో నేల కింద చూడకుండా.. ఫుట్ వర్క్ బ్రహ్మండంగా చేసే వ్యక్తి వన్ అండ్ ఓన్లీ చిరంజీవి. మ్యూజిక వస్తే.. ఆయన బాడీలో ఒక ఫ్లో, మూమెంట్ వస్తుంది. అది అందరికీ రాదు. అది ఆయనకు దేవుడిచ్చిన వరం. సినిమా ఇండస్ట్రీలో చాలా మంది డ్యాన్స్ ఉండవచ్చు.. కానీ ఆయన గ్రేస్, రిథమ్ ఎవరికీ రావు. ఇక చిరంజీవి తర్వాత ఆ స్థాయిలో డ్యాన్స్ చేసేది జూనియర్ ఎన్టీఆర్ అని చెప్పవచ్చు. మోడ్రన్ డ్యాన్స్ అందరూ చేస్తున్నారు. కానీ క్లాసికల్ డ్యాన్స్ మాత్రం కొందరే చేస్తారు. నాకు తెలిసి ఇండస్ట్రీలో చిరంజీవి ఆ తర్వాత తారక్ బెస్ట్ డ్యాన్సర్స్’ అని సుమన్ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.
మెగా 158 సినిమాతో బిజీ బిజీగా మెగాస్టార్ చిరంజీవి..View this post on Instagram
A post shared by Chiranjeevi Konidela (@chiranjeevikonidela)
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఆంధ్రప్రదేశ్లో ఆక్వా, పొగాకు రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కేంద్రం తక్షణ చర్యలు తీసుకోవాలని రాష్ట్ర మంత్రుల బృందం కేంద్రమంత్రులకు విజ్ఞప్తి చేసింది. మంత్రులు రవికుమార్, డోలా శ్రీ బాలవీరాంజనేయస్వామి, అచ్చెన్నాయుడు, కేంద్రమంత్రులు రామ్మోహన్ నాయుడు, శ్రీనివాస వర్మ, పలువురు ఎంపీలు, రైతులు ఢిల్లీలో ఇద్దరు కేంద్ర మంత్రులను వేర్వేరుగా కలిసి చంద్రబాబు నాయుడు రాసిన లేఖను అందజేశారు. కేంద్ర మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ను కలిసి రాష్ట్ర ఆక్వా రంగం ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరించారు. ఆక్వా ఫీడ్ తయారీకి అవసరమైన జీఎం సోయాబీన్ మీల్ దిగుమతులకు అనుమతి ఇవ్వాలని కోరారు. దీనివల్ల రొయ్యల మేత తయారీ వ్యయం తగ్గి ఆక్వా రైతులకు ఉపశమనం లభిస్తుందని వివరించారు. ఆక్వా రంగాన్ని కాపాడేందుకు విధానపరమైన మద్దతు ఇవ్వాలని కూడా విజ్ఞప్తి చేశారు.
జాతీయ మత్స్య అభివృద్ధి బోర్డుగతంలో కేంద్రం ప్రకటించినట్లుగా అమరావతిలో జాతీయ మత్స్య అభివృద్ధి బోర్డు ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటును వేగవంతం చేయాలని కోరారు. కార్యాలయం కోసం కేటాయించిన భూమిని వెంటనే స్వాధీనం చేసుకుని నిర్మాణ పనులు ప్రారంభించాలని, 2028 నాటికి ప్రాంతీయ కార్యాలయం, అక్వేరియం, శిక్షణ కేంద్రాలను పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. దీంతో అమరావతి బ్లూ ఎకానమీ అభివృద్ధికి కీలక కేంద్రంగా మారుతుందని పేర్కొన్నారు.
పొగాకు రైతుల సమస్యలపై పీయూష్ గోయల్ తో భేటికేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ను కలిసి ఏపీ నుంచి ఎఫ్సీవీ పొగాకు ఎగుమతులకు ప్రోత్సాహకాలు కల్పించాలని కోరారు. అంతర్జాతీయ మార్కెట్లలో రాష్ట్ర పొగాకు రైతులకు మరింత అవకాశాలు కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పొగాకు రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. పొగాకు ధరలు, మార్కెట్ పరిస్థితుల వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. రైతులకు గిట్టుబాటు కల్పించేలా పొగాకుకు కనీస మద్దతు ధర అమలు చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. ఆక్వా రంగంపై జీఎస్టీ తగ్గింపు అంశాన్ని కూడా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ దృష్టికి తీసుకెళ్లనున్నట్లు రాష్ట్ర మంత్రులు వెల్లడించారు. ఈ సమావేశం తో రాష్ట్ర రైతులు, ఆక్వా ,రంగ ప్రయోజనాల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం సానుకూల నిర్ణయాలు తీసుకుంటుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.
ఉక్రెయిన్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఒడెసా ఓడరేవు సమీపంలో జరిగిన క్షిపణి దాడిలో నలుగురు భారతీయులు ప్రాణాలు కోల్పోయారు. ధాన్యం రవాణా చేస్తున్న ఎంవీ గోల్డెన్ లియో అనే వాణిజ్య నౌకపై క్షిపణుల వర్షం కురిసింది. మరో భారతీయుడు తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనను భారత ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది.
విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) తెలిపిన వివరాల ప్రకారం, గినియా-బిస్సావు జెండాతో ఎంవీ గోల్డెన్ లియో నౌక ప్రయాణిస్తోంది. జూలై 19న ఒడెసా నుంచి బయలుదేరిన కొద్దిసేపటికే క్షిపణి దాడికి గురైంది. నౌకలో మొత్తం 17 మంది సిబ్బంది ఉండగా, వారిలో ఐదుగురు భారతీయులు ఉన్నారు. దాడిలో నలుగురు భారతీయులు మరణించగా, మరో భారతీయుడు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేసిన భారత ప్రభుత్వం, గాయపడిన భారతీయుడు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించింది. ఉక్రెయిన్లోని భారత రాయబార కార్యాలయం స్థానిక అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ బాధితులకు అవసరమైన సహాయం అందిస్తోందని విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
ఈ ఘటనపై స్పందించిన భారత్, వాణిజ్య నౌకలను లక్ష్యంగా చేసుకోవడం, అమాయక పౌర సిబ్బంది ప్రాణాలకు ముప్పు కలిగించడం తీవ్రంగా ఖండించదగిన చర్య అని పేర్కొంది. సాయుధ ఘర్షణల సమయంలో కూడా అంతర్జాతీయ నౌకాయాన స్వేచ్ఛను గౌరవించాలని అన్ని పక్షాలకు పిలుపునిచ్చింది. ఉక్రెయిన్ అధికారులు ఈ దాడికి రష్యా కారణమని ఆరోపిస్తున్నప్పటికీ, భారత్ తన ప్రకటనలో ఏ దేశం పేరును ప్రస్తావించలేదు. ఈ ఘటనపై పూర్తి వివరాలు ఇంకా వెలుగులోకి రావాల్సి ఉంది.
గినియా-బిస్సావు జెండాతో ప్రయాణిస్తున్న ఈ నౌకలో భారతీయులు, సిరియా పౌరులు సిబ్బందిగా ఉన్నారు. దాడి అనంతరం రాత్రంతా గాలింపు, సహాయక చర్యలు కొనసాగాయని ఉక్రెయిన్ ఓడరేవుల ప్రాధికార సంస్థ తెలిపింది. ఘటనలో తొమ్మిది మంది సిబ్బంది, ఒక మెరైన్ పైలట్ మృతి చెందగా, 17 మంది సిబ్బందిలో ఎనిమిది మందిని సురక్షితంగా రక్షించినట్లు వెల్లడించింది. ఎల్ఎస్ఈజీ షిప్పింగ్ డేటా ప్రకారం, గోల్డెన్ లియో నౌక ముంబైకి చెందిన ఓషన్ గ్రేస్ షిప్పింగ్ లిమిటెడ్ యాజమాన్యంలో ఉండగా, ఫ్రెండ్స్ షిప్పింగ్ కో ఎస్ఏ నిర్వహిస్తోంది.
2022లో రష్యా – ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి నల్ల సముద్రం ప్రపంచంలోనే అత్యంత కీలక యుద్ధ ప్రాంతంగా మారింది. ఈ ప్రాంతం గుండా జరిగే ధాన్యం రవాణా ప్రపంచ ఆహార భద్రతకు కీలకం. అయితే ఇటీవల ఇరు దేశాలు పరస్పరం ఓడరేవులు, ఇంధన మౌలిక సదుపాయాలు, సరుకు రవాణా నౌకలను లక్ష్యంగా చేసుకుని దాడులు పెంచడంతో వాణిజ్య నౌకాయానం తీవ్రంగా దెబ్బతింటోంది.
ప్రపంచ గోధుమ ఎగుమతుల్లో సుమారు 6 శాతం, మొక్కజొన్న ఎగుమతుల్లో దాదాపు 11 శాతం ఉక్రెయిన్ వాటా ఉండటంతో ఈ దాడులు అంతర్జాతీయ ఆహార సరఫరాపై కూడా ప్రభావం చూపుతున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. రష్యా దాడుల కారణంగా ఉక్రెయిన్ ధాన్యం ఎగుమతి సామర్థ్యం గణనీయంగా తగ్గగా, ఉక్రెయిన్ దాడుల నేపథ్యంలో రష్యా కూడా అజోవ్ సముద్రం గుండా జరిగే తన ధాన్యం రవాణాపై పరిమితులు విధించినట్లు అంతర్జాతీయ నివేదికలు పేర్కొంటున్నాయి.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
వారంలో ఏ రోజు ఏ రంగు దుస్తులు వేసుకోవాలి..? మీ అదృష్టాన్ని మార్చే జ్యోతిష్య శాస్త్ర రంగుల రహస్యం!
మనం ధరించే దుస్తులు కేవలం మన వ్యక్తిత్వాన్ని మాత్రమే కాదు, మన అదృష్టాన్ని, మానసిక స్థితిని కూడా ప్రభావితం చేస్తాయని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. సనాతన హిందూ సాంప్రదాయం ప్రకారం, వారంలోని ప్రతి రోజూ ఒక నిర్దిష్ట గ్రహానికి, అధిదేవతకు అంకితం చేయబడింది. ఆయా రోజుల్లో ఆయా గ్రహాలకు ప్రీతికరమైన రంగు దుస్తులను ధరించడం ద్వారా ప్రతికూలత తొలగిపోయి, అదృష్టం, విజయం వరిస్తాయని నమ్ముతారు. జ్యోతిష్య నిపుణుల ప్రకారం ఏ రోజు ఏ రంగు ధరించాలో ఇప్పుడు చూద్దాం:
1. సోమవారం (తెలుపు/సిల్వర్): సోమవారం చంద్రునికి సంబంధించిన రోజు. చంద్రుడు మనస్సుకు కారకుడు. కాబట్టి, ఈ రోజు తెలుపు, ఆఫ్-వైట్, లేదా సిల్వర్ రంగు దుస్తులను ధరించడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది, ఒత్తిడి తగ్గుతుంది.
2. మంగళవారం (ఎరుపు/నారింజ): ఈ రోజు అంగారకుడికి (కుజుడు),ఆంజనేయ స్వామికి ప్రీతికరమైనది. కుజుడు ధైర్యానికి, శక్తికి ప్రతీక. అందుకే మంగళవారం ఎరుపు లేదా ముదురు నారింజ రంగు దుస్తులు ధరిస్తే ఉత్సాహం, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి.
3. బుధవారం (ఆకుపచ్చ): బుధవారం బుధ గ్రహానికి, వినాయకుడికి సంబంధించిన రోజు. బుధుడు బుద్ధికి, వ్యాపారానికి కారకుడు. ఈ రోజు ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించడం వల్ల జ్ఞాపకశక్తి, వ్యాపార నైపుణ్యాలు, విద్యార్థులలో ఏకాగ్రత పెరుగుతాయి.
4. గురువారం (పసుపు): గురువారం గురు గ్రహానికి (బృహస్పతి), దత్తాత్రేయ స్వామి, సాయిబాబా వంటి గురువుల రోజు. గురు గ్రహం జ్ఞానానికి, సంపదకు కారకుడు. ఈ రోజు పసుపు లేదా బంగారు రంగు దుస్తులు ధరిస్తే ఇంట్లో సుఖసంతోషాలు, సంపద కలుగుతాయి.
5. శుక్రవారం (గులాబీ/లేత రంగులు): శుక్రవారం లక్ష్మీదేవికి, శుక్ర గ్రహానికి సంబంధించిన రోజు. శుక్రుడు సౌకర్యాలు, విలాసాలకు కారకుడు. ఈ రోజు గులాబీ, మెరిసే తెలుపు లేదా లేత రంగులు ధరించడం వల్ల ఆకర్షణ శక్తి, సృజనాత్మకత పెరుగుతాయి.
6. శనివారం (నలుపు/ముదురు నీలం): ఈ రోజు శనిదేవునికి అంకితం చేయబడింది. శని భగవానుడికి నలుపు, ముదురు నీలం, లేదా ముదురు గ్రే రంగులు ప్రీతికరమైనవి. ఈ రోజు ఈ రంగుల దుస్తులు ధరించడం వల్ల శని దోషాల ప్రభావం తగ్గుతుందని నమ్ముతారు.
7. ఆదివారం (ఆరెంజ్/సూర్యుడి రంగులు): ఆదివారం నవగ్రహాల అధిపతి అయిన సూర్యభగవానుడి రోజు. సూర్యుడు కీర్తి ప్రతిష్టలకు, ఆరోగ్యానికి కారకుడు. ఈ రోజు కుంకుమ రంగు, నారింజ, ఎరుపు లేదా పసుపు రంగు దుస్తులు ధరించడం వల్ల సమాజంలో గౌరవం, తేజస్సు లభిస్తాయి.
రంగులు మన మనస్తత్వంపై తీవ్ర ప్రభావం చూపుతాయని సైన్స్ కూడా అంగీకరిస్తుంది. కాబట్టి, జ్యోతిష్య శాస్త్రం సూచించిన ఈ సాంప్రదాయ కలర్ గైడ్ను పాటించి మీ రోజులను మరింత విజయవంతంగా, సానుకూలంగా మార్చుకోండి!
(Disclaimer: ఈ కథనంలో పేర్కొన్న అప్పుల నుంచి విముక్తి, శనగలను నైవేద్యంగా సమర్పించే ఆచారం వంటి వివరాలు స్థానిక పురాణాలు, ఆలయ సంప్రదాయాలు, భక్తుల విశ్వాసాల ఆధారంగా ఇవ్వబడ్డాయి. వీటికి శాస్త్రీయ లేదా చారిత్రక ఆధారాలు నిర్ధారించబడలేదు. ఈ కథనం సమాచార ప్రయోజనం కోసం మాత్రమే ప్రచురించబడింది.)
మన దేశంలో రోజురోజుకూ వాహనాల సంఖ్య పెరుగుతున్నట్లే, రోడ్డు ప్రమాదాల సంఖ్య కూడా ఆందోళనకరంగా మారుతుంది. ట్రాఫిక్ రూల్స్పై సరైన అవగాహన లేకపోవడమే చాలా ప్రమాదాలకు ప్రధాన కారణం. సాధారణంగా మనం రోడ్లపై ప్రయాణించేటప్పుడు మధ్యలో లేదా పక్కన వేర్వేరు రకాల తెల్లటి, పసుపు రంగు లైన్స్ చూస్తుంటాం. చాలామంది వీటిని కేవలం రోడ్డు అందం కోసం వేసినవని అనుకుంటారు. కానీ ట్రాఫిక్ నిబంధనల ప్రకారం ప్రతి గీతకు ఒక నిర్దిష్టమైన అర్థం, చట్టపరమైన రూల్ ఉంది. వీటిని ఉల్లంఘిస్తే భారీ జరిమానాతో పాటు జైలు శిక్ష కూడా పడే అవకాశం ఉంది. వాహనదారులు ట్రాఫిక్ చలాన్ల బారిన పడకుండా, సురక్షితంగా ప్రయాణించడానికి ఈ రోడ్డు మార్కింగ్స్ వెనుక ఉన్న అసలు అర్థాలు ఇవే..
చిన్న చినన వైట్ లైన్స్రోడ్డు మధ్యలో చిన్న చిన్న గ్యాప్లతో ఉండే తెల్లటి గీతలు ఉంటే, ఆ రోడ్డుపై మీరు లేన్ మార్చుకోవచ్చని అర్థం. వెనుక నుంచి వచ్చే వాహనాలను గమనిస్తూ, సురక్షితంగా ఉన్నప్పుడు మాత్రమే మీరు వేరే వాహనాన్ని ఓవర్టేక్ చేయవచ్చు లేదా యూ టర్న్ తీసుకోవచ్చు.
బ్రేక్ లేకుండా తెల్లటి లైన్రోడ్డు మధ్యలో ఎక్కడా బ్రేక్ లేకుండా నేరుగా సాగిపోయే తెల్లటి లైన్ ఉంటే, అక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ మార్కింగ్ ఉన్న చోట లేన్ మారడం కానీ, ఓవర్టేక్ చేయడం కానీ, యూటర్న్ తీసుకోవడం కానీ పూర్తిగా నిషేధం. మీరు ఏ లేన్లో వెళ్తున్నారో అదే లేన్లో ప్రయాణించాల్సి ఉంటుంది. సాధారణంగా ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్న ఘాట్ రోడ్లు, మలుపుల్లో ఇవి ఉంటాయి.
బ్రేక్ లేని ఎల్లో లైన్రోడ్డుపై పసుపు రంగులో నాన్ స్టాప్ గీత ఉంటే.. అక్కడ ఓవర్టేక్ చేయడానికి అనుమతి ఉంటుంది కానీ మీ లేన్ను దాటి అవతలి వైపునకు వెళ్లడానికి వీల్లేదు. అంటే పసుపు గీత లోపల ఉంటూనే వేరే వాహనాన్ని దాటవచ్చు. అయితే వేర్వేరు రాష్ట్రాల్లో ఈ నియమాన్ని స్థానిక ట్రాఫిక్ పరిస్థితులను బట్టి కాస్త భిన్నంగా అమలు చేస్తుంటారు.
డబుల్ ఎల్లో లైన్స్రోడ్డు మధ్యలో పక్కపక్కనే రెండు పసుపు రంగు గీతలు ఉంటే.. అది అత్యంత కఠినమైన నియమంగా భావించాలి. ఈ గీతలను దాటడం అంటే ఒక రకమైన డివైడర్ను దాటడంతో సమానం. ఇక్కడ ఓవర్టేక్ చేయడం, లేన్ మారడం, యూటర్న్ తీసుకోవడం అస్సలు కుదరదు. ఈ నియమాన్ని ఉల్లంఘిస్తే ప్రమాదకరమైన డ్రైవింగ్ కింద భారీ చలాన్ విధిస్తారు.
నాన్ స్టాప్ లైన్ – బ్రేక్ లైన్రోడ్డుపై పక్కపక్కనే ఒక నిరంతర గీత, మరో విరిగిపోయిన గీత కలిసి ఉంటే.. మీరు ఏ వైపున ప్రయాణిస్తున్నారనేది ముఖ్యం. మీ వాహనం విరిగిపోయిన గీత ఉన్న వైపు ఉంటే, మీరు అవసరమైతే ఓవర్టేక్ చేయవచ్చు. అదే మీ వాహనం నాన్ స్టాప్ గీత వైపు ఉంటే మీరు ఓవర్టేక్ చేయడానికి లేదా లేన్ మారడానికి వీల్లేదు.
నియమాలు పాటించకపోతే..?భారతీయ మోటార్ వాహనాల చట్టం ప్రకారం రోడ్డు మార్కింగ్స్ను ఉల్లంఘించడం తీవ్రమైన నేరం. ఇలా నిబంధనలు దాటి ప్రమాదకరంగా డ్రైవింగ్ చేస్తే ట్రాఫిక్ పోలీసులు భారీగా జరిమానా విధించడమే కాకుండా ప్రమాద తీవ్రతను బట్టి డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేయడం మరియు జైలు శిక్ష విధించేందుకు కూడా చట్టంలో నిబంధనలు ఉన్నాయి.
ఎబోలా వైరస్ మరోసారి తీవ్రంగా విజృంభిస్తోంది. రోజురోజుకూ కేసులు, మరణాల సంఖ్య పెరుగుతుండటంతో మధ్య ఆఫ్రికా దేశమైన కాంగోలో ఆరోగ్య వ్యవస్థపై తీవ్ర ఒత్తిడి నెలకొంది. కాంగో ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం.. మే 15 నుంచి ఇప్పటివరకు దేశవ్యాప్తంగా మొత్తం 2,344 ఎబోలా కేసులు నమోదయ్యాయి. ఈ వైరస్ బారినపడి ఇప్పటికే 930 మంది ప్రాణాలు కోల్పోయారు. గత 24 గంటల్లోనే మరో 37 మంది మృతిచెందినట్లు అధికారులు వెల్లడించారు.
ప్రస్తుతం కాంగోలో వ్యాప్తి చెందుతున్న వైరస్ బుండిబుగ్యో (Bundibugyo) రకం ఎబోలా వైరస్గా అధికారులు గుర్తించారు. ఈ రకానికి సంబంధించిన వ్యాప్తిని మే 15న ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. అయితే ఈ వైరస్ను పూర్తిగా అరికట్టేందుకు ఇప్పటివరకు సమర్థవంతమైన వ్యాక్సిన్ లేదా ప్రత్యేక చికిత్స అందుబాటులో లేకపోవడం వైద్య వర్గాలను మరింత ఆందోళనకు గురిచేస్తోంది. దీంతో వ్యాధి నియంత్రణకు ప్రధానంగా బాధితులను గుర్తించడం, ఐసోలేషన్లో ఉంచడం, వైరస్ వ్యాప్తిని అడ్డుకునే చర్యలపైనే అధికారులు దృష్టి సారిస్తున్నారు.
ఎబోలా వైరస్ సాధారణంగా అడవి జంతువులు, ముఖ్యంగా పండ్ల గబ్బిలాల్లో ఉంటుంది. వైరస్ సోకిన జంతువులను వేటాడడం లేదా వాటి మాంసాన్ని (బుష్మీట్) తినడం ద్వారా ఈ వ్యాధి మనుషులకు సోకే అవకాశం ఉంటుంది. అనంతరం వైరస్ బారినపడిన వ్యక్తి రక్తం, లాలాజలం, చెమట, వాంతులు వంటి శరీర ద్రవాల ద్వారా కుటుంబ సభ్యులు, వైద్య సిబ్బంది లేదా ఇతరులకు కూడా సులభంగా వ్యాపిస్తుంది. ఈ వ్యాధి లక్షణాలు వెంటనే కనిపించవు. వైరస్ శరీరంలోకి ప్రవేశించిన తర్వాత సాధారణంగా 2 నుంచి 21 రోజుల మధ్య లక్షణాలు బయటపడతాయి.
ప్రారంభంలో అధిక జ్వరం, తలనొప్పి, తీవ్రమైన నీరసం, కండరాల నొప్పులు, గొంతు నొప్పి వంటి ఫ్లూ లేదా మలేరియాను పోలిన లక్షణాలు కనిపిస్తాయి. పరిస్థితి విషమిస్తే వాంతులు, విరేచనాలు, కాలేయం, మూత్రపిండాల పనితీరు దెబ్బతినడం, కొన్ని సందర్భాల్లో అంతర్గత, బాహ్య రక్తస్రావం కూడా సంభవించవచ్చు. పెరుగుతున్న కేసుల నేపథ్యంలో కాంగో ప్రభుత్వం అత్యవసర ఆరోగ్య చర్యలను ముమ్మరం చేసింది. బాధిత ప్రాంతాల్లో వైద్య బృందాలను మోహరించి, ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమాలు నిర్వహిస్తోంది. వైరస్ మరింత విస్తరించకుండా కట్టడి చేయడం ప్రస్తుతం అక్కడి అధికారులకు అతిపెద్ద సవాలుగా మారింది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Shubman Gill ODI Captaincy Record: భారత వన్డే క్రికెట్ సారథిగా శుభ్మన్ గిల్ ప్రయాణం ఆశించిన రీతిలో సాగడం లేదు. ఎంతో ఆశలతో బాధ్యతలు చేపట్టిన ఈ యువ సంచలనం, కెప్టెన్గా ఆడిన మొదటి 12 వన్డేల్లో ఘోరంగా నిరాశపరిచాడు. తాజాగా ఇంగ్లాండ్ చేతిలో వన్డే సిరీస్ కోల్పోవడంతో గిల్ సారథ్య పటిమపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. భారత వన్డే చరిత్రలో మొదటి 12 మ్యాచ్లలో అత్యంత పేలవమైన రికార్డు నమోదు చేసిన సారథుల జాబితాలో గిల్ కూడా చేరిపోయాడు.
నాలుగు సిరీస్లలో మూడింట్లో పరాజయం..!గత ఏడాది టీమిండియా వన్డే సారథిగా గిల్ బాధ్యతలు చేపట్టినప్పుడు అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ, ఇప్పటివరకు అతను నడిపించిన నాలుగు సిరీస్లలో భారత్ ఏకంగా మూడింటిని కోల్పోయింది. కేవలం బలహీనమైన అఫ్గానిస్థాన్పై మాత్రమే సిరీస్ విజయం సాధించగలిగింది. ఇంగ్లాండ్తో జరిగిన వన్డే సిరీస్లో తొలి మ్యాచ్ గెలిచినప్పటికీ, ఆ తర్వాత వరుసగా రెండు మ్యాచ్ల్లో ఓడిపోయి సిరీస్ను సమర్పించుకోవడం గిల్ నాయకత్వ సామర్థ్యాన్ని మరింత ప్రశ్నార్థకం చేసింది.
తొలి 12 వన్డేల తర్వాత భారత కెప్టెన్ల రికార్డులు ఇవే..!సారథిగా మొదటి 12 వన్డేల ప్రదర్శనను పరిశీలిస్తే, టీమిండియాను నడిపించిన మహామహుల రికార్డులు ఆసక్తికరంగా ఉన్నాయి. రోహిత్ శర్మ 83.34 గెలుపు శాతంతో (10 విజయాలు) అగ్రస్థానంలో ఉండగా, విరాట్ కోహ్లీ 75 శాతం విజయాలతో (9 విజయాలు) రెండో స్థానంలో ఉన్నాడు. అనూహ్యంగా అజయ్ జడేజా, కేఎల్ రాహుల్ చెరో 8 విజయాలతో 66.67 శాతంతో తదుపరి స్థానాల్లో నిలిచారు.
మొదటి 12 మ్యాచ్ల విజయాలు..రోహిత్ శర్మ: 83.34% (10 గెలుపు / 2 ఓటమి)
విరాట్ కోహ్లీ: 75% (9 గెలుపు / 3 ఓటమి)
కేఎల్ రాహుల్: 66.67% (8 గెలుపు / 4 ఓటమి)
కపిల్ దేవ్ / వీరేందర్ సెహ్వాగ్: 58.34% (7 గెలుపు / 5 ఓటమి)
శుభ్మన్ గిల్: 50% (6 గెలుపు / 6 ఓటమి)
ఎంఎస్ ధోని: 41.67% (5 గెలుపు / 6 ఓటమి)
సునీల్ గవాస్కర్: 25% (3 గెలుపు / 9 ఓటమి)
గణాంకాల ప్రకారం శుభ్మన్ గిల్ 50 శాతం గెలుపు శాతంతో (6 గెలుపు, 6 ఓటమి) నాలుగో అత్యంత పేలవమైన కెప్టెన్గా నిలిచాడు. ఇతనితో పాటు సౌరవ్ గంగూలీ, సురేష్ రైనా, మహమ్మద్ అజారుద్దీన్ కూడా మొదటి 12 మ్యాచ్లలో ఇదే 50 శాతం విజయాలను నమోదు చేశారు.
గిల్ వైఫల్యానికి కారణాలు ఏంటి?ప్రస్తుతం భారత జట్టు పునర్నిర్మాణ దశలో ఉండటం గిల్ కెప్టెన్సీపై తీవ్ర ప్రభావం చూపింది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వంటి దిగ్గజాలు జట్టులో ఉన్నప్పటికీ, తుది జట్టులో స్థిరత్వం లేకపోవడం గిల్కు పెద్ద మైనస్గా మారింది. సెలెక్టర్లు నిరంతరం మార్పులు చేయడంతో ఒక స్థిరమైన తుది జట్టును అతను నిర్మించుకోలేకపోయాడు. దీనికి తోడు జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా, నితీష్ కుమార్ రెడ్డి వంటి కీలక ఆటగాళ్లు గాయపడటంతో ద్వితీయ శ్రేణి బౌలర్లతోనే మ్యాచ్లు ఆడాల్సి రావడం గిల్కు శాపంగా మారింది.
ధోని బాటలో పుంజుకుంటాడా?అయితే గిల్ ఇప్పుడే నిరాశపడాల్సిన అవసరం లేదు. భారత దిగ్గజ కెప్టెన్ ఎంఎస్ ధోని కూడా తన తొలి 12 వన్డేల్లో కేవలం 5 విజయాలు (41.67 శాతం) మాత్రమే సాధించి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు. కానీ, ఆ తర్వాత తన తప్పుల నుంచి పాఠాలు నేర్చుకుని 2011 ప్రపంచకప్, 2013 ఛాంపియన్స్ ట్రోఫీలను భారత్కు అందించి మహానాయకుడిగా ఎదిగాడు. గిల్ కూడా ఇంగ్లాండ్ పర్యటనలోని వైఫల్యాలను సమీక్షించుకుని, నాయకుడిగా తన వ్యూహాలకు పదును పెట్టాల్సిన సమయం వచ్చింది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Papaya Leaves: బొప్పాయి ఆకులతో క్యాన్సర్కు చికిత్స చేయడం సాధ్యమేనా? ఇటీవలి పరిశోధనల నేపథ్యంలో ఈ ప్రశ్న వైద్య ప్రపంచంలో చర్చనీయాంశంగా మారింది. ప్రతిష్టాత్మక టాటా మెమోరియల్ సెంటర్లో నిర్వహించిన ఒక క్లినికల్ ట్రయల్ ప్రకారం, కీమోథెరపీ చేయించుకుంటున్న రోగులలో ప్లేట్లెట్ల పునరుద్ధరణను వేగవంతం చేయడానికి క్యారికా పపాయా ఆకు సారం సహాయపడుతుందని తెలిసింది. అయితే, ఈ అధ్యయనం ఇప్పుడు వివాదాన్ని రేకెత్తించింది.
ఈ పరిశోధన ‘గ్లోబల్ ఆంకాలజీ’ అనే క్లినికల్ ఆంకాలజీ జర్నల్లో ప్రచురితమైంది. అయితే కేరళకు చెందిన హెపటాలజిస్ట్ డాక్టర్ సిరియాక్ ఎబి ఫిలిప్స్ చేసిన ఫిర్యాదు మేరకు, ఆ జర్నల్ ఈ పత్రంపై ఆందోళన వ్యక్తం చేసింది. దీని అర్థం పరిశోధన తప్పు అని కాదు.. కానీ లేవనెత్తిన ప్రశ్నలపై జర్నల్ ప్రస్తుతం దర్యాప్తు చేస్తోందని మాత్రమే.
కీమోథెరపీని వాయిదా వేయడం లేదా మందు మోతాదును తగ్గించడంకీమోథెరపీ సమయంలో ప్లేట్లెట్ కౌంట్ గణనీయంగా పడిపోయిన సుమారు 200 మంది రోగులను ఈ అధ్యయనంలో చేర్చారు. పరిశోధకుల ప్రకారం, ప్లేసిబో గ్రూప్లోని వారితో పోలిస్తే, CPLE పొందిన రోగులలో ప్లేట్లెట్లు నాలుగవ రోజు నుండే వేగంగా పెరగడం ప్రారంభించాయి. అంతేకాకుండా, ఈ రోగులకు కీమోథెరపీని వాయిదా వేయడం లేదా మోతాదును తగ్గించడం వంటి అవసరం తక్కువగా వచ్చింది. అధ్యయనం ప్రకారం, ప్లేసిబో గ్రూప్లోని 43 శాతంతో పోలిస్తే, CPLE పొందిన రోగులలో కేవలం 25 శాతం మంది మాత్రమే చికిత్సను ఆలస్యం చేయాల్సి వచ్చింది లేదా మోతాదును తగ్గించుకోవాల్సి వచ్చింది. అధ్యయనం సమయంలో ఎలాంటి తీవ్రమైన దుష్ప్రభావాలు బయటపడలేదు. సుమారు 10 రోజుల పాటు సాగే ఈ సహాయక చికిత్సను దాదాపు రూ.300 ఖర్చుతో పూర్తి చేయవచ్చు.
అధ్యయనంలో అవకతవకలు జరిగినట్లు అనుమానం:డాక్టర్ సిరియాక్ ఎబి ఫిలిప్స్ సోషల్ మీడియాలో ఈ పరిశోధనను ఒక తీవ్రమైన విషయంగా పేర్కొంటూ ప్రశ్నించారు. ఈ అధ్యయనంలో అవకతవకలు జరిగే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, టాటా మెమోరియల్ సెంటర్లోని ఒక శాస్త్రవేత్తఆందోళన వ్యక్తం చేయడం అనేది కేవలం దర్యాప్తు ప్రక్రియలో భాగమేనని, దానిని ఎలాంటి శాస్త్రీయ అవకతవకలకు లేదా మోసానికి సాక్ష్యంగా పరిగణించలేమని పేర్కొన్నారు. ఈ అధ్యయన సహ రచయిత, సీనియర్ ఆంకాలజిస్ట్ డాక్టర్ కుమార్ ప్రభాష్, ఈ పరిశోధన పూర్తిగా శాస్త్రీయ పద్ధతిలో నిర్వహించబడిందని, అంతర్జాతీయ పీర్ రివ్యూ తర్వాత ప్రచురిమైందని పేర్కొన్నారు. ఈ అధ్యయనాన్ని 2025లో అమెరికన్ సొసైటీ ఆఫ్ క్లినికల్ ఆంకాలజీ వార్షిక సమావేశంలో కూడా సమర్పించారని ఆయన తెలిపారు. ఫలితాలు ప్రతికూలంగా వచ్చినా కూడా, వాటిని ప్రచురించి ఉండేవారని ఆయన జోడించారు.
బొప్పాయి ఆకులు క్యాన్సర్ను నయం చేస్తాయా?ఈలోగా ప్రధాన పరిశోధకుడు డాక్టర్ వికాస్ ఓస్త్వాల్, తమ బృందం కనుగొన్న విషయాలన్నింటికీ కట్టుబడి ఉందని పేర్కొన్నారు. ఆ జర్నల్ ఇంకా పరిశోధక బృందాన్ని ఎలాంటి శాస్త్రీయ ప్రశ్నలు అడగలేదు. ఒకవేళ ఏవైనా ప్రశ్నలు తలెత్తితే, వాటికి శాస్త్రీయ ప్రక్రియ ప్రకారం సమాధానాలు అందిస్తారు. టీఎంసీకి చెందిన మరో ఆంకాలజిస్ట్ కూడా, ఒక అధ్యయనాన్ని ప్రశ్నించడం తప్పు కానప్పటికీ, తుది నిర్ణయం సోషల్ మీడియా ఆధారంగా కాకుండా, శాస్త్రీయ పరిశోధన, ఆధారాల ఆధారంగా తీసుకోవాలని పేర్కొన్నారు. ఈ సమయంలో బొప్పాయి ఆకులు క్యాన్సర్కు నివారణ అని చెప్పడం సరైనది కాదని ఆ శాస్త్రవేత్త తెలిపారు.
(గమనిక: ఈ సమాచారం పరిశోధన అధ్యయనాలు, నిపుణుల అభిప్రాయంపై ఆధారపడి ఉంది. ఇది వైద్య సలహాకు ప్రత్యామ్నాయం కాదు. ఏదైనా కొత్త కార్యాచరణ చేపట్టే ముందు వైద్యులను సంప్రదించడం ఉత్తమం.)
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
వర్షాకాలంలో చాలా మందిని వేధించే ప్రధాన సమస్య జుట్టు రాలడం. వర్షంలో తడవడం వల్లే జుట్టు ఎక్కువగా రాలిపోతుందని, వర్షపు నీరు జుట్టును బలహీనపరుస్తుందని చాలా మంది నమ్ముతుంటారు. కానీ నిపుణుల అభిప్రాయం ప్రకారం.. వర్షపు నీరు నేరుగా జుట్టు రాలడానికి కారణం కాదు. దానికి బదులుగా, వర్షంలో తడిచిన తర్వాత జుట్టును సరిగ్గా సంరక్షించుకోకపోవడమే దీనికి ప్రధాన కారణం. వర్షపు నీరు, వాతావరణంలోని తేమ, కాలుష్యం మిశ్రమం తల చర్మం, జుట్టు ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయి. ఈ వర్షాకాలంలో మీ జుట్టును సురక్షితంగా ఉంచుకోవడానికి నిపుణులు చెబుతున్న నిజాలు ఏంటో తెలుసుకుందాం..
జుట్టు రాలడానికి వర్షపు నీరు నేరుగా కారణం కాదు..క్యాపిల్లరీ హాస్పిటల్ నిపుణుల ప్రకారం.. వర్షపు నీరు నేరుగా జుట్టును రాల్చదు. అయితే వర్షంలో తడిచిన తర్వాత గాలిలో ఉండే అధిక తేమ కారణంగా జుట్టు చాలాసేపు తడిగా ఉండిపోతుంది. ఇలాంటి సమయంలో బయట ఉండే దుమ్ము, ధూళి, కాలుష్య కణాలు తల చర్మానికి సులభంగా అంటుకుంటాయి. ఈ పరిస్థితి జుట్టు ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపి, కుదుళ్లను బలహీనపరుస్తుంది.
సిటీల్లో కురిసే వర్షపు నీరు ప్రమాదకరమా?ప్రముఖ చర్మవ్యాధి నిపుణురాలు డాక్టర్ సురుచి పూరి ప్రకారం.. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో కురిసే వర్షపు నీరు పూర్తిగా స్వచ్ఛమైనది కాదు. ఇది పారిశ్రామిక పొగలు, వాహన కాలుష్యం, వాతావరణంలోని రసాయనాలను గ్రహించి, కాస్త ఆమ్లంగా మారుతుంది. ఇటువంటి యాసిడ్ నీరు తల చర్మం pH సమతుల్యతను దెబ్బతీస్తుంది. ఫలితంగా తలపై దురద, తీవ్రమైన చుండ్రు, ఇన్ఫెక్షన్లు మరియు జుట్టు రాలడం వంటి సమస్యలు ఎదురవుతాయి.
ఫంగల్ ఇన్ఫెక్షన్ల ముప్పువర్షాకాలంలో గాలిలో తేమ ఎక్కువగా ఉండటం వల్ల తల చర్మం ఎక్కువ సేపు ఆరదు. ఈ తేమ శిలీంధ్రాలు, బ్యాక్టీరియా పెరగడానికి అనుకూలమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది. జుట్టు ఎక్కువ సేపు తడిగా ఉంటే, ఫంగల్ ఇన్ఫెక్షన్ల ప్రమాదం పెరుగుతుంది. ఇది జుట్టు కుదుళ్లను లోపలి నుండి బలహీనపరిచి, జుట్టు విపరీతంగా రాలడానికి కారణమవుతుంది. అంతేకాకుండా తడి జుట్టు చాలా సున్నితంగా ఉంటుంది కాబట్టి, దానిని గట్టిగా కట్టడం లేదా బలంగా దువ్వడం వల్ల కూడా జుట్టు విరిగిపోతుంది.
వర్షంలో తడిచిన తర్వాత జుట్టు రక్షణకు సింపుల్ చిట్కాలు..హెయిర్ వాష్ : మీరు వర్షంలో తడిసి ఇంటికి రాగానే మొదటగా చేయాల్సిన పని జుట్టును శుభ్రమైన నీటితో క్షుణ్ణంగా కడగడం. దీనివల్ల వర్షపు నీటిలోని దుమ్ము, కాలుష్యం, ఆమ్ల పదార్థాలు తొలగిపోతాయి. ఆ తర్వాత సల్ఫేట్ లేని తేలికపాటి షాంపూతో తలస్నానం చేయడం ఉత్తమం.
పొడిగా ఉంచుకోండి: జుట్టును ఎక్కువ సేపు తడిగా ఉంచకూడదు. తలస్నానం చేసిన తర్వాత మెత్తని టవల్తో తల చర్మాన్ని అద్ది ఆరబెట్టండి.
ముందస్తు రక్షణ: వీలైనంత వరకు బయటకు వెళ్ళేటప్పుడు గొడుగు లేదా టోపీని ఉపయోగించడం మంచిది. అలాగే బయటకు వెళ్ళే ముందు లీవ్ ఇన్ కండిషనర్ లేదా హెయిర్ సీరమ్ అప్లై చేయడం వల్ల, అది జుట్టుపై ఒక రక్షణ పొరను ఏర్పరచి, కాలుష్యం నేరుగా జుట్టులోకి ప్రవేశించకుండా నిరోధిస్తుంది.
మొత్తమ్మీద జుట్టు రాలడానికి వర్షపు నీరు మాత్రమే కారణం కాదు, మన నిర్లక్ష్యమే ప్రధాన కారణం. వర్షంలో తడిచిన తర్వాత సరైన జుట్టు సంరక్షణ తీసుకోకపోతే చుండ్రు, ఫంగల్ ఇన్ఫెక్షన్లు రావడం ఖాయం.
ఎప్పటిలాగే ఈ వారం కూడా ఓటీటీలోకి పలు కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ లు రానున్నాయి. టోవినో థామస్ పళ్లిచట్టంబి, దీవానా, కాన్ సిటీ వంటి సినిమాలతో పాటు ముసాఫిర్ కేఫ్, ఆదర్శ బాల విద్యాలయ వంటి వెబ్ సిరీస్ లు ఓటీటీల్లో సందడి చేయనున్నాయి. వీటి సంగతి పక్కన పెడితే.. గత వారం ఓటీటీలోకి వచ్చిన ఓ తెలుగు సినిమా దుమ్మురేపుతోంది. యాక్షన్ కు తోడు ఫ్యామిలీ ఎలిమెంట్స్ పుష్కలంగా ఉండడంతో ఈ సినిమా కేవలం టాలీవుడ్లోనే కాకుండా యావత్ సౌత్ ఇండియా డిజిటల్ మార్కెట్ను శాసిస్తోంది. తెలుగుతో పాటు కన్నడ, మలయాళం, తమిళం భాషల్లో ట్రెండింగ్ నంబర్ వన్ గా కొనసాగుతోంది. ప్రస్తుతం ఈ నాలుగు భాషల్లోనూ అత్యధిక వ్యూస్తో నంబర్ వన్ స్థానంలో దూసుకుపోతూ సరికొత్త రికార్డులను సృష్టిస్తోందీ తెలుగు సినిమా. ఒక సాధారణ గృహిణి తన కుటుంబాన్ని రక్షించుకోవడానికి చేసే పోరాటం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ప్రస్తుతం ఓటీటీ ఆడియెన్స్ కు
పర్ఫెక్ట్ ఛాయిస్గా మారిన ఈ చిత్రం రాబోయే రోజుల్లో మరిన్ని డిజిటల్ రికార్డులను తిరగరాయడం ఖాయంగా కనిపిస్తోంది.
ప్రస్తుతం సౌత్ ఇండియాలోనే ట్రెండింగ్ నంబర్ వన్ గా కొనసాగుతూ ఓటీటీని షేక్ చేస్తోన్న ఆ సినిమా మరేదో కాదు సమంత నటించిన మా ఇంటి బంగారం. థియేటర్లలో రూ. 100 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించిన ఈ సినిమా జులై 17న జియో హాట్ స్టార్ ఓటీటీలోకి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే స్ట్రీమింగ్ కు వచ్చిన రెండు రోజుల్లోనే ఈ మూవీ ట్రెండింగ్ నంబర్ వన్ గా దూసుకెళ్లిపోయింది. తెలుగుతో పాటు ఇతర దక్షిణాది భాషల్లోనూ సామ్ సినిమాకు సూపర్బ్ రెస్పాన్స్ వస్తోంది.
ఇక మా ఇంటి బంగారం సినిమా విషయానికి వస్తే.. నందిని రెడ్డి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.
ట్రాలాలా పిక్చర్స్ బ్యానర్ మీద సమంత, రాజ్ నిడిమోరు, హిమాంక్ దువ్వూరు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. సమంతతో పాటు శ్రీనివాస గవిరెడ్డి, మంజూష, దిగంత్, గుల్షన్ దేవయ్య, శ్రీముఖి, గౌతమీ, ఆనంద్, లక్ష్మీ తదితరులు ఈ మూవీలో కీలక పాత్రలు పోషించారు. సంతోష్ నారాయణన్ ఈ సినిమాకు స్వరాలు సమకూర్చారు.
Critics ni kuda Kottesaam… adhe abba Prematho! #MaaIntiBangaaram streaming now on JioHotstar! #MaaIntiBangaaramOnJioHotstar pic.twitter.com/diHA5GPNAh
— JioHotstar Telugu (@JioHotstarTel_) July 19, 2026
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కూకట్పల్లి పరిధిలోని కెపిహెచ్బీ కాలనీలో ఓ తల్లి, చిన్నారి లిఫ్ట్లో ఇరుక్కుపోయిన ఘటన కలకలం రేపింది. వారి ఆర్తనాదాలు విన్న స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. డయల్-100కు సమాచారం అందిన వెంటనే పోలీసులు వేగంగా స్పందించి, ఇద్దరినీ సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు.
పోలీసుల తెలిపిని వివరాల ప్రకారం, కెపిహెచ్బీ 9వ ఫేజ్లో ఉన్న కోటక్ మహీంద్రా బ్యాంక్ భవనంలోని లిఫ్ట్లో ఓ మహిళ తన చిన్నారితో కలిసి ప్రయాణిస్తుంది. ఇంతలో సాంకేతిక లోపం కారణంగా లిఫ్ట్ మధ్యలోనే నిలిచిపోయింది. దీంతో తల్లి, చిన్నారి కొంతసేపు లిఫ్ట్లోనే చిక్కుకుపోయారు. ఆందోళనకు గురైన వారు సహాయం కోసం ప్రయత్నించగా, డయల్-100 ద్వారా పోలీసులకు సమాచారం అందింది.
సమాచారం అందుకున్న కెపిహెచ్బీ పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని, భవన సిబ్బంది సహకారంతో సహాయక చర్యలు చేపట్టారు. అప్రమత్తంగా వ్యవహరించిన పోలీసులు లిఫ్ట్ తలుపులు తెరిపించి, తల్లి, చిన్నారిని ఎలాంటి ప్రమాదం జరగకుండా సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. ఈ ఘటనలో ఇద్దరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. సకాలంలో స్పందించి తమ ప్రాణాలను కాపాడిన పోలీసులకు బాధితులు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.
లిఫ్ట్లలో సాంకేతిక లోపాలు తలెత్తినప్పుడు భయాందోళనకు గురికాకుండా అత్యవసర అలారం లేదా హెల్ప్లైన్ ద్వారా సమాచారం ఇవ్వాలని, లిఫ్ట్ తలుపులు బలవంతంగా తెరవడానికి ప్రయత్నించవద్దని పోలీసులు సూచించారు.
వీడియోను ఇక్కడ చూడండి..
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
పెళ్లి నాడు ఏడడుగులు నడిచేటప్పుడు సుఖదుఃఖాలలోనే కాదు, మరణంలోనూ తోడుంటామని ప్రమాణం చేస్తారు. కానీ, ఆ మాటను నిజం చేస్తూ, మరణంలోనూ కలిసే ప్రయాణించిన ఒక అరుదైన జంట ఉదంతం శ్రీ సత్యసాయి జిల్లాలో వెలుగుచూసింది. జీవితాంతం ఒకరికొకరు తోడునీడగా జీవించిన ఆ వృద్ధ దంపతులు, మరణంలోనూ విడిపోలేక ఒకే రోజు, ఒకే సమయంలో కన్నుమూశారు. ఈ హృదయ విదారక ఘటన స్థానికులను తీవ్రంగా కలచివేసింది. అసలేం జరిగిందంటే..
వివరాల్లోకి వెళ్తే.. శ్రీ సత్యసాయి జిల్లా రొళ్ల మండలం రత్నగిరి గ్రామానికి చెందిన 95 ఏళ్ల మల్లప్ప, 88 ఏళ్ల లింగమ్మ దంపతులు దశాబ్దాలుగా ఎంతో అన్యోన్యంగా జీవిస్తున్నారు. వీరికి ఐదుగురు సంతానం ఉన్నారు. అయితే, గత కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న మల్లప్ప ఆరోగ్యం క్షీణించడంతో ఇంట్లోనే తుదిశ్వాస విడిచారు.
దశాబ్దాలుగా తన ప్రతి అడుగులోనూ తోడుగా ఉంటూ, ప్రాణంగా చూసుకున్న భర్త ఇక లేడనే చేదు నిజాన్ని భార్య లింగమ్మ తట్టుకోలేకపోయారు. కళ్లముందే భర్త నిర్జీవంగా పడి ఉండటాన్ని చూసి ఆమె గుండె పగిలింది. ఆ తీవ్ర బాధను జీర్ణించుకోలేక, భర్త మరణించిన కేవలం ఐదు నిమిషాల వ్యవధిలోనే ఆమె కూడా ఒక్కసారిగా గుండె ఆగి అక్కడికక్కడే కన్నుమూశారు.
ఒకే రోజు, కేవలం ఐదు నిమిషాల తేడాతో దంపతులిద్దరూ మరణించడంతో రత్నగిరి గ్రామంలో ఒక్కసారిగా విషాదఛాయలు అలముకున్నాయి. తల్లిదండ్రుల అకాల మరణంతో వారి ఐదుగురు సంతానం, బంధువులు కన్నీరు మున్నీరవుతున్నారు. జీవితాంతం కలిసి బతికిన ఈ పుణ్య దంపతులు, చనిపోయేటప్పుడు కూడా ఒకరినొకరు విడిచి ఉండలేక కలిసే వెళ్లడం చూసి స్థానికులు ముక్కున వేలేసుకుంటున్నారు.
ఎంత పుణ్యం చేసుకుంటేనో ఇలాంటి చావు దక్కుతుంది.. బతికినంత కాలం ఆదర్శంగా జీవించి, పోయేటప్పుడు కూడా కలిసే వెళ్లారు అంటూ గ్రామస్థులు ఆ వృద్ధ దంపతుల పార్థివ దేహాలకు కన్నీటి వీడ్కోలు పలికారు. ప్రతీ ఒక్కరిని కదిలించిన ఈ ప్రేమ జంట ప్రయాణం ప్రస్తుతం సోషల్ మీడియాలోనూ అందరినీ భావోద్వేగానికి గురిచేస్తోంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..
Team India: లండన్లోని చారిత్రాత్మక లార్డ్స్ మైదానంలో ఇంగ్లాండ్తో జరిగిన మూడో వన్డేలో భారత జట్టు 27 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. 388 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ అద్భుత పోరాటం చేసినప్పటికీ, యువ ఆటగాళ్ల వరుస వైఫల్యం భారత్ కొంపముంచింది. ఈ ఓటమిపై భారత మాజీ కెప్టెన్, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
సీనియర్లు మెరిసినా తప్పని పరాజయం: మ్యాచ్లో అసలు ఏం జరిగింది?ఇంగ్లాండ్ విధించిన 388 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమ్ ఇండియాను నాథన్ బౌండరీలు, బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్లతో కెప్టెన్ రోహిత్ శర్మ (138), విరాట్ కోహ్లీ (74), శుభ్మన్ గిల్ (77) విజయతీరాలకు చేర్చేందుకు ప్రయత్నించారు. తొలి వికెట్కు గిల్, రోహిత్ శతక భాగస్వామ్యాన్ని నెలకొల్పడమే కాకుండా, విరాట్ కోహ్లీతో కలిసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు.
ఇది కూడా చదవండి: రోహిత్ శర్మ లేకుండానే స్వ్కాడ్.. 2027 వన్డే ప్రపంచకప్లో బరిలోకి దిగే భారత జట్టు ఇదే..?
ఈ ముగ్గురు అగ్రశ్రేణి బ్యాటర్లే ఏకంగా 289 పరుగులు రాబట్టడం విశేషం. అయితే వీరు అవుటైన తర్వాత వచ్చిన మిగిలిన ఆరుగురు బ్యాటర్లు కలిసి కేవలం 71 పరుగులు మాత్రమే సాధించగలిగారు. ఫలితంగా 360 పరుగుల వద్ద భారత ఇన్నింగ్స్ ముగిసి, కీలకమైన మ్యాచ్తో పాటు సిరీస్ను సైతం కోల్పోవాల్సి వచ్చింది.
డెత్ ఓవర్లలో ఘోరంగా విఫలమైన బౌలింగ్ విభాగం..కేవలం మిడిల్ ఆర్డర్ బ్యాటింగ్ మాత్రమే కాదు, బౌలింగ్ విభాగంలో డెత్ ఓవర్ల వైఫల్యం కూడా భారత్ ఓటమికి ప్రధాన కారణమైంది. ఆఖరి ఐదు ఓవర్లలో ఇంగ్లాండ్ బ్యాటర్లు విరుచుకుపడి ఏకంగా 82 పరుగులు పిండుకున్నారు.
ఇది కూడా చదవండి: ఓపెనర్లుగా అభిషేక్, వైభవ్.. మిడిల్లో మరో డేంజరస్ ప్లేయర్.. టీమిండియా ప్లేయింగ్ 11 ఇదే..!
గుర్నూర్ బ్రార్, హర్షదీప్ సింగ్, ప్రిన్స్ యాదవ్, ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్ను ప్రత్యర్థి బ్యాటర్లు చీల్చి చెండాడారు. జోస్ బట్లర్ కేవలం 13 బంతుల్లోనే 41 పరుగులు చేసి మ్యాచ్ స్వరూపాన్ని మార్చేశాడు. భారత జట్టు ఇంగ్లాండ్ను 350 పరుగుల లోపే కట్టడి చేసి ఉంటే ఫలితం కచ్చితంగా వేరేలా ఉండేదని విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు.
యువ ఆటగాళ్లకు గంగూలీ కడిగిపారేసే హెచ్చరిక..జట్టు ఓటమిపై స్పందించిన భారత క్రికెట్ దిగ్గజం సౌరవ్ గంగూలీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. యువ ఆటగాళ్లు ఎల్లప్పుడూ సీనియర్లపై ఆధారపడడం మానుకోవాలని హితవు పలికారు.
“ప్రతిసారీ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలే మ్యాచ్లు గెలిపించాలని కోరుకోవడం సరికాదు. రేపు ఒకవేళ ఈ ఇద్దరు మహానాయకులు జట్టుకు దూరమైతే టీమ్ ఇండియా పరిస్థితి ఏంటి? ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ వంటి ఆటగాళ్లు బాధ్యతారాహిత్యంగా ఆడడం నిరాశపరిచింది. ఇంగ్లాండ్ కెప్టెన్ జోస్ బట్లర్ ఆడిన తరహా మెరుపు ఇన్నింగ్స్ మన కుర్రాళ్ల నుంచి ఒక్కటి వచ్చినా విజయం మనదే అయ్యేది. రాబోయే భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని యువ ఆటగాళ్లు బాధ్యతతో ఆడటం నేర్చుకోవాలి” అని గంగూలీ ఘాటుగా విమర్శించారు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
ఛత్తీస్గఢ్లోని బిలాస్పూర్ జిల్లాలో వెలుగులోకి వచ్చిన రూ.17.24 కోట్ల పాముకాటు పరిహార కుంభకోణం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. నకిలీ పాముకాటు మరణాల కేసులు సృష్టించి ప్రభుత్వ పరిహారాన్ని అక్రమంగా స్వాహా చేశారనే ఆరోపణలపై పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఇప్పటివరకు 14 ఎఫ్ఐఆర్లు నమోదు చేసి, పలువురు అధికారులు, ఉద్యోగులను అరెస్టు చేసినట్లు అధికారులు వెల్లడించారు.
ఈ వ్యవహారం బెల్తారా ఎమ్మెల్యే సుశాంత్ శుక్లా అసెంబ్లీలో కాల్ అటెన్షన్ మోషన్ ద్వారా ప్రస్తావించడంతో వెలుగులోకి వచ్చింది. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం దీనిని తీవ్రంగా పరిగణించి ఉన్నతస్థాయి విచారణకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో పోలీసులు, పరిపాలన యంత్రాంగం సంయుక్తంగా దర్యాప్తు ప్రారంభించి, పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు చేశారు.
బిలాస్పూర్ ఎస్ఎస్పీ రజనీష్ సింగ్ పర్యవేక్షణలో కొనసాగుతున్న దర్యాప్తులో నకిలీ పాముకాటు నివేదికలు, తప్పుడు పత్రాల సృష్టి, పరిహార ఆమోదాల్లో అక్రమాలు, నిధుల పంపిణీలో జరిగిన అవకతవకలపై అధికారులు లోతుగా విచారణ చేపడుతున్నారు. కుట్రలో భాగమైన వారిని గుర్తించేందుకు బ్యాంకు ఖాతాలు, ఆర్థిక లావాదేవీలు, అధికారిక రికార్డులను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.
ఈ కేసులో అత్యంత ఆశ్చర్యకరమైన అంశం గణాంకాల్లో బయటపడింది. గత మూడేళ్లలో జష్పూర్ జిల్లాలో కేవలం 96 పాముకాటు మరణాలు నమోదవగా, ఒక్క బిలాస్పూర్ జిల్లాలోనే 431 మరణాలు నమోదైనట్లు చూపించి దాదాపు రూ.17.24 కోట్ల పరిహారం క్లెయిమ్ చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఈ భారీ వ్యత్యాసమే అధికారుల్లో అనుమానాలకు దారితీసి కుంభకోణాన్ని వెలుగులోకి తీసుకొచ్చింది.
ఈ ఘటనపై అసెంబ్లీలో తీవ్ర చర్చ జరగగా, రెవెన్యూ మంత్రి టంకారామ్ వర్మ పూర్తి స్థాయి దర్యాప్తు నిర్వహించి దోషులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతుండగా, మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. ఈ కుంభకోణంలో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశముందని అధికారులు పేర్కొన్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
మానవ-వన్యప్రాణి సంఘర్షణ పరాకాష్టకు చేరుకుందని నిరూపిస్తూ, నేపాల్లో ఒక విస్మయకరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. పాములు పగబడతాయనే నమ్మకం ఉన్నప్పటికీ, ఇప్పుడు ఏనుగులు కూడా పగబడుతాయనే వార్త ఆశ్చర్యం కలిగిస్తోంది. సినిమాల్లో కనిపించే విధంగా, ధ్రుబే అనే ఏనుగు సరిగ్గా పద్నాలుగేళ్ల తర్వాత తిరిగి వచ్చి ఒకే కుటుంబంలో నలుగురిని బలితీసుకుంది.నేపాల్లోని చిత్వాన్ నేషనల్ పార్క్ సమీపంలో నివసించే శనిచర బోటే కుటుంబం ఈ విషాదానికి గురైంది. 2012 డిసెంబర్లో ధ్రుబే ఏనుగు దాడిలో శనిచర తల్లిదండ్రులు ప్రాణాలు కోల్పోయారు. ఆ భయంతో తన ప్రాణాలు కాపాడుకోవడానికి శనిచర, రాప్తి నది దాటి తొమ్మిది మైళ్ళ దూరంలోని జగత్పూర్కు వలస వెళ్ళాడు. ఇంత దూరం వస్తే ఏనుగు భయం ఉండదని భావించాడు.కానీ విధి విచిత్ర నాటకంలో భాగంగా, పద్నాలుగేళ్ల తర్వాత అదే ధ్రుబే ఏనుగు జగత్పూర్కు చేరుకుని శనిచర ఇంటిపై దాడి చేసింది. ఈ తాజా దాడిలో అతని కోడలు ఆషికా బోటే, నాలుగేళ్ల మనవడు భరత్ బోటే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఒక్క ఏనుగే 2010 నుండి ఇప్పటివరకు ఏకంగా 25 మందిని పొట్టన పెట్టుకుంది. దీని భయానక చరిత్రపై వికీపీడియాలో ఒక ప్రత్యేక పేజీ కూడా ఉంది.
మరిన్ని వీడియోల కోసం :
ఇండస్ట్రీలో అక్కినేని హీరోల టైం మొదలైందా..?
విజయ్ ‘జన నాయగన్’ ఓపెనింగ్స్ పై ఆసక్తి
టాలీవుడ్లో యాక్షన్ లవ్ స్టోరీల ట్రెండ్
తెలంగాణ పల్లె కథల వైపు టాలీవుడ్ చూపు
కేవలం రూ. 999 ధరలో లభిస్తున్న బోట్ బేస్ హెడ్స్ 900 ‘మోన్స్టర్ హెడ్ఫోన్స్’, బేస్ లవర్స్కు ఒక పండగ లాంటివి. 40mm నియోడైమియమ్ డ్రైవర్స్, ఫోల్డబుల్ డిజైన్తో వస్తున్న ఈ హెడ్ఫోన్స్, గేమర్లకు, మ్యూజిక్ లవర్స్కు ఒక పర్ఫెక్ట్ ఎంపిక. ఆఫీస్ మీటింగ్స్ నుంచి హై-ఎండ్ గేమింగ్ వరకు, వైర్డ్ హెడ్ఫోన్స్లో అత్యుత్తమ అనుభవాన్ని అందించే ఈ బేస్హెడ్స్ 900 పూర్తి విశేషాలను వివరంగా తెలుసుకుందాం!
అదిరిపోయే సౌండ్ క్వాలిటీ‘బేస్హెడ్స్’ అని పేరు పెట్టినట్లుగానే, ఇందులో 40mm పవర్ఫుల్ నియోడైమియమ్ డ్రైవర్లను అందించారు. ఇది పాటల్లోని బేస్ను చాలా పంచ్గా, స్పష్టంగా వినిపిస్తుంది. బాస్ బూస్టెడ్ సాంగ్స్ లేదా రాప్స్ వింటున్నప్పుడు వచ్చే వైబ్రేషన్స్ ఒక అద్భుతమైన అనుభవాన్నిస్తాయి. హైస్, మిడ్స్ మధ్య సరైన బ్యాలెన్స్ ఉండటం వల్ల ప్రతీ ఇన్స్ట్రుమెంట్ సౌండ్ చాలా క్రిస్టల్ క్లియర్గా వినపడుతుంది.
కంఫర్ట్, ఫోల్డబుల్ డిజైన్సౌండ్తో పాటు కంఫర్ట్ కూడా చాలా ముఖ్యమని గుర్తించిన బోట్, దీనిని కేవలం 150 గ్రాముల బరువుతో తయారు చేసింది. ఇయర్ కప్స్పై ఉండే సాఫ్ట్ ప్యాడింగ్ వల్ల గంటల తరబడి వాడుకున్నా చెవులు నొప్పి పెట్టవు. దీనికి ఉన్న ‘ఫోల్డబుల్ డిజైన్’ వల్ల వీటిని మడతబెట్టి బ్యాగులో చాలా సులభంగా సర్దుకోవచ్చు. ప్రయాణాలు చేసేవారికి ఇది చాలా అనుకూలంగా ఉంటుంది.
బిల్ట్-ఇన్ మైక్ఆఫీస్ మీటింగ్స్ లేదా ఆన్లైన్ క్లాసుల కోసం ఇందులో ఇన్-లైన్ మైక్ను పొందుపరిచారు. మైక్ పక్కనే ఉండే బటన్తో సింగిల్ ప్రెస్లో కాల్స్ లిఫ్ట్ చేయడం, పాటలను పాజ్/ప్లే చేయడం చాలా సులభం. లాంగ్ ప్రెస్ చేస్తే గూగుల్ అసిస్టెంట్ లేదా సిరి యాక్టివేట్ అవుతాయి.
మూవీస్కి పర్ఫెక్ట్వైర్లెస్ బడ్స్లో ఉండే ‘ఆడియో డిలే’ సమస్య ఇందులో ఉండదు. వైర్డ్ కనెక్షన్ కాబట్టి, పబ్జీ, ఫ్రీఫైర్ వంటి గేమ్స్ ఆడేటప్పుడు ఎనిమీస్ అడుగుల శబ్దాలు పక్కాగా వినిపిస్తాయి. సినిమాల్లో థియేటర్ ఫీలింగ్ను పొందడానికి కూడా ఇవి చక్కగా సరిపోతాయి. రూ. 999 బడ్జెట్లో ఇంతకంటే మంచి వైర్డ్ హెడ్ఫోన్ మరొకటి లేదు. టాంగిల్-ఫ్రీ ఫ్లాట్ కేబుల్, గోల్డ్ ప్లేటెడ్ 3.5mm జాక్, బలమైన నిర్మాణం దీనిని అత్యుత్తమ ఎంపికగా మారుస్తాయి. స్టూడెంట్స్ నుంచి గేమర్స్ వరకు, ఆడియో క్వాలిటీతో రాజీ పడకూడదనుకునే ఎవరైనా ఈ బోట్ బేస్హెడ్స్ 900ని కళ్ళు మూసుకుని కొనేయవచ్చు.
భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన, అతిపెద్ద రియాలిటీ షో ‘బిగ్ బాస్’ ఈసారి ఆడియెన్స్ కోసం సరికొత్తగా ముస్తాబుకానుంది. రాబోయే బిగ్ బాస్ సీజన్ను మరింత రంగులమయం చేయడానికి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ జియోస్టార్ ఒక భారీ ప్రణాళికను ప్రకటించింది. అదేంటంటే.. బిగ్ బాస్ చరిత్రలోనే తొలిసారిగా తెలుగుతో సహా హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, బంగ్లా భాషల్లో ఒకేసారి ఈ బిగ్ బాస్ రియాలిటీ షో లాంఛ్ కానుంది. ఈ విషయాన్ని జియో హాట్ స్టార్ సంస్థ అధికారికంగా వెల్లడించింది. అంటే ఇకపై భాషల వారీగా బిగ్ బాస్ను చూడటానికి నెలల తరబడి వేచి ఉండాల్సిన అవసరం లేదు. తెలుగు, కన్నడ, హిందీ, తమిళం, మలయాళం, బంగ్లా వెర్షన్లు సెప్టెంబర్ నుంచి జియోస్టార్ టెలివిజన్ నెట్వర్క్ అలాగే ‘జియోహాట్స్టార్’ ఓటీటీ ప్లాట్ఫామ్లో ఏకకాలంలో ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి.
ఈసారి సౌరవ్ గంగూలీ కూడా..ఇక తెలుగు విషయానికి వస్తే.. ఇప్పటికే సక్సెస్ ఫుల్ గా 9 సీజన్లు పూర్తయ్యాయి. కాబట్టి ల్యాండ్ మార్క్ సీజన్ కోసం అట్టహాసంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈసారి కూడా నాగార్జునే హోస్ట్ గా వ్యవహరిస్తారని జియో హాట్ స్టార్ ప్రకటించింది. ఇక కన్నడ వెర్షన్కు కిచ్చా సుదీప్ హోస్ట్గా వ్యవహరించనున్నారు. అలాగే హిందీలో సల్మాన్ ఖాన్, తమిళంలో విజయ్ సేతుపతి, మలయాళంలో మోహన్లాల్ యధావిధిగా హోస్ట్లుగా కొనసాగుతారు. ఈసారి విశేషం ఏమిటంటే, భారత మాజీ క్రికెట్ జట్టు కెప్టెన్ సౌరవ్ గంగూలీ బెంగాలీ బిగ్ బాస్ ఎడిషన్ కు కొత్త హోస్ట్గా చేయనున్నారు.
ఈ మెగా లాంచ్ సందర్భంగా, జియోస్టార్ ‘ఇండియాస్ బిగ్ రియాలిటీ’ అనే పేరుతో ఒక ప్రత్యేక టేబుల్ పుస్తకాన్ని విడుదల చేసింది. బిగ్ బాస్ 20 ఏళ్ల ప్రయాణానికి సంబంధించి ఇందులో కొన్ని ఆసక్తికరమైన విషయాలను విడుదల చేశారు. అదేంటంటే.. 2025 నాటికి ఆరు భాషల్లో బిగ్ బాస్ రికార్డు స్థాయిలో 500 మిలియన్ల ప్రేక్షకులను సంపాదించుకుంది. ఒక్క దక్షిణ భారత రాష్ట్రాల్లోనే 3 కోట్లకు పైగా ప్రజలు బిగ్ బాస్ను చూస్తారట. ఇక్కడ ప్రతి 10 మంది టీవీ వీక్షకులలో 8 మంది బిగ్ బాస్ను చూస్తారట. ఇది దక్షిణ భారతదేశంలోని ఇతర అన్ని రియాలిటీ షోల సంయుక్త వీక్షకుల సంఖ్య కంటే 3.5 రెట్లు ఎక్కువ. జియోహాట్స్టార్లో ప్రతి 10 మంది వీక్షకులలో 6 మంది 24 గంటల లైవ్ ఫీడ్ను చూస్తున్నారు. 2025 సీజన్లో 1.7 బిలియన్ల సోషల్ మీడియా ఎంగేజ్మెంట్లు, 30 మిలియన్లకు పైగా యూజర్-జనరేటెడ్ మీమ్స్ ఉన్నాయని చూపే డేటాను జియోస్టార్ విడుదల చేసింది.
బిగ్ బాస్ కు ప్రజాదరణ పెరిగే కొద్దీ, ఈ షోకు స్పాన్సర్ల సంఖ్య కూడా భారీగా పెరుగుతోంది. 2025 నాటికి, 46 విభాగాలకు చెందిన 625కు పైగా బ్రాండ్లు ఈ షోతో భాగస్వామ్యం కుదుర్చుకున్నాయి. వీటిలో 49 కొత్త బ్రాండ్లు ఉన్నాయని జియో హాట్ స్టార్ వెల్లడించింది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
జులై 24న గ్రాండ్గా లాంచ్ కానున్న ఒప్పో K15, గేమింగ్, ఫొటోగ్రఫీ ప్రియుల కోసం ప్రత్యేకంగా రూపొందించబడింది. మీడియాటెక్ డైమెన్సిటీ 7360 చిప్సెట్, అడ్వాన్స్డ్ వేపర్ ఛాంబర్ కూలింగ్ సిస్టమ్, వేగవంతమైన 80W ఛార్జింగ్తో ఈ ఫోన్ మార్కెట్లో సంచలనం సృష్టించనుంది. భారీ బ్యాటరీ బ్యాకప్, పవర్ఫుల్ పెర్ఫార్మెన్స్ కోరుకునే వినియోగదారుల కోసం ఈ స్మార్ట్ఫోన్ ఎలాంటి ఫీచర్లను అందిస్తోందో తెలుసుకుందాం!
పవర్ఫుల్ పెర్ఫార్మెన్స్Oppo K15 స్మార్ట్ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7360 సూపర్ చిప్సెట్తో పనిచేస్తుంది. గేమింగ్ ఆడేటప్పుడు ఫోన్ వేడెక్కకుండా ఉండేందుకు ఇందులో ‘టైడల్ ఇంజిన్’, 4,950 చదరపు మిల్లీమీటర్ల భారీ వేపర్ ఛాంబర్ కూలింగ్ సిస్టమ్ను అమర్చారు. ఇది హెవీ టాస్క్లను కూడా ఎలాంటి ల్యాగ్ లేకుండా స్మూత్గా రన్ చేయడంలో సహాయపడుతుంది.
8000mAh భారీ బ్యాటరీఈ ఫోన్ ప్రధాన హైలైట్ దీని 8000mAh బ్యాటరీ. బ్యాటరీ మేనేజ్మెంట్ కోసం ఇందులో ప్రత్యేకంగా ‘గ్లేసియర్ బ్యాటరీ ఎనర్జీ గ్యాదరింగ్’ చిప్ను వాడారు. దీనికి తోడు 80W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్, బైపాస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉండటంతో బ్యాటరీని నిమిషాల్లో ఛార్జ్ చేసుకోవచ్చు.
సెల్ఫీలకు కేరాఫ్..ఫొటోగ్రఫీని ఇష్టపడే వారి కోసం ఒప్పో ఈ ఫోన్లో అద్భుతమైన కెమెరాలను అందించింది. వెనుక భాగంలో 50MP OIS ప్రైమరీ కెమెరా, 50MP అల్ట్రావైడ్ కెమెరా ఉన్నాయి. ఆశ్చర్యకరంగా, సెల్ఫీల కోసం కూడా 50MP కెమెరాను అందించడం విశేషం. ఇది కంటెంట్ క్రియేటర్లకు, సోషల్ మీడియా వాడేవారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.
అదనపు ఫీచర్లు- డిస్ప్లే: 6.59 అంగుళాల ఫ్లాట్ డిస్ప్లే.
- రక్షణ: IP69 రేటింగ్తో దుమ్ము, నీటి నుంచి పూర్తి రక్షణ.
- నావిగేషన్: డ్యూయల్ ఫ్రీక్వెన్సీ జీపీఎస్, బేదూ సపోర్ట్.
- డిజైన్: గేల్ గ్రే, రాపిడ్ వైట్ రంగుల్లో అందుబాటులో ఉంటుంది.
ఒప్పో K15 స్మార్ట్ఫోన్ తన భారీ బ్యాటరీ, బలమైన కెమెరా సెటప్తో మిడ్-రేంజ్ మార్కెట్లో ఒక శక్తివంతమైన ఎంపికగా నిలుస్తుంది. మీరు ఎక్కువ బ్యాటరీ బ్యాకప్, మంచి ఫోటోగ్రాఫిక్ అనుభవాన్ని కోరుకుంటే, జులై 24న లాంచ్ కానున్న ఈ ఫోన్ కోసం వేచి ఉండాల్సిందే! మీ గేమింగ్, డైలీ టాస్క్లను ఈ పవర్ ప్యాక్డ్ ఫోన్తో మరింత సులభంగా పూర్తి చేయండి!